ముగిసిన వరంగల్, ఖమ్మం ఎన్నికల ప్రచారం..

posted on: Mar 4, 2016 4:12PM


 

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 6 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. గ్రేటర్ వరంగల్ లో 58 డివిజన్లకు 398 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా.. మొత్తం 6, 10, 840 ఓటర్లు ఉన్నారు. ఇక  ఖమ్మం కార్పోరేషన్లో మొత్తం 50 డిలిజన్లలో 291 అభ్యర్ధులు పోటీ చేస్తుండగా.. 2,65,710 ఓటర్లు ఉన్నారు. గ్రేటర్ వరంగల్ లో 653 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలను 265 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఈనెల 9న ఎన్నికల ఫలితాలు ఉంటాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...