సడన్‌గా ప‌వ‌న్‌పై కోమ‌టిరెడ్డి దాడి వెన‌క‌ మర్మం ఏంటో?

 

ఏపీ ఉప  ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు ఏపీలోని  వైసీపీ ఆపై తెలంగాణ‌లోని బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడ‌ర్ల  పాలిట  పంచ్ బ్యాగ్ అయ్యారా? అంటే అవున‌నే తెలుస్తోంది. అప్పుడెప్పుడో ప‌వ‌న్  రాజోలు ప‌ర్య‌ట‌న చేసిన‌పుడు.. అన్యాప‌దేశంగా ఒక మాట అనేశారు. అదేంటంటే ఏపీ,  తెలంగాణ విడిపోవ‌డానికి కార‌ణం కోన‌సీమ‌లోని ప‌చ్చ‌ద‌న‌మే అనేశారు. అందుకే ఇక్క‌డి కొబ్బ‌రి చెట్లు మోడువారిపోయాయ‌ని అనాలోచితంగా అనేశారాయ‌న‌. 

త‌న చేతిలో మైకు ఉన్న‌ద‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు లేరు. ఆపై అక్క‌డి  జ‌నాన్ని ఏదో ఊర‌డించ‌డానికి కూడా ఆయ‌నిలా అని  ఉంటారేమో తెలీదు. తాను ఉప  ముఖ్య‌మంత్రిన‌నీ..  ఇలాంటి మాట‌లు అనాలీ, అన‌కూడ‌ద‌న్న సోయ కూడా ప‌వ‌న్ కి ఆ టైంలో లేక పోయి ఉండొచ్చు. విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో పాపుల‌ర్ అయిన ప‌వ‌న్ అన్న విష‌యం ఒక్కోసారి  మ‌ర‌చి పోయే ప‌వన్ ఇంట్లో వాళ్ల ముందు మాట్లాడిన‌ట్టు ఆ ప్రాంత  ప్ర‌జ‌ల ముందు మాట్లాడేశారు. మ‌న కోన‌సీమ‌కు తెలంగాణ వాళ్ల న‌ర‌దిష్టి త‌గిలి ఉంటుంద‌ని.. అనేశారు. అందుకే ఆ చెట్లు అలా మోడు వారి పోయాయ‌ని తేల్చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

అయితే ఈ వియంలో ఫ‌స్ట్ రియాక్ట‌య్యింది మాత్రం బీఆర్ఎస్ మాజీ  మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అటు పిమ్మ‌ట వైసీపీ మాజీ మంత్రి అంబ‌టి సైతం ఈ విష‌యంపై త‌న‌వైన సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. ఇక ఎమ్మెల్సీ బ‌ల్మూరి, మంత్రి వాకిటి శ్రీహ‌రి త‌దిత‌ర మంత్రులు కూడా ప‌వ‌న్ని తిట్ట‌డంలో త‌లో నాలుక వేశారు. ఇక అంద‌రూ అయిపోయారు. ఇక్క‌డితో ఈ మొత్తం వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగిన‌ట్టేన‌ని భావించిన‌పుడు స‌డెన్ స‌ర్ ప్రైజ్ గా తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి రియాక్ట‌య్యారు. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెల్ల త‌ర్వాత ఏంటీ మోత‌.. అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డింది.

ఈ మ‌ధ్య కాలంలో కోమ‌టిరెడ్డికి మంత్రిమండ‌లిలో త‌గిన ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్టు కూడా క‌నిపించ‌డం లేదు. ఇందుకు రిల‌వెంట్ గా ఒక ఎగ్జాంపుల్ ని బ‌ట్టీ చూస్తే.. సీఎం రేవంత్ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి అయిన  కోమ‌టిరెడ్డికి ఎలాంటి  స‌మాచారం ఇవ్వ‌కుండానే జూబ్లీ ప్ర‌చారంలో.. సినిమా వారిపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. .సంబంధిత మంత్రి అయిన కోమ‌టిరెడ్డి తో సంబంధం లేకుండా సినిమా వారంద‌రితో భేటీ  అయ్యారు కూడా. ఇంకా ఎన్నెన్నో వ‌రాల‌ను సినీ కార్మికుల‌పై కుమ్మ‌రించారు.

దీంతో అంద‌రిలోనూ ఒక అనుమానం.. సంబంధిత మంత్రి. కోమటిరెడ్డి ఆఫ్ ప్రెజ‌న్స్ లో.. సీఎం ఈ త‌ర‌హా వ్య‌వ‌హార‌శైలి ఏంట‌న్న ప్రశ్న  త‌లెత్తింది. దీనంత‌టికీ  కార‌ణం కోమ‌టిరెడ్డి మంత్రి ప‌ద‌వి  ఊడిపోనుంద‌న్న మాట వినిపించింది. మ‌రి వీట‌న్నిటి న‌డుమ కోమ‌టిరెడ్డి త‌న ఉనికి కాపాడుకోవ‌డంలో భాగంగానే ప‌వ‌న్ పై ఈ కామెంట్లు చేశారా? అన్న అనుమానం వ‌స్తోంది.

