Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికన్ కల కరిగిపోతోందా? భారతీయులపై ద్వేషం పెరుగుతోందా?
posted on: Jun 2, 2026 3:29PM
.webp)
అమెరికా సిలికాన్ వ్యాలీని.. ఒక వాగ్దాన పునాదుల మీద నిర్మించారు. మీకు తగినంత ప్రతిభ ఉంటే, ఇక్కడ ఉండటానికి అర్హులు. వీపున బ్యాక్ప్యాక్తో ఉన్న ఒక ఇంజనీర్, రెండు సూట్కేసులు, ఒక హెచ్-1బి వీసా, ఇమ్మిగ్రేషన్ పత్రాలలో ఇమడలేనంత పెద్ద కలతో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో అడుగుపెడుగు పెట్టి సరాసరి ఇక్కడికి వచ్చేవారు. భారతీయులు ఆ వాగ్దానాన్ని నమ్మారు. వారు దానిని ఎంతో కష్టపడి, ఇష్టపడి నిర్మించారు.
అలంకారికంగా కాదు, అక్షరాలా. చిప్స్, సాఫ్ట్వేర్, క్లౌడ్ సిస్టమ్స్, మీ ఫోన్లో నడుస్తున్న కోడ్. సిలికాన్ వ్యాలీ భారతీయ ప్రతిభను కేవలం స్వాగతించడమే కాదు. అది దానిపై ఆధారపడి నడిచింది కూడా. నేడు.. సిలికాన్ వ్యాలీలోని టెక్ వర్క్ఫోర్స్లో సుమారు మూడింట ఒక వంతు మంది భారత మూలాలకు చెందినవారే.
మొత్తం మీద.. వారు దాదాపు 50 వేల నుంచి 75వేల మంది టెక్ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ.. ఇక్కడ ఒక ఇబ్బందికరమైన ప్రశ్నతలెత్తుతోంది. యంత్రాన్ని నిర్మించిన వారిని, ఆల్ ఆఫ్ ఏ సడెన్.. యంత్రంలోకి చొరబడిన వారిలా చూసినప్పుడు.. అసలేం జరుగుతోంది? విమానాల్లో.. ప్రతిభామంతులను దిగుమతి చేసుకున్న అదే దేశం, చెక్కులు తీసుకున్న తర్వాత.. అకస్మాత్తుగా జాతీయవాదాన్ని కనుగొంటే ఏం జరుగుతోంది? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది.
ఎందుకంటే.. ఈ రోజు అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో, ఇండియన్లను ఐడల్ మైనార్టీగా చూడటం లేదు. వారు సులభంగా లొంగిపోయే అల్పసంఖ్యాక వర్గంలా మారుతున్నారు. దెబ్బలు తినే బలిపశువుగా, నిందకు పాత్రులుగా, ఇతరులుగా, పరాయివారిగా. ప్రపంచీకరణకు దేవాలయంలాంటి సిలికాన్ వ్యాలీ, భవిష్యత్తులా కాకుండా, తమ పరిసరాల్లోకి చొచ్చుకొచ్చిన ఆక్రమణదారులుగా వీరు చిత్రీకరించబడుతున్నారు.
ఈ సిలికాన్ వ్యాలీ కథ దాతృత్వం గురించి కాదు. పర్యాటకులు స్టార్బక్స్ను కనుగొన్నంత ఈజీగా, భారతీయులు యాదృచ్ఛికంగా సిలికాన్ వ్యాలీలోకి ప్రవేశించి విజయాన్ని అందుకోలేదు. అమెరికా వారిని నియమించుకుంది. అది కూడా చాలా దూకుడుగా.
1990లలో వలసల సరళీకరణ వరద గేట్లను తెరిచింది. సిలికాన్ వ్యాలీ ఇంజనీర్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూసింది. భారతదేశంలో వారు పుష్కలంగా ఉన్నారు. ఆధునిక చరిత్రలోనే అత్యంత కీలకమైన ప్రతిభా వలసలలో ఒకటైన ఈ ఘట్టం అలా మొదలైంది. ఈ ప్రాంతంలోని వ్యాపార కార్యనిర్వాహకులలో, శ్వేతజాతీయుల తర్వాత ఇండియన్ అమెరికన్లు రెండవ అతిపెద్ద సమూహంగా ఉన్నారు.ఇండియన్ అమెరికన్లు కార్పొరేట్ అమెరికాలో అత్యున్నత పదవులను అధిరోహించారు.
ఇంద్రా నూయి, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శాంతను నారాయణ్.. ఇలా వీరందరి విజయగాథలను.. ఒకప్పుడు అమెరికా ఎంతగానో ఇష్టపడింది. ఎందుకంటే ఈ విజయం ఒక స్ఫూర్తిదాయకం. ఆ తర్వాత ఏమైందో తెలీదు.. అకస్మాత్తుగా అది పూర్తిగా మారిపోయింది.
భారతీయులు తెల్లవారుజామున 2 గంటలకు క్యూబికల్స్లో నిశ్శబ్దంగా కోడింగ్ చేస్తున్నప్పుడు, వారు కష్టపడి పనిచేసే వలసదారులు. కానీ వారు ఇళ్లు కొనడం, కంపెనీలకు నాయకత్వం వహించడం, రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రారంభించిన తర్వాత, అమెరికాలోని కొన్ని వర్గాలు ప్రతిస్పందించడం మొదలుపెట్టాయి.
ఆదర్శ అల్పసంఖ్యాక వర్గం నుంచి బలిపశువుగా మారడం.. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. హెచ్-1బి వీసా హోల్డర్లను ఉద్యోగ దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల.. భారతీయులే అతిపెద్ద లబ్ధిదారులు. భారతీయ వలసదారులు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ, స్టీఫెన్ మిల్లర్, వలస విధానాల విషయంలో భారతీయులు చాలా మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దక్షిణాసియా ప్రజలపై ఆన్లైన్ దూషణలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో, ఆన్లైన్లో ఉపయోగించిన దక్షిణాసియా వ్యతిరేక దూషణలు రెట్టింపు అయ్యాయి. ఇటీవల, ఒక అమెరికన్ వ్యక్తి ఒక భారతీయ జంటను నిలదీస్తున్న వీడియో బాగా వైరల్ అయింది చూశారా? ఆ వీడియోలో, ఆ వ్యక్తి భారతీయ జంటను తిరిగి మీ దేశానికి వెళ్ళండి అని చెప్పడం మనం స్పష్టంగా వినవచ్చు.
ఫ్రీమాంట్లోని ఒక హిందూ దేవాలయం తలుపుపై నల్ల శిలువలను చిత్రించి ధ్వంసం చేశారు. 2024 డిసెంబర్ నాటి నుంచి, యునైటెడ్ స్టేట్స్ వ్యాప్తంగా ఎనిమిదికి పైగా హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి, వాటిలో అత్యధికం కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. ఈ దాడులు ఇకపై అక్కడక్కడా జరగడం లేదు. భారతీయులు అమెరికాపై దండెత్తుతున్నారనే కుట్ర సిద్ధాంతాలను బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు కొందరు అమెరికన్ రైటిస్టులు. భారతీయ జనసమూహాల ఫోటోలు ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారు. చేతులతో తినడం వెనుకబాటుతనానికి నిదర్శనంగా మారుతున్నది.
గత సంవత్సరం న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల సమయంలో, మాజీ డెమోక్రటిక్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకి చెందిన ఫ్రీలాన్స్ పబ్లిసిటీ టీం, ప్రస్తుత న్యూయార్క్ మేయర్ జోరాన్ మొమ్దానీ చేతులతో అజాగ్రత్తగా అన్నం తింటున్నట్లు చిత్రీకరిస్తూ, ఏఐ రూపొందించిన చిత్రాన్ని విడుదల చేసింది. సోషల్ మీడియా ప్రతీ విషయాన్ని విస్తృతం చేసింది.
గత సంవత్సరం ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఆన్లైన్లో దీపావళి శుభాకాంక్షలు పోస్ట్ చేసినప్పుడు, కొందరు ఎక్స్ట్రీమిస్టులు.. జాత్యహంకార దూషణలతో ముంచెత్తారు. నీ ఇంటికి తిరిగి వెళ్ళు. నీ ఇసుక రాక్షసులను పూజించు. ఇదీ వారి నుంచి వచ్చిన ప్రతిస్పందన. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి రాజకీయ నాయకులు కూడా ఈ దాడులను ఎదుర్కొన్నారు.
ఇది ఎంత అసంబద్ధమో ఆలోచించండని అంటారు ఇండో అమెరికన్స్. అమెరికా ఇన్స్టాగ్రామ్లో టాకోస్ను వేడుకగా జరుపుకుంటుంది, సుషీ ట్రెండింగ్లోకి వస్తుంది, యోగా బిలియన్ డాలర్ల వెల్నెస్ పరిశ్రమగా మారుతుంది, కానీ అకస్మాత్తుగా దీపావళి ఒక విదేశీ పండుగలా అనిపిస్తుంది.
ఆ తర్వాత రాజకీయ ద్వంద్వ ప్రసంగం మన చెవులను తాకుతుంది. అమెరికా తనకు అత్యుత్తమైన అత్యంత తెలివైన వారు కావాలని చెబుతుంది. కానీ, ఆ అత్యంత తెలివైన వారే విదేశీయుడిలా వినిపించడం మొదలుపెట్టే వరకు. అప్పుటి వరకూ ఉన్న సరళతరమైన నిబంధనలు అకస్మాత్తుగా మారిపోతాయి. పెరిగిన వీసా ఫీజులు, పౌరసత్వ ప్రక్రియలో.. అడ్డంకులు, గ్రీన్ కార్డ్ కోసం అంతులేని పెండింగ్ కేసులు. భారతీయ నిపుణులు సంవత్సరాల తరబడి, కొన్నిసార్లు దశాబ్దాల తరబడి వేచి చూస్తారు.
ఈ పరిణామం మరింత వేగవంతమైతే, అది బే ఏరియా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగలదు, ఎందుకంటే ఆ ఆర్థిక వ్యవస్థ టెక్ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త ప్రతిభను ఆకర్షించడంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇవన్నీ ఉన్నా, భారతీయ అమెరికన్లు యునైటెడ్ స్టేట్స్లో.. అత్యధిక సంపాదన, ఉన్నత విద్య గల వర్గాలలో ఒకరిగా నిలిచారు. ఇండియన్ అమెరికన్ల సగటు కుటుంబ ఆదాయం సుమారు లక్షన్నరగా ఉంది. అదే అమెరికన్ల విషయానికి వస్తే ఇది డెబ్బై వేలుగా ఉంది. సుమారు 70 శాతం మంది ఇండియన్ అమెరికన్లు.. వివిధ రకాల విద్య, వైద్యం, ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో డిగ్రీలను కలిగి ఉన్నారు. అంతే స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు కూడా.
అమెరికా పన్నుల వ్యవస్థకు వారు మరింత బలాన్ని చేకూర్చుతున్నారు. జనాభాలో కేవలం 1.5శాతం ఉన్నప్పటికీ, మొత్తం యు.ఎస్. ఆదాయపు పన్నులలో సుమారు 5శాతం నుంచి 6శాతం వరకు చెల్లిస్తున్నారు. అది ఆర్థిక వ్యవస్థపై భారం కాదు. అదే అసలైన ఆర్థిక వ్యవస్థ. వలస కార్మికుల శ్రమ, శక్తుల ద్వారా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం. ఆపై వారిని వెళ్లగొట్టే యత్నం చేయడమే ఇక్కడ అతి పెద్ద నమ్మక ద్రోహాన్ని తలపిస్తోంది. ఇక్కడే సిలికాన్ వ్యాలీ తన అతిపెద్ద వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్నది. మీరు వలస కార్మికులతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి, ఆ తర్వాత వలసదారులు విజయం సాధించినప్పుడు ఆశ్చర్యపోయినట్లు నటించలేరు. అది లెబ్రాన్ జేమ్స్ను నియమించుకుని, ఆ తర్వాత అతను చాలా ఎక్కువ పాయింట్లు సాధిస్తున్నాడని ఫిర్యాదు చేయడం లాంటిది.
సిలికాన్ వ్యాలీ రాత్రికి రాత్రే అదృశ్యం కాదు. కానీ దాని ఆత్మ.. ప్రపంచం నలుమూలల నుంచి.. అత్యుత్తమ మేధావులు ఒకే చోట చేరి భవిష్యత్తును నిర్మించగలరనే అద్భుతమైన అందమైన ఆలోచన. ఆ ఆత్మ క్రమంగా డొల్లగా మారుతోంది. ఒక్కో ద్వేషపూరిత పోస్ట్, ధ్వంసానికి గురవుతోన్న ఒక్కో దేవాలయం, తిరస్కరించిన ఒకానొక వీసాతో ఇది జరుగుతోంది.
ఇది వలసదారుల భూమి. మరి ఇక్కడి స్థానికులు ఎవరు? నిస్సందేహంగా స్థానిక అమెరికన్లు, అంటే రెడ్ ఇండియన్లు. వారికేమైంది? ఈ కాలంలో అమెరికాలో ఎంతమంది మిగిలి ఉన్నారు? 400 సంవత్సరాల క్రితం ఐరోపా ఖండం నుంచి పశ్చిమ అర్ధగోళానికి వలస వచ్చిన శ్వేతజాతి ఆంగ్లో-సాక్సన్ ప్రొటెస్టంట్లు, కాథలిక్కులు. మిగిలింది చరిత్ర, స్థానిక అమెరికన్లను వధించి నిర్మూలించారు. తెలివైన ఐరోపా వలసదారులు కేవలం పశ్చిమ అర్ధగోళాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్ని వలసరాజ్యంగా మార్చుకున్నారు. ఆఫ్రికన్లను తోటల కార్మికులుగా తీసుకువచ్చి బానిసలుగా మార్చారు. ఆ బానిస కార్మికులను ఎలా చూశారనేది చరిత్ర.
ఆధిపత్యం చెలాయించిన, వివేకవంతులైన, తెలివైన ఆ యూరోపియన్ల వారసులు తమను తాము స్థాపించుకున్నారు. వారే పుట్టుకతో అమెరికన్లు. ఇక భారతీయుల వంటి ఇటీవలి వలసదారుల విషయానికి వస్తే, వారందరూ ఉన్నత విద్యావంతులు, చట్టబద్ధంగా వచ్చారు, కష్టపడి పనిచేశారు, తమ బాధ్యతలను నెరవేర్చారు, సంపదను సృష్టించి అమెరికాను సుసంపన్నం చేశారు. వారు సృష్టించే ప్రతి హెచ్1బీ వీసాకు 1.8 అదనపు ఉద్యోగాలు లభిస్తున్నాయి. 1.2శాతం మంది భారతీయ వలసదారులు అమెరికాలో విధించే వ్యక్తిగత పన్నులలో 6శాతం వరకూ చెల్లిస్తున్నారు.
వారి వారసులు పుట్టుకతోనే పౌరులుగా ఉన్న యూరోపియన్ వలసదారులకు, ప్రస్తుతం వలస వచ్చిన భారతీయుల వంటి వలసదారులకు మధ్య గల ఏకైక తేడా ఏమిటంటే, యూరోపియన్ల దగ్గర వారి వలసకు సంబంధించిన రికార్డు ఉండదు, కానీ భారతీయుల వద్ద వారు వలస వచ్చిన తేదీ ఇతరత్రా వివరాలుంటాయి. వారి మధ్య ఉన్న ఏకైక తేడా ఇదే. వారిలో చాలామంది ఈ గొప్ప అవకాశాల గడ్డకు వలస వచ్చినవారే.
ఆ రోజుల్లో యూరోపియన్ వలసదారులు తెలివైనవారు, వివేకవంతులు కాబట్టి వారు.. పశ్చిమ అర్ధగోళంపై ఆధిపత్యం చెలాయించారు. చరిత్రే గనుక సాక్ష్యమైతే, తెలివైనవారే ఎల్లప్పుడూ పెత్తనం చేస్తారు. మార్పు ఒక్కటే శాశ్వతం. సణుగుతూ, అలిగే వారు వివక్ష చూపడం మానేసి.. తొలుత శాంతిని నెలకొల్పాలి, ఎందుకంటే వివక్ష చూపడం చాలా అన్యాయం కాబట్టి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






