అమరావతి టు హైదరాబాద్, చెన్నై బుల్లెట్ ట్రైన్

posted on: Apr 28, 2026 3:10PM

 

అమరావతి నుంచి  హైదరాబాద్‌, చెన్నైల మధ్య బుల్లెట్ ట్రైన్‌‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని  వైష్ణవ్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య 70 నిమిషాల్లో, చెన్నై నుంచి అమరావతికి 112 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 08 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చన్నారు. చెన్నై నుంచి కోల్‌కతా మధ్య రైల్వే లైన్లను 4 లేన్లుగా విస్తరించే పనులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. జూన్ 1 నుంచి విశాఖపట్నం రైల్వే జోన్‌ను నోటిఫై చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. 

సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీ పట్నం కాబోతోందన్న కేంద్ర మంత్రి... ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు.  విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సైబరాబాద్‌ నిర్మించారని.. ఐటీ అభివృద్ధిలో సైబర్‌ టవర్‌ది కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు విజన్‌కు సెల్యూట్‌ చేస్తున్నామని అన్నారు. ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్‌గా కేంద్ర మంత్రి అభివర్ణించారు. యువనేత లోకేశ్ ఎనర్జీ, నాయకత్వం అద్భుతమని కొనియాడారు. సమస్యల పరిష్కారంలో యువనేతలకు లోకేశ్ ఆదర్శమని పేర్కొన్నారు. గూగుల్‌ వంటి ప్రముఖ సంస్థలు విశాఖపట్నానికి రావడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...