త‌న మంత్రిత్వానికి ప్ర‌మాదం ఉంద‌నో ఏమో ఇటీవ‌ల రేవంత్ రెడ్డి కోసం ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు కోమ‌టిరెడ్డి. వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తుంటే కోమ‌టిరెడ్డి ఏదో ట్ర‌బుల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు కొంద‌రు. అన్న వెంక‌ట‌రెడ్డి ప‌రిస్థితి ఇలా ఉందంటే త‌మ్ముడు రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం  చూస్తే.. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని ఎప్ప‌టి నుంచో బుంగ‌మూతి పెట్టుకుని  కూర్చున్నారు. మ‌రి ఈ న‌ల్గొండ‌ బ్ర‌ద‌ర్స్ ఫ్యూచ‌రేంటి?  తెలియాల్సి ఉంది.

పరిశోధనలకు కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ : సీఎం చంద్రబాబు

  అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని సీఎం చంద్రబాబు  ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో గురువారం వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల బృందంతో సీఎం సమావేశం అయ్యారు.  వైద్యరంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలకు గానూ గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని పరిశోధకులు, విద్యావేత్తల బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా ఏర్పాటు అవుతున్నట్టు వివరించింది. గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ బృందం సభ్యులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి.. వైద్యారోగ్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ అంశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు.  క్వాంటం పరిశోధనలతో బయోసెన్సార్ల లాంటి అప్లికేషన్లను కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాల్సి ఉందని అన్నారు. అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సీఎం వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ఈ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయని వారికి వివరించారు. నేషనల్ క్వాంటం మిషన్ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తుంటే  మొత్తంగా క్వాంటం ఎకో సిస్టం అమరావతికి వస్తోందని సీఎం అన్నారు. గతంలో అందిపుచ్చుకున్న ఐటీ, జీనోమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు ఇప్పుడు విజయగాథలుగా మారాయని సీఎం వ్యాఖ్యానించారు.  ఇప్పుడు క్వాంటం గురించి అంతా ఆలోచిస్తున్న సమయంలో ఆ రంగంలో పనిచేయడానికి ఔత్సాహిక కంపెనీలు ఏపీని సంప్రదిస్తున్నాయని అన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం కంప్యూటర్ కేంద్రం ద్వారా పరిశోథనలు చేసి ఔషధాలు, మెటీరియల్ సైన్స్ సహా వివిధ అంశాల్లో వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. క్వాంటం బయోఫౌండ్రీ అనేది వినూత్న ఆలోచన అని ముఖ్యమంత్రి అన్నారు.  బయోమెడికల్ రీసెర్చితో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, రవాణా సహా వేర్వేరు రంగాల్లోని భాగస్వాములు క్వాంటం వ్యాలీ సేవలను వినియోగించుకునేలా ఎకోసిస్టం అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చి సంస్థలకు ఏక్యూసీసీ కేంద్రంగా అవుతుందని తెలిపారు.  రూ.200 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీ ద్వారా మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్స్, మెటిరియల్ సైన్స్ పై పరిశోధనలు చేయనున్నట్టు విద్యావేత్తలు, పరిశోధకుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. క్వాంటం వ్యాలీతో పాటు, ఏపీలో అమలవుతున్న విధానాలను తమను ఆకర్షించాయని గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.  

ఇండిగో నుంచి ప్ర‌తిదీ దేశం కోసం కాదు..అదానీ కోస‌మేనా!?

