ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం!

posted on: Mar 5, 2026 2:15PM

 

కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండైంది. హైదరాబాద్‌ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తంది. రన్‌వేపై టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్‌ గుర్తించారు. దీంతో రన్‌వేపై నిలిపివేశారు. ఈ విమానంలో మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.  సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని ఇండిగో అధికారులు రద్దు చేశారు. దీంతో గొట్టిపాటి రవి, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు రోడ్డు మార్గాన బయల్దేరారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేస్తామని ఇండిగో అధికారులు హామీ ఇచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...