Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా.. భక్తులకు తీవ్ర గాయాలు..!
posted on: Jul 19, 2026 4:44PM

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన భక్తులు తమ కారులో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా, రెండో ఘాట్ రోడ్డులోని 39వ మలుపు వద్ద లింక్ రోడ్డుకు సమీపంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అనంతరం సేఫ్టీ గోడను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర భక్తులు వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రెండో ఘాట్ రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు, ఘాట్ రోడ్డు సిబ్బంది ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, గాయపడిన భక్తుల పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.






