Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు సీఎం విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్.. ఆ జీవోలు రద్దు.!
posted on: Jul 28, 2026 10:39AM
.webp)
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు విజయ్కు తగిలిన గట్టి ఎదురుదెబ్బ ఇదేనని చెప్పవచ్చు. గతంలో కరూర్ జిల్లాలో విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అత్యున్నత న్యాయస్థానంలో బ్రేక్ పడటం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో 41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ తరువత తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విజయ్.. ఆ హామీని నెరవేరుస్తూ తొక్కిసలాట మృతుల కుటుంబాలలో 32 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. అయితే.. సాధారణ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి పోటీ పరీక్షలు, అధికారిక నియామక ప్రక్రియ లేకుండా ఇలా ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగాలను కేటాయించడాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైంది.
ఆ పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ధమైన నియమక సంస్థల ప్రక్రియల ద్వారా కాకుండా.. చట్ట పరిమితులను దాటి ఉద్యోగాలు కేటాయించడం సమర్థనీయం కాదని పేర్కొంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ సమాన అవకాశాల సూత్రానికి లోబడి ఉండాలని ఆదేశించింది. అంతే కాకుండా, కరూర్ దుర్ఘటనపై సీబీఐ విచారణ సాగుతున్న తరుణంలో ఇటువంటి నియామకాలు చేపట్టడం సరి కాదని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
Madras high court shock to CM Vijay, Karur Stampede, Tamil Nadu News, TVK Party


.webp)



