వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్

 

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తన హామీని నిలబెట్టుకొంటూ ఈసారి రాష్ట్ర బడ్జెట్టుతో ప్రత్యేకంగా వ్యవసాయానికి కూడా ప్రత్యేక బడ్జెట్ కూడా రూపొందించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఈనెల 22న వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. మంత్రి నారాయణ ఆ బడ్జెటును శాసనమండలిలో ప్రవేశపెడతారు. ఈసారి తెదేపా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబోతోందని, రుణాల మాఫీతోనే స్పష్టం అర్ధమయింది. ఇప్పుడు వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెటు కూడా కేటాయించడం ద్వారా మున్ముందు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమయిన మార్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయంలో యంత్రాల ఉపయోగం, బిందు సేద్యం, విత్తన ఉత్పత్తి, పండ్ల తోటల పెంపకం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి వంటివాటికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు. కనుక వ్యవసాయ బడ్జెటులో వీటన్నిటికీ ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.