త్రిపురలో వామపక్ష కూటమి హావా
posted on: Feb 28, 2013 9:54AM

మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసనసభల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైన ఈ రాష్ట్రాలలో ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ప్రధాన రాజకీయపార్టీలు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నాయి. నాగాలాండ్లో 60 స్థానాలకు గాను 59 స్థానాలకు ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపురలో 60 శాసనసభా స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాల సందర్భంగా మూడు రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
త్రిపురలో వామపక్ష కూటమి అధికారం చేజిక్కుంచుకునే దిశగా దూసుకుపోతుంది. 60 శాసనసభ స్థానాలకు గాను వామపక్ష కూటమి అభ్యర్ధులు 40స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.



.jpg)


