Latest News

పోచారంలో రాంబాయి సీన్.. పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు

posted on: Mar 14, 2026 2:20PM

హైదరాబాద్‌  పోచారం ఐటీ కారిడార్ పరిధిలో 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా తరహాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందని కోపంతో ఓ యువకుడు యువతికి ఎయిడ్స్ వ్యాధి ఉన్న రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణమైన ఘటనలో నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులకు కూడా గతంలోనే ఎయిడ్స్ సోకినట్లు అధికారులు గుర్తించారు. 

పోచారంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన సంచలనం రేపింది.   పెళ్లి నిరాకరించిందన్న కారణంతో    పోచారం ప్రాంతా నికి చెందిన యువకుడు మనోహర్‌ ఓ యువతికి ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఎక్కించాడు.  మనోహర్ కు పోచారం ప్రాంతానికే చెందిన  యువతితో కొంతకాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారి వివాహానికి కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపడంతో   ఇద్దరికీ వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. అయితే ఈ తరువాత   మనోహర్‌కు  అతని తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉందని తెలిసింది. దీంతో  యువతి కుటుంబం ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది. దీనితో మనోహర్ కక్ష పెంచుకున్నాడు.  

చివరి ప్రయత్నం అన్నట్లుగా   ఈ నెల 11న మనోహర్ ఆ యువతి ఇంటి కి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే యువతి స్పష్టంగా నిరాకరించడంతో  మనోహర్  తన వెంట తెచ్చుకున్న   ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా యువతికి ఎక్కించాడు. రెప్పపాటు వ్యవధిలో జరిగిన ఈ దారుణంతో  యువతి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.  వెంటనే యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోచారం పోలీసులు నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...