Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జీహాద్ కోసం ఆస్తి అంకితం.... ఒసామా వీలునామా
posted on: Mar 2, 2016 11:50AM

ఒసామా చివరి వీలునామాగా భావిస్తున్న ఒక పత్రాన్ని నిన్న అమెరికా ప్రభుత్వం పత్రికలకు అందుబాటులో ఉంచింది. ఇందులో తాను సూడాన్లో దాచుకున్న ఆస్తిలో అధిక భాగాన్ని మతయుద్ధం (జిహాద్) కోసం ఉపయోగించాల్సిందిగా ఒసామా పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో దాదాపు 15 కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఆస్తిలో తన కుటుంబానికి చాలా స్వల్ప మొత్తాన్ని కేటాయించారు ఒసామా! 2011లో, పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఒసామాను అమెరికా సైనికులు కాల్చి చంపిన విషయం తెలిసిందే! అల్ఖైదా పేరుతో పాశ్చాత్య దేశాలను గడగడలాండిచిన ఒసామాను పట్టుకునేందుకు, అమెరికాకే పది సంవత్సరాలు పట్టింది. ఈ సందర్భంగా ఒసామా నివాసంలో లభించిన పత్రాలను, ఇప్పుడిప్పుడే అమెరికా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ వీలునామాతో పాటు కనిపించిన మరో ఉత్తరంలో... ఒసామా తన మరణానంతరం తన కుటుంబాన్ని పరిరక్షించాల్సిందిగా తన సవతి తండ్రిని వేడుకున్నారు. వారి మంచిచెడ్డలు, పెళ్లిళ్లు, కష్టసుఖాలను గమనించుకోమంటూ ఆయనను ప్రార్థించారు. చివరగా ఆయనకు ఇష్టం లేని పనిని కనుక చేసి ఉంటే క్షమించమని కూడా ప్రార్థించారు!


.jpg)



