జేఎన్‌యూలో సమావేశమే ఒక జాతివిద్రోహం- అమిత్‌షా

posted on: Mar 18, 2016 2:37PM


 

ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో నిర్వహించిన సమావేశంలో దేశవ్యతిరేక నినాదాలు చేశారా? చేస్తే ఎవరు చేశారు? అని దేశమంతా తర్జనభర్జన పడుతూ ఉండవచ్చుగాక. కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మాత్రం ఈ విషయమై తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు వెల్లడించారు. అఫ్జల్‌గురుని సంస్మరించుకునేందుకు సమావేశాన్ని నిర్వహించడమే ఓ జాతి విద్రోహ చర్య అని ఆయన మండిపడ్డారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న ఓ సమావేశంలో మాట్లాడిన అమిత్‌షా ఫిబ్రవరి 9 దేశ స్వాతంత్ర్య దినోత్సవమో, గణతంత్ర దినోత్సవమో కాదనీ... అఫ్జల్‌గురుని ఉరితీసిన రోజనీ చెప్పుకొచ్చారు. అలాంటి రోజున సమావేశం ఏంటని ప్రశ్నించారు. ఈ దేశ అత్యున్నత వ్యవస్థ (పార్లమెంటు) మీద దాడి చేసినందుకు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) అఫ్జల్‌గురుకి ఉరిశిక్షను ఖరారు చేసిందని.... అలాంటి వ్యక్తి వర్ధంతిని జరుపుకొనేందుకు ఎవరన్నా సిద్ధపడితే, అది దేశద్రోహమనేనని అన్నారు. ‘భారత్‌ మాతాకీ జై’ నినాదానికి సంబంధించి కూడా అమిత్‌షా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నినాదం మీద జరుగుతున్న చర్చ అర్థరహితం అనీ, స్వాతంత్ర్యం వచ్చి అన్ని సంవత్సరాలు గడిచినా ఓ జాతీయ నినాదం గురించి వాదులాడుకోవడం దురదృష్టకరమనీ పేర్కొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...