Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు విజన్ కు మరో ప్రత్యక్ష నిదర్శనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.!
posted on: Jul 29, 2026 11:59AM

గతంలో భోగాపురం వద్ద ప్రతిపాదించిన విమానాశ్రయంపై వైసీపీ ఎకసెక్కాలు చేసింది. భోగాపురానికి ఎర్రబస్సే రాదు.. అలాంటిది ఏకంగా ఎయిర్ బస్ తీసుకువస్తారట అంటూ ఎగతాళి చేశారు. అంతే కాకుండా విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకంటూ విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకూ, ఎకసెక్కాలకూ దీటైన జవాబుగా ఇప్పుడు భోగాపురం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాకారం చేసి చూపింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం విమానాశ్రయ పనులు వాయువేగంతో ముందుకు సాగాయి. నిర్దేశిత గడువు కన్నా ముందే ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి వచ్చింది. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ట్రయల్ రన్ ద్వారా ఎయిర్బస్ తరహా భారీ విమానాలు ఇక్కడ సునాయాసంగా దిగవచ్చని రుజువైంది.
ఇక మరో నాలుగు రోజుల్లో.. అంటే వచ్చే నెల 1న ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
ప్రస్తుతం విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం భారత నౌకాదళం నియంత్రణలో నడుస్తోంది. దీని వల్ల పౌర విమానాల రాకపోకలపై పరిమితులు ఉన్నాయి. నేవీ వర్గాలు అనుమతించిన సమయాల్లో మాత్రమే విశాఖ విమానాశ్రయంలో పౌర విమానాలు ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. టేకాఫ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పరిమితులు, నిబంధనల కారణంగా రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు సాధారణ విమానాల రాకపోకలకు అవకాశం ఇసుమంతైనా లేదు. దీనికితోడు విశాఖ తూర్పు నావికాదళం తన రక్షణ కార్యకలాపాలను, సైనిక శిక్షణను విస్తరించ తలపెట్టిన కారణంగా ముందు ముందు విశాఖ నుంచి పౌర విమానాలకు కేటాయించే సమయం మరింత తగ్గిపోతుంది.
ఈ కారణంగా విశాఖ పేరుకు అంతర్జాతీయ విమానాశ్రయమే అయినా.. పరిమితుల కారణంగా ఇక్కడ నుంచి విమానయాన సంస్థల సర్వీసులు లిమిటెడ్ గానే ఉన్నాయి. ముందు ముందు మరింత తగ్గిపోయే అవకాశాలు కూడా ఉండటంతో.. ఉత్తరాంధ్రకు సంపూర్ణ పౌర విమానయాన సర్వీసుల కోసం మరో అంతర్జాతీయ విమానాశ్రయం అనివార్యం. అయితే వైసీపీయులు.. ఈ అనివార్యతలను, అవసరాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా భోగాపురం ఎందుకంటూ ఊరూ వాడా ఏకం చేస్తూ విమర్శలు గుప్పించారు. వాస్తవానికి.. భోగాపురం విమానాశ్రయఆలోచనకు ఎప్పుడో 1997లోనే నాంది పడింది.
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు. ఆ దిశగా ముందుకు సాగే క్రమంలో వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. కేసుల మీద కేసులతో అవాంతరాలు సృష్టించారు. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత భోగాపురం పురోగతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. అయితే 2024 ఎన్నికలలో అఖండ మెజాజరిటీతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అమరావతి, పోలవరంలతో సమ ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులు పెట్టించింది చంద్రబాబు ప్రభుత్వం.
భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును 4 వేల 750 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే ఈ విమానాశ్రయం భవిష్యత్తులో దశలవారీగా దీని సామర్థ్యాన్ని నాలుగు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించేందుకు వీలుగా విస్తరించనున్నారు. ఈ ఆధునిక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి రోజూ 200కు పైగా విమానాల రాకపోకలకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాలను కూడా ఈ విమానాశ్రయంలో సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా రన్ వేల రూపకల్పన చేశారు.
ఉత్తరాంధ్ర తీర తరచూ తుఫానులు, ఈదురుగాలులకు గురయ్యే అవకాశం ఉన్నందున, భోగాపురం విమానాశ్రయ భద్రతా ప్రమాణాలకు పెద్ద పీట వేసి నిర్మించారు. హుద్హుద్ వంటి పెను తుపానులను సైతం తట్టుకునేలా సాంకేతిక హంగులతో ఈ విమానాశ్రయ నిర్మాణం జరిగింది. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా టెర్మినల్, రన్వే నిర్మాణాలు చెక్కుచెదరవు. భారీ వర్షాలు కురిసినా ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా.. డ్రైనేజీ వ్యవస్థను రూపొందించారు.
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకలకు మాత్రమే కాకుండా యావత్ ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని మార్చే ప్రధాన చోదక శక్తిగా నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయం రావడంతో.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రయాణికులకు నేరుగా కనెక్టివిటీ దొరకడం వల్ల విదేశీ పెట్టుబడులు ప్రవాహంలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవాణా సౌకర్యాలు పెరగడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. తీరప్రాంత పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక, వైద్య పర్యాటకం కూడా విశేషంగా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు.
Bhogapuram International Airport, Visakhapatnam Greenfield Airport, Bhogapuram Airport Construction Details, Airbus Landing Bhogapuram, North Andhra Infrastructure Development






