Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విద్యా రంగానికి ఆంధ్రా యూనివర్సిటీ దిక్సూచి : సీఎం చంద్రబాబు
posted on: Apr 27, 2026 9:21PM

విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ అపురూప వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. దేశ విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ విద్యాసంస్థ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నత స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ వంటి కీలక నేతలు ఈ వేడుకలకు హాజరయ్యారు. వీరితో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొనడం విశేషం.
.webp)
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలకు ఆంధ్రా యూనివర్సిటీ ఒక దిక్సూచిగా నిలుస్తుందని కొనియాడారు. సంస్థను స్థాపించిన మహనీయులను, తొలి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి గారిని, రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఏయూ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మరో రూ. 500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ఆంధ్రా విశ్వవిద్యాలయ విద్యార్థిని కానందుకు తాను బాధపడుతున్నానని, ఇక్కడ చదువుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వర్సిటీ కేవలం ఆంధ్రకే కాదు, దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఇక్కడ చదువుకున్న వారు వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తాను కూడా ఏయూ విద్యార్థినేనని గర్వంగా చెప్పుకున్నారు. భిన్న ఆలోచనలున్న మేధావులను ఒకే చోటికి చేర్చే గొప్ప వేదిక ఈ వర్సిటీ అని వ్యాఖ్యానించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కేవలం పట్టాలు పొందడమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. పరిశోధనల ద్వారా ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని ఆకాంక్షించారు.
.webp)
ఏయూ వందేళ్ల ప్రస్థానం కేవలం ఒక అంకానికి ముగింపు కాదు, రాబోయే తరాలకు మరింత స్పూర్తినిచ్చే మరో శతాబ్దానికి పునాది అని విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖ నగరం గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో, ఏయూ ఆధునిక సాంకేతికతతో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాలని మేధావులు ఆశిస్తున్నారు.


.webp)
.webp)


