శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి.. 100 మంది గల్లంతు.. పలువురికి గాయాలు

posted on: Mar 4, 2026 4:25PM

శ్రీలంకలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి జరిగింది. ఇరాన్ ఐఆర్ఐఎష్ డెనా యుద్ధనౌక ఇటీవల విశాఖలో జరిగిన ప్రపంచ యుద్ధ నౌకల ప్రదర్శనలో పాల్గొన్న ఇరాన్ యుద్ధనౌక  ఐఆర్ఐఎస్ డెనా తిరుగు ప్రయాణంలో ఉండగా అమెరికా సబ్ మెరైన్ దాడికి పాల్పడింది.

ఈ దాడిలో నౌకలోని వంద మంది గల్లంతయ్యారనీ, మరో 78 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.  మునిగిపోతున్న ఈ ఓడ నుంచి శ్రీలంక నేవీ పలువురిని సురక్షితంగా కాపాడింది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చింది.  

ఇజ్రాయెల్-అమెరికాలతో  ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న వేళ శ్రీలంక తీరంలో  ఆ దేశ యుద్ధనౌకపై దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.  కాగా ఇరాన్ యుద్ధనౌకపై తమ తీరంలో జరిగిన దాడిని శ్రీలంక ధృవీకరించింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...