Latest News

ఒక పరాజయం 100 తప్పులు.. ఏపీలో టీడీపీ ఓటమికి తెలంగాణలో పునాది!

posted on: Jul 23, 2019 7:06PM

 

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో టీడీపీ ఓటమికి పునాది వేసాయా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న పార్టీని బ్రతికించడం కోసం బాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి.. ఏపీలో కూడా పార్టీని ప్రమాదంలో పడేశారని చెప్పక తప్పదు. అసలు టీడీపీని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీగా భావిస్తున్నారు. అలాంటిది మహాకూటమి పేరుతో బాబు కాంగ్రెస్ తో దోస్తీ చేయడంతో టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారనేది వాస్తవం. టీడీపీ, కాంగ్రెస్ ల దోస్తీ.. ఇరు పార్టీలకు తెలంగాణలో నష్టం చేయడమే కాకుండా.. ఏపీలో టీడీపీకి తీవ్ర నష్టం చేసిందనే చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రా పెత్తనం అంటూ బాబుని కార్నర్ చేసి కాంగ్రెస్ గట్టిదెబ్బ కొట్టారు. మరోవైపు అసలే తెలంగాణ టీడీపీ అంతంత మాత్రం ఉందంటే.. ఈ దోస్తీ మూలంగా మరికొందరు కూడా టీడీపీకి దూరమయ్యారు. ఈ దోస్తీ ఎఫెక్ట్ ఏపీలో కూడా బాగా పనిచేసింది. ఎందరో కార్యకర్తలు టీడీపీకి దూరమయ్యారు. అదేవిధంగా ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం ఉండటంతో బాబు మీద పడింది. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపారని.. ఏపీ ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత ఏర్పడింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...