Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ కస్టడీ కోరిన ఏసీబీ
posted on: Jun 4, 2026 11:10AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ను లోతుగా విచారించేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కీలక అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉందని పేర్కొంటూ, వంశీ మోహన్ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలపై ఏసీబీ అధికారులు వంశీ మోహన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆస్తులు, ఆర్థిక లావాదే వీలు, పెట్టుబడులు, ఇతర సంబంధిత అంశాలపై మరింత సమా చారం సేకరించాల్సి ఉందని ఏసీబీ కోర్టుకు తెలిపింది.
ఏసీబీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, వంశీ మోహన్ తరఫు న్యాయవాదులను కౌంటర్ను దాఖలు చేయాలని ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కస్టడీపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.



.webp)


