ఏపీకి ప్రత్యేక ప్యాకేజి మాత్రమేనా?

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర హామీల అమలు గురించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించేందుకు ఈనెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళబోతున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200 పేజీలతో కూడిన ఒక నివేదిక సిద్దం చేసుకొంది. దానిని ప్రధానికి సమర్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీ అవసరమని చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పబోతున్నారు. కానీ ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎదురవుతున్న సమస్యలను, అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి కేవలం ఆర్ధిక ప్యాకేజి మాత్రమే ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజీకి సమానంగా లేదా అంతకంటే కొంచెం ఎక్కువగానే ఆర్ధిక ప్యాకేజీని ఆర్ధిక శాఖ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మోడీ సమావేశం అయిన తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయడం సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రజలను ఒప్పించడానికి, ప్రతి పక్షాల విమర్శలు, పోరాటాలను ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సిద్దపడవలసి ఉంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu