Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేడు డిల్లీలో జగన్మోహన్ రెడ్డి దీక్ష
posted on: Aug 10, 2015 8:54AM
(4).jpg)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ్ళ డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయబోతున్నారు. అందుకోసం రాష్ట్రం నుండి రెండు ప్రత్యేక రైళ్ళలో వైకాపా నేతలని, కార్యకర్తలని కూడా డిల్లీకి తరలించారు. ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటం గురించి జాతీయ మీడియా, హిందీ మాట్లాడే ప్రజలందరికీ కూడా తెలిసేందుకు హిందీ, ఇంగ్లీష్ బాషల్లో కూడా పోస్టర్లు, బ్యానర్లు అచ్చువేశారు. ఇది చాలా తెలివయిన ఆలోచనేనని చెప్పవచ్చును. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో శివాజీ వంటి వారు ఎంతమంది పోరాడుతున్నా కూడా వారికి రాని గుర్తింపు దీనివలన జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే దక్కుతుంది. ఇంతకాలం ప్రత్యేక హోదా వంటి అంశాల గురించి గట్టిగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి, ఈరోజు డిల్లీలో చేస్తున్న దీక్షతో రాష్ట్రం కోసం తానొక్కడినేడే పోరాడుతున్నడనే భావన జాతీయ మీడియాకు తద్వారా దేశప్రజలకు కల్పించగలుగుతున్నాడని చెప్పకతప్పదు.



.jpeg)


