Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్, అన్నీ ఆర్నెళ్ల తరువాతే
posted on: Jun 22, 2012 10:27AM
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రప్రభుత్వం బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఉపఎన్నికలకు ముందే ఈ ఎన్నికలు నిర్వహిద్డామనుకున్న ప్రభుత్వం రాష్టపతి ఎన్నికల గురించి దీన్ని వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ప్రతికూలంగా ఉండటంతో అసలు ఈ ఎన్నికల ప్రస్తావనే ప్రభుత్వం మరిచిపోయింది. మరో ఆర్నెళ్లపాటు ఈ ఎన్నికలు జరగాకపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బిసీలను దగ్గర చేసేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని సిఎం గతంలో భావించారు. నగరపాలక సంస్థలకు, మున్సిపాల్టీలకు, పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తే ద్వితీయశ్రేణి నాయకులు పార్టీపై విశ్వాసంతో పనిచేస్తారని సిఎం అభిప్రాయపడ్డారు. వీరంతా 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి పార్టీ వెనుక బలంగా ఉంటారని ఆయన భావించారు. ఉపఎన్నికల ఫలితాలు జగన్ కు సానుభూతిగా వచ్చాయని భావించిన ప్రభుత్వం మరో ఆర్నెల్లు ఆగితే ఈ సానుభూతి తగ్గుతుందని భావిస్తోంది. అయితే ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీలకూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటమే నష్టాన్ని తెచ్చిపెట్టాయని పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా బిసిలపైనే ఆధారపడి ఉన్నంతున ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ ద్వితీయశ్రేణి గెలిచి ఉంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కస్థానమైనా దక్కేదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యాక, మరో ఆర్నెల్లలో ఈ ఎన్నికలను ప్రభుత్వం జరిపిస్తుందని పార్టీల జిల్లా అధ్యక్షులు ద్వితీయశ్రేణి నాయకులకు హామీలు ఇస్తున్నారు. జగన్ ప్రభావం తగ్గేన్తవరకూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు జరగనీయదని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులూ తమ మాజీలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం మాత్రమే పోటీపడేలా ఈ ఎన్నికలు జరగకపోతే భవిష్యత్తు రాజేకీయపరిణామాలు చేజారుతాయని వారు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆర్నెళ్ల తరువాత కూడా ఇదే స్పీడులో ఉంటేనో అన్న ప్రశ్నకు రెండు పార్టీల నేతలూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.






