నేడు ఏపీ రాజధాని అభివృద్ధి మండలి కీలక సమావేశం

 

రాజధాని నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు వి.జి.టి.యం. స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీ రాజధాని అభివృద్ధి మండలి (సి.ఆర్.డి.ఏ.) ఉన్నతాధికారులు మరియు సభ్యులతో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యే అవకాశం ఉంది. త్వరలో సింగపూర్ మరియు జపాన్ దేశాల నిపుణుల బృందాలు రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతాల పరిశీలనకు వస్తునందున, ఈనెలాఖరులోగానే సి.ఆర్.డి.ఏ. నియమ నిబంధనలు, దాని బాధ్యతలు, అధికారాలు, భూసేకరణకు నియమ నిబంధనలు వంటి అన్ని అంశాలపై అధికారులు రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లుపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లయితే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీచేస్తుంది. ఈ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితులలో ఈ వ్యవహారాలన్నీ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.