Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వరంగల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లకపోవచ్చును
posted on: Nov 9, 2015 2:09PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చునని తెలుస్తోంది. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఇప్పుడిపుడే మళ్ళీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సయోధ్య ఏర్పడుతోంది. ఆ కారణంగా రెండు ప్రభుత్వాల మధ్యన ఘర్షణ తగ్గి కొంత సామరస్య వాతావరణం కనిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికలలో ప్రచారం చేయాలంటే తప్పనిసరిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించవలసి వస్తుంది. ఆ కారణంగా పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది కనుకనే చంద్రబాబు నాయుడు ఈ ఉప ఎన్నికలు ఎన్నికలలో ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయన మొదటి నుంచి కూడా “తెలంగాణాలో తెదేపా-తెరాసలు వాటి పని అవి చేసుకుపోనిద్దాము. ప్రభుత్వాలు ఒకదానికొకటి సహకరించుకొందాము,” ని చెప్పుతున్నారు. ఆ ప్రతిపాదన వినడానికి బాగానే ఉన్నా తెదేపా చేసే పోరాటాలతో ఇబ్బందిపడేది తెరాస ప్రభుత్వమే కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు తెరాస ప్రభుత్వంతో దాని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సయోధ్యగా కొనసాగాలనే భావిస్తుండటంతో వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చునని తెలుస్తోంది.


.jpg)



