పాత జీవో ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు: మంత్రి పొంగులేటి

posted on: Feb 13, 2026 10:22AM

పాత జీవో ప్రకారమే జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ కానున్నాయి. ఈ విషయాన్ని పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ నాయకులు గురువారం (ఫిబ్రవరి 12) కలిశారు.

ఈ సందర్భంగా జీ.ఓ 252, జీ.ఓ 103లో కేబుల్ ఛానల్స్ కు అక్రెడిటేషన్స్ జారీ విషయంలో అన్యాయం జరిగిన విషయాన్ని వారు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి  ఎవరూ ఆందోళన చెందివద్దనీ, పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టుకు అక్రెడిటేషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు.    

google-ad-img
    Related Sigment News
    • Loading...