Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గుజరాత్ లో 22 మంది పిల్లలను బలితీసుకున్న మహమ్మారి చాండీపురా.!
posted on: Aug 4, 2026 2:23PM

పసిపిల్లల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన మహమ్మారి చండీపురా. ప్రస్తుతం ఆ మహమ్మారి గుజరాత్ లో కలకలం సృష్టిస్తోంది. చండీపురా వైరస్ కారణంగా గుజరాత్ లో ఇప్పటి వరకూ 22 మంది పిల్లలు పిట్టల్లా రాలిపోయారు. వానాకాలంలో ఈగల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. ప్రధానంగా 15 ఏళ్ల లోపు పిల్లల మెదడుపై తీవ్రాతి తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
చండీపురా వైరస్ తో 25 మంది చిన్నారులు ప్రాణాల కోసం పోరాడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు వెంటిలేటర్ పై ఉన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు చేపట్టింది గుజరాత్ ప్రభుత్వం.
దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పిల్లలలో జ్వరం, వాంతులు, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం జాగు చేయకుండా వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం చెబుతోంది.
Chandipura Virus Gujarat, Encephalitis outbreak, Sandfly infection, Child safety alert, Monsoon health risks, Gujarat health updates


.webp)



