Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జేఎన్యూలో సమావేశమే ఒక జాతివిద్రోహం- అమిత్షా
posted on: Mar 18, 2016 2:37PM

ఫిబ్రవరి 9న జేఎన్యూలో నిర్వహించిన సమావేశంలో దేశవ్యతిరేక నినాదాలు చేశారా? చేస్తే ఎవరు చేశారు? అని దేశమంతా తర్జనభర్జన పడుతూ ఉండవచ్చుగాక. కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్షా మాత్రం ఈ విషయమై తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు వెల్లడించారు. అఫ్జల్గురుని సంస్మరించుకునేందుకు సమావేశాన్ని నిర్వహించడమే ఓ జాతి విద్రోహ చర్య అని ఆయన మండిపడ్డారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న ఓ సమావేశంలో మాట్లాడిన అమిత్షా ఫిబ్రవరి 9 దేశ స్వాతంత్ర్య దినోత్సవమో, గణతంత్ర దినోత్సవమో కాదనీ... అఫ్జల్గురుని ఉరితీసిన రోజనీ చెప్పుకొచ్చారు. అలాంటి రోజున సమావేశం ఏంటని ప్రశ్నించారు. ఈ దేశ అత్యున్నత వ్యవస్థ (పార్లమెంటు) మీద దాడి చేసినందుకు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) అఫ్జల్గురుకి ఉరిశిక్షను ఖరారు చేసిందని.... అలాంటి వ్యక్తి వర్ధంతిని జరుపుకొనేందుకు ఎవరన్నా సిద్ధపడితే, అది దేశద్రోహమనేనని అన్నారు. ‘భారత్ మాతాకీ జై’ నినాదానికి సంబంధించి కూడా అమిత్షా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నినాదం మీద జరుగుతున్న చర్చ అర్థరహితం అనీ, స్వాతంత్ర్యం వచ్చి అన్ని సంవత్సరాలు గడిచినా ఓ జాతీయ నినాదం గురించి వాదులాడుకోవడం దురదృష్టకరమనీ పేర్కొన్నారు.






