ఒమన్ జలాల్లో భారత నౌకపై దాడి.. సిబ్బంది సురక్షితం

posted on: May 15, 2026 9:43AM

ఒమన్ జలాల్లో భారత నౌక  హాజీ అలీ పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆ నౌక మునిగిపోయింది.  కాగానౌకలోని 14 మంది సిబ్బంది సురక్షితంగా కాపాడినట్లు ఉన్నారు. వాణిజ్య నౌకలపై జరిగిన ఈ దాడి  ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్రం పేర్కొంది.   హాజీ అలీ  నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు  వెళ్తుండగా బుధవారం ( మే 13) తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.  ఈ దాడితో నౌకలో మంటలు చెలరేగి సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. వెంటనే స్పందించిన ఒమన్ కోస్ట్ గార్డ్ నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించి సమీపంలోని  పోర్టుకు తరలించారు.

ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది.  వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం సరికాదని పేర్కొంది.  స్వేచ్ఛా వాణిజ్యం, నౌకాయానానికి ఆటంకం కలిగించవద్దని హెచ్చరించింది.  ప్రకటనలో పేర్కొంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...