ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి

posted on: Apr 3, 2026 9:33AM

రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణపై కోడూరు టోల్ గేట్ వద్ద దాడి జరిగింది.ఈ‌మేరకు ఆమె పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఆమె ఫిర్యాదు మేరకు రైల్వేకోడూరు టోల్ గేట్ వద్ద పూలు కొనేందుకు వెళ్లిన హర్షవీణపై జనసేన  రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర నాయకత్వంలో కొందరు దాడికి పాల్పడ్డారు.

 తొలుత హర్షవీణ వెంట ఉండే గోపి అనే వ్యక్తిని చితకబాదారు. ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించినందుకు హర్షవీణపై కూడా దాడి చేశారు. అరవ శ్రీధర్ ను ప్రశ్నిస్తున్నందుకు పథకం ప్రకారం ఈ దాడికి దిగినట్లు హర్షవీణ ఆరోపించారు. ఈ దాడిపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...