Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ మద్యం టెండర్ల కేసు.. పీటీ వారెంట్ను తిరస్కరించిన కోర్టు.!
posted on: Aug 20, 2026 9:32AM

ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల అవకతవకల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలపై సిట్ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించి వెనక్కి పంపింది. మద్యం రవాణా టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సిట్ అధికారులు దర్యాప్తువేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలతో పాటు కారుమూరి సునీల్ను కూడా సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు.
అయితే.. అంతకంటే ముందు ఇదే వ్యవహారానికి సంబంధించిన నగదు అక్రమ చలామణి ఆరోపణలపై ఈడీ అధికారులు వీరిని అరెస్టు చేసి హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు తరలించారు. జైలులో ఉన్న నిందితులను విచారణ నిమిత్తం తమ అధీనంలోకి తీసుకునేందుకు గతంలో సిట్ అధికారులు పీటీ వారెంట్ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
అయితే.. సిట్ రిమాండ్ చెల్లదంటూ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, నిందితులకు అనుకూలంగా తీర్పునిస్తూ వారి రిమాండ్ను రద్దు చేసింది. అయినప్పటికీ.. కేసు విచారణలో భాగంగా రెండు రోజుల కిందట సిట్ అధికారులు మళ్లీ ను విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దాఖలైన కొత్త పీటీ వారెంట్లోని చట్టపరమైన అంశాలను, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమగ్రంగా పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయస్థానం, ఈ వారెంట్ను తోసిపుచ్చుతూ వెనక్కు పంపింది.
మరోవైపు, ఇదే మద్యం టెండర్ల కేసులో నిందితులుగా ఉన్న కె. ధనుంజయ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు బుధవారం (ఆగస్టు 19) విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. వారి హాజరును పరిశీలించిన జ్యుడీషియల్ అధికారి ఎల్. తేజోవతి దర్యాప్తు సంస్థల నుంచి అధికారికంగా సమన్లు అందిన తర్వాతే కోర్టు విచారణకు హాజరు కావాలని, అప్పటివరకు వేచి చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.
ap liquor case, sit pt warrant, acb court vijayawada, kasireddy rajasekhar reddy, donthireddy vasudeva reddy, liquor tender scam ap



.webp)


