Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫార్ములా ఈ రేసు కేసులో ఏ1 కేటీఆర్పై చార్జ్షీట్.. కీలక ఆరోపణలు..!
posted on: Jul 31, 2026 3:03PM
.webp)
ఫార్ములా ఈ రేసు వ్యవహా రంలో ఏ1గా పేర్కొన్న కేటీఆర్పై చార్జ్షీట్లో పలు తీవ్రమైన ఆరోపణలను దర్యాప్తు సంస్థ నమోదు చేసింది. క్యాబినెట్, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ అనుమతులు తీసుకోకుండానే ఫార్ములా ఈ సీజన్-10ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ప్రభుత్వం తరఫున ఒప్పందాలపై సంతకం చేసే అధికారం లేకపోయినప్పటికీ, ఏ2 ద్వారా 2022 జనవరి 17న లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI)పై సంతకం జరిగేలా కేటీఆర్ చురుకుగా వ్యవహరించారని చార్జ్షీట్లో పేర్కొంది.
అనంతరం 2023 సెప్టెంబర్ 27న హెచ్ఎండీఏ రూపొందించిన నోట్ఫైల్ను ఆమోదించి, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్గంతో జరగాల్సిన తప్పనిసరి సంప్రదింపులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించింది. ఏ2 ద్వారా ఒప్పందాలను అమలు చేయడానికి అనుమతిస్తూ రాజ్యాంగ నిబంధనలు, హెచ్ఎండీఏ చట్టం, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్తో పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిం చారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
ఈ నిర్ణయాల కారణంగా ఫార్ములా ఈ సీజన్ 10, 11, 12లకు కలిపి ప్రభుత్వంపై సుమారు రూ.600 కోట్ల ఆర్థిక భారం పడే పరిస్థితి ఏర్పడిందని చార్జ్షీట్లో పేర్కొంది. ఇతర నిందిత అధికారులను కూడా నిబంధనలను ఉల్లం ఘించేలా ఆదేశించారని, ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఉద్దేశం ఉందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఫార్ములా ఈ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందాయని చార్జ్షీట్లో ప్రస్తావించింది. గత ప్రమోటర్ ఫార్ములా ఈ నిర్వహణలో భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసినప్పటికీ, ఇతర నిందితులతో కలిసి కుట్రపన్ని హెచ్ఎండీఏను సీజన్ 10, 11, 12లకు ప్రమోటర్గా తీసుకువ చ్చారని ఆరోపించింది.
దీని ద్వారా ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం మోపా రని పేర్కొంది. అలాగే హెచ్ఎండీఏ చట్టబద్ధ పరిధికి వెలుపల 75,88,65,179 ప్రజాధ నాన్ని వినియోగించేందుకు కారణమయ్యారని, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రైవేట్ సంస్థకు ప్రయోజనం చేకూరిందని చార్జ్షీట్లో ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలు, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను వ్యవస్థాపితంగా ఉల్లంఘించారని, ఈ చర్యలు నిజాయితీ లేని ఉద్దేశాన్ని, క్రిమినల్ దుర్వినియోగాన్ని సూచిస్తున్నాయని దర్యాప్తు సంస్థ చార్జ్షీట్లో పేర్కొంది. ఇవన్నీ ఏ1గా పేర్కొన్న కేటీఆర్ పాత్రపై దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ప్రధాన ఆరోపణలుగా చార్జ్షీట్లో ఉన్నాయి.
Formula E case , KTR, KCR, BRS Party, Chargesheet, Hmda, IAS Arvind Kumar, BLN Reddy,Quid pro quo, Electoral bonds






