Latest News
శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే పి ఏ ఆత్మహత్య
posted on: Dec 28, 2023 9:37AM
శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పిఏ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మెల్యే ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా వుండగా నిరుడు ఇదే నెలలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బావమరిది సామాను శ్రీధర్ రెడ్డి పోలీసులు ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా అధికారిక విషయాల్లో బావమరిది జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలు రావడంతో ఆయనను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దూరం పెడుతూ వచ్చారు. ఈ దూరం రాను రాను మరింతగా పెరిగింది. అది కాస్త సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వరకు వెళ్లింది. దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన పోలీసులు ముందే సామాను శ్రీధర్ రెడ్డి కత్తితో రెండు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.బావమరిది స్థానంలో రవి ఎమ్మెల్యే పిఏగా చేరాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే వైసీపీ ఎమ్మెల్యే పిఏ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది.


.webp)



