Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అయోధ్య రాముడి నిధుల చోరీ కేసు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
posted on: Jun 29, 2026 2:05PM

అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి భక్తులు సమర్పించిన విరాళాలు, చందాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నిధుల చోరీపై నిష్పాక్షికంగా, అత్యంత వేగంగా, దర్యాప్తు జరపాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో, ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్లు సుప్రీం కోర్టును కోరారు. అయితే అత్యవసర విచారణకు నిరాకరిస్తూ సుప్రీం కోర్టు సోమవారం.. వెకేషన్ తరువాత ఈ పిటిషన్ ను లిస్ట్ చేస్తామని స్పష్టం చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన సుప్రీం వెకేషన్ ధర్మాసనం ఈ పిటిషన్ను ప్రస్తుత వేసవి సెలవుల అనంతరం, కోర్టు పునఃప్రారంభమయ్యాక సాధారణ జాబితాలో చేర్చి విచారిస్తామని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా వెకేషన్ బెంచ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ కేసును ఇప్పుడే, ఇంత అత్యవసరంగా విచారించకపోతే ఆకాశమేమీ విరిగిపడదు కదా.. ఇందులో అంత అత్యవసరమేముంది అంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. కోర్టులు సెలవుల్లో ఉన్న సమయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన, ప్రాణాలతో లేదా అత్యవసర రాజ్యాంగ సంక్షోభాలతో ముడిపడిన కేసులనే విచారిస్తామని.. ఈ నిధుల దుర్వినియోగం కేసు దర్యాప్తును సెలవుల తర్వాత కూడా పరిశీలించవచ్చని బెంచ్ స్పష్టం చేసింది.
మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు సాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ నిధుల గోల్ మాల్ కుంభకోణంపై విచారణ జరుపుతోంది. ఎవరెవరు ఈ నిధుల మళ్లింపునకు పాల్పడ్డారు, ఎక్కడికి ఈ చందాలు చేరాయి అనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. ఈ దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుండగానే.. అయోధ్య బార్ అసోసియేషన్ కూడా ఈ కేసులో రాముడి నిధులను దొంగిలించిన నిందితుల తరఫున అయోధ్యలోని ఏ లాయర్ కూడా వకాలత్ పుచ్చుకోకూడదనీ.. వారి తరఫున వాదించకూడదని తీర్మానించింది. ఒకవేళ ఈ నిబంధనను ఎవరైనా లాయర్ ధిక్కరిస్తే, వారికి రూ. 5 లక్షల భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.



.webp)


