Latest News

గచ్చిబౌలిలో కల్తీ మాఫియా గుట్టు రట్టు.. ఇద్దరు అరెస్టు

posted on: Mar 10, 2026 8:37AM

సామాన్యులు నిత్యం వాడే వంటనూనె, గోధుమపిండి  కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాఫియా ముఠా గుట్టు రట్టైంది. గచ్చీబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో  ఎస్ఓటీ పోలీసులుగ జరిపిన సోదాలలో  21.9 లక్షల రూపాయల విలువైన కల్తీ నూనె, గోధుమపిండి స్వాధీనం చేసుకున్నారు.  

  శ్రీ జస్నాథ్ ట్రేడర్స్'పై  జరిపిన ఈ దాడిలో వివిధ కంపెనీలకు చెందిన గడువు ముగిసిన  అంటే డేట్ ఎక్స్ పైర్ అయిన  నూనెలను సేకరించి, వాటిని సోయాబీన్ ఆయిల్‌తో కలిపి కొత్త ప్యాకెట్లలో  నింపుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ఫేస్ లైట్, రాజాగోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా వంటి   పేర్లతో  మార్కెట్ లోకి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అలాగే ఈ సందర్భంగా 5,192 కిలోల గడువు ముగిసిన గోధుమపిండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.  ఈ కుళ్లిన గోధుమ పిండిని జస్నాథ్ గోల్డ్ చక్కి ఆటా పేరుతో రీ-ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ దాడుల సందర్భంగా రాజస్థాన్ కు చెందిన భన్వర్ రామ్ జాట్, అతడి కుమారుడు అశోక్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు.  వీరి వద్ద నుంచి 5,026 లీటర్ల నూనె, ఆయిల్ ఫిల్టరింగ్ మిషన్లు, ప్యాకింగ్ మెటీరియల్ ,  రవాణాకు వాడే టెంపో ట్రాలీని సీజ్ చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...