ఏపీ నూతన సీఎస్ గా సాయిప్రసాద్.. బాధ్యతల స్వీకరణ ఎప్పుడంటే?

posted on: Feb 27, 2026 2:47PM

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా జీ. సాయిప్రసాద్ ను నియమించిన సంగతి విదితమే.   గత ఏడాది నవంబరు 29వ  ప్రస్తుత సిఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు మాసాలు అంటే ఈనెల 28  వరకూ పొడిగిస్తూ, అలాగే  తదుపరి సిఎస్ గా ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా,  స్పెషల్ సిఎస్ టు సియంగా ఉన్న సాయి ప్రసాద్ ను తదుపరి సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు సాయిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్  1991 సెప్టెంబరు 15న ఐఏఎస్ కు ఎంపికై 1992 జూన్ నుంచి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేశారు. అనంతరం 1993 సెప్టెంబరు నుంచి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్ గా,1995 ఆగస్టు నుంచి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు.  1997 మే నుంచి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలెక్టర్ గా, ఆ తరువాత 2000 జూలై నుండి 2003 జూన్ వరకూ కర్నూల్ కలెక్టర్ గా పని చేశారు. ఇక  2003 జూన్ నుండి 2003 అక్టోబరు వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గా, 2003 అక్టోబరు నుండి 2004 ఆగస్టు వరకు ఎపి ట్రాన్సుకో జెఎండిగా, 2004 ఆగస్టు నుండి 2006 మే వరకు ఇపిడిపిసిఎల్ సిఎండిగా, 2006 మే నుండి 2010 ఫిబ్రవరి వరకు ఎపి సిపిడిసిఎల్ సిఎండిగా పని చేశారు. 2010 ఫిబ్రవరి నుండి 2011 అక్టోబరు వరకు ఎపి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా పని చేశారు.

అనంతరం 2011 అక్టోబరు నుండి 2014 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. ఇఖ  2014 జూన్ నుండి 2016 ఫిబ్రవరి వరకు సిఎం కార్యదర్శిగా, 2016 ఫిబ్రవరి నుండి 2019 మే వరకు సిఎం ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. తదుపరి 2020 జనవరి నుండి 2022 ఫిబ్రవరి వరకు ఎపి సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు సిఎండి, ఇంధన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రెటరీగాను పని చేశారు. అనంతరం 2022 ఫిబ్రవరి నుండి 2024 జూన్ వరకు సిసిఎల్ఏగా పనిచేశారు. తదుపరి 2024 జూన్ నుండి 2025 జనవరి దాకా జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 2025 జనవరి నుండి అదే హోదాలో పనిచేస్తూ సిఎం ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను పని చేస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...