ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం పొడగింపు

posted on: May 15, 2026 12:49PM

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.  జూన్ 1 నుండి నవంబరు 30 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు   కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ..   డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ  ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.

ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సాయి ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండగా, ఆయన సేవలను  మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో  రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. దీంతో  కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలు   పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...