ఈ కలుపుగోలుతనమే చంద్రబాబును అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిపింది!

posted on: May 28, 2026 5:22PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు  రాజకీయాల్లో ఆయన క్రియాశీలంగా ఉన్నారు.చంద్రబాబు అందరితో కలిసిపోయి..   వారి మాటలను సావధానంగా వింటారు. ప్రస్తుతం జరుగుతున్న మహానాడు విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది.   చంద్రబాబు నాయుడు ఎంతోమంది సామాన్యులకు తనను కలవడానికి, తనతో మాట్లాడటానికి మహానాడును వేదికగా మార్చారు.  చంద్రబాబు తన పక్కన సామాన్యులైన పలువురికి చోటు కల్పించారు.  వారికి చంద్రబాబుతో కూర్చుని మాట్లాడే అవకాశం లభించింది. ఇదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో  మచ్చుకైనా  కనిపించదు. ఎందుకంటే ఆయన సాధారణంగా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులతో  కూడా సంభాషించడానికి సుముఖంగా ఉండరు.  ఆయనకు ప్రజల్లో ప్రజలతో స్పష్టమైన అనుబంధం ఉండవచ్చు, కానీ రాజకీయ కార్యక్రమాల సమయంలో వేదికపై  కలుపుగోలుతనం  కలికానిక్కూడా కనిపించదు. వైఎస్ జగన్‌తో సహా మిగతా వారందరి నుండి చంద్రబాబును వేరుచేసేది చంద్రబాబులోని ఈ కలుపుగోలు తనమేనని పరిశీలకులు విశ్లేషిస్తునారు.   
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో   మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి  మార్చారు. ఆధునిక సాంకేతికతను జోడించి డిజిటల్ పద్ధతిలో నిర్వహించిన ఈ సరికొత్త మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సమ్మిళిత రాజకీయాల విధానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొనిపోయే విధంగా నూతన పాలనా సంస్కరణలను ప్రకటించారు. సంక్షేమం,  అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించే చంద్రబాబు.. ఈ మహానాడు ద్వారా  వృద్ధులు, చేతివృత్తుల వారికి అండగా నిలిచేందుకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని  పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ స్థాయిలో పెన్షన్ అందించడం ద్వారా పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేవలం పెన్షన్లకే పరిమితం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి అన్నదాతలను ఆదుకునేందుకు ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రకటించడం పట్ల రైతాంగంలో హర్షం వ్యక్తం అవుతోంది.

మహానాడు వేదికగా కూటమి రాజకీయాల ప్రాముఖ్యతను చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్న ఈ ప్రయాణం కేవలం తాత్కాలిక రాజకీయ అవసరం కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ఒక చారిత్రాత్మక మైలురాయిగా చంద్రబాబు అభివర్ణించారు.   వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో  కలిసే పోటీ చేస్తామని ప్రకటించి కూటమిలో విభేదాలపై విపక్షాల ఊహాగానాలకు చెక్ పెట్టారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...