ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు

posted on: Jun 10, 2026 9:24PM

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్  మిత్రపక్షాల కీలక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు ఒక ఆసక్తికరమైన, సానుకూల పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.

భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ, అప్రతిహత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర లిఖించినందుకు  మోదీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.

ప్రధాని మోదీతో చంద్రబాబు జరిపిన ఈ ప్రత్యేక భేటీలో ఉభయ నాయకులు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.   ఏపీ ప్రయోజనాలతో పాటు కూటమి బలోపేతంపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.  ఈ  సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, రాష్ట్రానికి అందాల్సిన కేంద్ర సహాయం, విభజన హామీల అమలుపై చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్లు తెలిసింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...