గుజరాత్ లో 22 మంది పిల్లలను బలితీసుకున్న మహమ్మారి చాండీపురా.!

posted on: Aug 4, 2026 2:23PM

పసిపిల్లల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన మహమ్మారి చండీపురా. ప్రస్తుతం ఆ మహమ్మారి గుజరాత్ లో కలకలం సృష్టిస్తోంది. చండీపురా వైరస్ కారణంగా గుజరాత్ లో ఇప్పటి వరకూ 22 మంది పిల్లలు పిట్టల్లా రాలిపోయారు. వానాకాలంలో ఈగల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. ప్రధానంగా 15 ఏళ్ల లోపు పిల్లల మెదడుపై తీవ్రాతి తీవ్రమైన ప్రభావం చూపుతుంది.  

చండీపురా వైరస్ తో 25 మంది చిన్నారులు ప్రాణాల కోసం పోరాడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు వెంటిలేటర్ పై ఉన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు చేపట్టింది గుజరాత్ ప్రభుత్వం.

దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.  పిల్లలలో  జ్వరం, వాంతులు,   ఫిట్స్ వంటి  లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం జాగు చేయకుండా వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం చెబుతోంది.  

Chandipura Virus Gujarat, Encephalitis outbreak, Sandfly infection, Child safety alert, Monsoon health risks, Gujarat health updates

google-ad-img
    Related Sigment News
    • Loading...