ఏపీ డిప్యూటీ సీఎం కాన్వాయ్ కు ప్రమాదం

posted on: Feb 18, 2026 9:17AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ కాన్వాయ్ లో పవన్ కల్యాణ్ లేరు. విశాఖలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ మంగళవారం (ఫిబ్రవరి 17) విశాఖ చేరుకున్న సంగతి తెలిసిందే.

ఆయన బస చేసిన ప్రాంతం నుంచి పవన్ కల్యాణ్ ను పికప్ చేసుకునేందుకు కాన్వాయ్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  దీంతో వెంటనే పవన్ కల్యాణ్ కోసం మరొక కాన్వాయ్  సిద్ధం చేశారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనే ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఫెస్టివల్ లో పవన్ పాల్గొంటారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...