ఏపీ అసెంబ్లీ భవనం మరమత్తులకి కోటి రూపాయలు ఖర్చు!

 

ఇక నేడో రేపో ఏపీ ప్రభుత్వం విజయవాడకి తరలిపోవాలని సన్నాహాలు చేస్తోంది. ఈసారి వీలయితే రాష్ట్ర శాసనసభ సమావేశాలని విశాఖలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఇటువంటి సమయంలో హైదరాబాద్ లో ఏపీ రాష్ట్రానికి కేటాయించబడిన శాసనసభ భవనానికి మరమత్తులు కోసం ఏపీ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ రూ.97 లక్షలు మంజూరు చేసింది. చారిత్రాత్మక కట్టడమయిన అసెంబ్లీ భవనానికి మరమత్తులు చేసేందుకు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రూ.3.58 కోట్లు వ్యయం అయ్యే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. కానీ తెలంగాణా ఉద్యమాల కారణంగా ఇంతవరకు పనులు మొదలవలేదు. ఇప్పుడు ఇరు రాష్ట్రాలలో వేర్వేరుగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కనుక గత ప్రభుత్వం ఆమోదించిన పనులను చేప్పట్టవలసి వస్తోంది. అందుకే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు కోటి రూపాయలు మంజూరు చేసింది. త్వరలోనే మొదటి దశ మరమత్తుల పనులు మొదలుపెడతామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ ఉన్నతాధికారి బి. రాజేందర్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu