ఆ కుర్రోడికి నోట్లో 232 పళ్ళు!

posted on: Jul 26, 2014 2:47PM

 

మనకి ముప్ఫై రెండు పళ్ళ సంగతే తెలుసు. కానీ ఆ కుర్రాడికి 232 పళ్ళ సంగతి తెలుసు. ఎందుకంటే అతని నోట్లోంచి 232 పళ్ళు బయటపడ్డాయి. ఆషిక్ గవాయ్ అనే ఓ ముంబై కుర్రాడు కుడిబుగ్గ బాగా వాచిపోయి ముంబైలోని జేజే ఆస్పత్రికి వెళ్ళాడు. అతని నోటిని పరీక్షించిన డాక్టర్లు నోళ్ళు తెరిచారు. ఎందుకంటే అతని పళ్ళ చిగుళ్ళలో బోలెడన్ని పళ్ళు మొలుస్తున్నాయి. డాక్టర్లు ఈ వ్యాధిని కాంప్లెక్స్ అడంటోమా వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి వల్ల దవడ లోపల ఒక కణితి పుడుతుంది. దానివల్ల అదనపు పళ్ళు వస్తాయి. మొత్తమ్మీద అతనికి ఆపరేషన్ చేసి అదనంగా ఉన్న 232 పళ్లను తీసేశారు. పళ్ళు వస్తే వచ్చాయి పోతే పోయాయిగాని ఇప్పుడు ఆషిక్ గవాయ్ అత్యధిక పళ్లు ఉన్న మనిషిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించబోతున్నాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...