వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్

posted on: Feb 11, 2026 1:42PM

 

వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే  సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ రాగా, తాజాగా మెడికల్ కాలేజీల పీపీఏ విధానంపై ఆందోళనల కేసులో బెయిల్ మంజూరు చేసింది. 

పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆయనకు షరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేలుతో పాటు రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పేర్కొంది. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...