Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మిధున్ రెడ్డికి లేని ప్రాధాన్యత సిదిరి అప్పలరాజుకు ఎందుకు.. జగన్ తీరుపై వైసీపీలోనే అసంతృప్తి.!?
posted on: Jul 28, 2026 2:36PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అంబోలు జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించాలని నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల రోడ్డు ప్రమాదం కేసులో చట్టపరమైన విచారణ ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్న అప్పలరాజుతో ములాఖత్కు పార్టీ అధ్యక్షుడు స్వయంగా వెళ్లడంపై వైసీపీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. ఇక పార్టీ శ్రేణుల్లో అయితే జగన్ నిర్ణయం పట్ల బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడుపుతున్న ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, అసలు నిందితుడైన తన కుమారుడిని కాపాడేందుకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించారు. ,
మరొక యువకుడిని ఈ కేసుఇరికించి దర్యాప్తును పక్కదోవ పట్టించేలా కుట్రపన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు. సిదిరి అప్పలరాజు ప్రస్తుతం అంబోలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. . ఈ కేసు పూర్తిగా ఒక వ్యక్తిగత కుటుంబ వ్యవహారమని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదనీ వైసీపీ సీనియర్ నేతలు చెబుతూ.. ఈ కేసులో అప్పలరాజుకు మద్దతుగా పార్టీ అధినేత స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించడం సరికాదని అంటున్నారు.
పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు వివిధ వ్యవహారాల్లో కేసులు ఎదుర్కొని రిమాండ్ ఖైదీలుగా ఉన్న సందర్భాలను గుర్తు చేస్తూ.. ఆయా సందర్భాలలో జైలుకు వెళ్లి ఆయా నేతలను పరామర్శించని జగన్.. ఒక ప్రైవేటు కేసులో అరెస్టైన మాజీ మంత్రిని పరామర్శించడానికి బయలుదేరడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు ముఖ్య నాయకులు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలుతో పాటు ఇతర జైళ్లలో రోజులకు రోజులు గడిపిన సమయంలో అధినేత పరామర్శకు వెళ్లలేదన్న అంశాన్ని గుర్తుచేస్తున్నారు.
పార్టీ కోసం, అధినాయకత్వం నిర్ణయాల కోసం నిలబడి జైలు పాలైన సీనియర్లను పరామర్శించని జగన్, వ్యక్తిగత నిర్లక్ష్యం, చట్ట ఉల్లంఘన నేరాలతో అరెస్టైన సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లడం.. తప్పుడు సంకేతాలను ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా యాక్సిడెంట్ చేసి.. సామాన్యుడి ప్రాణం తీసిన ఘటనలో విచారణను తప్పుదోవ పట్టించారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు ప్రత్యక్ష మద్దతు తెలపడం వల్ల పార్టీ ప్రతిష్ఠ మసకబాదుతుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. జగన్ ఈ ధోరణి.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
Seediri Appalaraju Arrest, Srikakulam Ampolu Jail, YCP Internal Politics, TeluguOne



.webp)


