రెండు రోజుల పాటు అందరికీ అసెంబ్లీ ప్రవేశం.. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.!

posted on: Aug 14, 2026 2:44PM

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టానికి తెరలేచింది.  ఇప్పటివరకు కేవలం ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసుల పహారా మధ్య  జరిగే అసెంబ్లీ సమావేశాలు.. ఇప్పుడు సామాన్య ప్రజలకు స్వాగతం పలకుతున్నాయి.  స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనం తలుపులను సర్వమానవాళికి తెరిచి ఉంచాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. 

ఆయన నిర్ణయంతో    దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నినదించిన  మన సభ.. జన సభ ఇప్పుడు మా అసెంబ్లీ ప్రజల  అసెంబ్లీ అన్న ఆయన ఆశయానికి  సజీవ రూపంగా నిలవనుంది. సాధారణంగా స్వాతంత్ర్య వేడుకలంటే కేవలం ఉదయాన్నే ప్రభుత్వ అధికారులు జెండా ఆవిష్కరించడం, కొంతమందికి ప్రసంగాలు ఇవ్వడం, లైటింగ్ పెట్టడంతో సరిపెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఆ పద్ధతులకు భిన్నంగా  ప్రజలు, పాఠశాల విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా చట్టసభ ఆవరణలోకి వచ్చి వేడుకల్లో భాగస్వాములు అయ్యేలా  ప్రణాళిక  రూపొందించారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆగస్టు 14 ,  15 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీ గేట్లను ప్రజల సందర్శనార్థం తెరవనున్నారు. ప్రతీ రోజు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ  ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. రంగురంగుల విద్యుత్ కాంతులతో ధగధగమెరిసిపోయే అమరావతి అసెంబ్లీ భవనాన్ని, ప్రాంగణాన్ని   సందర్శించే ఈ వెసులుబాటు విద్యార్థులకు మన దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర, మహనీయుల త్యాగాలు, చట్టసభల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలన్న సదుద్దేశంలో సదాశయంతో కల్పించినట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు.  

AP Assembly entry, Mana Sabha Jana Sabha, Ayyanna Patrudu speech, Amaravati Assembly lightings, Independence Day 2026 AP, AP Legislative Assembly open to public

google-ad-img
    Related Sigment News
    • Loading...