  ఇండిగో వ్య‌వ‌హారం  వెన‌క అదాని  ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయా? అస‌లు అదానీకి  మోదీకి ఉన్న సంబంధ బాంధ‌వ్యాలేంటి?  సీ పోర్ట్, ఎయిర్ పోర్ట్,  రోడ్లు, విద్యుత్ ఇలా రంగ‌మేదైనా  స‌రే, అదాని  ప‌రం చేయ‌డానికే మోడీ ఇదంతా  చేస్తున్నారా? అంటే మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన  ప‌రిణామ క్ర‌మం ఏంటో ఒక‌సారి ప‌రిశీలించాల్సి వ‌స్తుంది. తాజాగా త‌లెత్తిన ఇండిగో వ్య‌వ‌హారంలో అదానీ సంస్థ‌ల‌ పాత్ర బ‌హిర్గ‌త‌మైంది. అదెలాగంటే అదానీ ఏవియేష‌న్, పైల‌ట్ ట్రైనింగ్ లోకి అడుగు పెట్టారు. అదానీ ట్రైనింగ్ సెంట‌ర్లో ఇబ్బ‌డి  ముబ్బ‌డిగా పైల‌ట్ ట్రైనింగ్ కి  జ‌నం చేరాలంటే అందుకు త‌గిన విధంగా రూల్స్ అండ్  రెగ్యులేష‌న్స్ మార్పించాలి. అందులో భాగంగానే డీజీసీఏ ద్వారా  పైల‌ట్ల  ప‌ని గంట‌లపై ఒక రూల్ పాస్ చేశారు. దీంతో ఇండిగోకి వేలాది  మంది  పైల‌ట్ల అవ‌స‌రం ఏర్ప‌డింది. అలా ఇండిగో  సంక్షోభం త‌లెత్తింద‌ని ఒక‌ అంచ‌నా. కేవ‌లం ఈ ఒక్క అంశం మాత్ర‌మే కాదు.. డిమానిటైజేష‌న్, రైతుల గిట్టుబాటు ధ‌ర‌ల విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ని చెప్పాలంటారు ప‌లువురు ప‌రిశీల‌కులు. అదానికి లాభం చేకూర్చ‌డ‌మే ధ్యేయంగా ఈ మొత్తం  నెట్ వ‌ర్క్ ప‌ని చేస్తుందంటే అతిశ‌యోక్తి కాదేమో. ఒక‌ప్పుడు బీజేపీ గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి మొత్తం  నాగ్ పూర్ లో కేంద్రీకృత‌మ‌య్యి ఉండేది. అదే, 2014 నుంచి ఈ గ్రావిటీ మొత్తం గుజ‌రాత్ త‌ర‌లి వెళ్లింది. మ‌రీ ముఖ్యంగా మోడీ, షా ఎక్క‌డుంటే అక్క‌డ కేంద్రీకృతం కావ‌డం ప్రారంభ‌మ‌య్యింది. ఇంకా జూమ్ వేసుకుని చూస్తే.. ప్ర‌స్తుత బీజేపీ పాల‌న మొత్తం అదానీ కేంద్రంగా న‌డుస్తున్న‌ట్టుగా బ‌య‌ట ప‌డుతుందంటారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందుకు వీరు ఎవ‌ర్నైనా బ‌లి పెట్టేస్తార‌న‌డంలో ఎంత మాత్రం అనుమానం లేద‌ని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం ఇండిగో వ్య‌వ‌హారంలో దేశం ప‌రువు ప్ర‌తిష్ట‌లు ఎంత‌గా మంట గ‌ల‌సి పోతున్నా స‌రే, లెక్క చేయ‌కుండా అది మిస్ ఫైర్ కావ‌డంతో వెంట‌నే కోలుకుని ఆ నింద మొత్తం ఒక‌రిపై నెట్టేయ‌డం అంటే అది మాములు విష‌యం కాదు. అందుకే ఆ వ్య‌క్తికి అంత‌టి మంత్రి ప‌ద‌వి ఇచ్చారా? అన్న డౌట్ కూడా వ‌స్తుంది.  మోడీని గుడ్డిగా న‌మ్మే వారికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఏపీలో ఉన్న అన్ని పోర్టులు అదానీకి రాసిచ్చేశారు. విశాఖ గంగ‌వ‌రం పోర్ట్, వైజాగ్ పోర్టు ప్ర‌స్తుతం అదానీ గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. గాజువాక స్టీల్ ప్లాంట్ భూముల విష‌యానికి వ‌స్తే.. ఒక సిమెంటు కంపెనీకి ప్లాంట్ కోసం భూమికావాలి. అందుకోసం ఏకంగా విశాఖ ఉక్కునే అమ్మేయాల‌న్న  ప్ర‌తిపాద‌న‌లు వెలుగు చూశాయి.  క‌రోనా టైంలో కూడా లాభాల్లో ఉంటే.. దాని ఫ‌ర్నీసులు కొంత  కాలం  నిలిపేశారు. అట్లుంట‌ది మోడీతో అనంటారు. విశాఖ‌లో అదానీ సెంట‌ర్ కోసం వంద‌ల ఎక‌రాల భూములిచ్చేస్తున్నారు. ఇలా నేరుగా చేస్తే వ్య‌తిరేఖ‌త వ‌స్తుంద‌ని భావించి గూగుల్ ముసుగు వేశార‌ని చెప్పుకొస్తున్నారు. వ‌చ్చే రోజుల్లో విశాఖ‌ప‌ట్నం కాస్తా అదానీ ప‌ట్నంగా మారినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. దేశంలో ఆహార గోదాముల‌న్నిటినీ అదానీకి రాసిచ్చేయ‌డం వెన‌క‌.. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌ల్లేకుండా కేవ‌లం  కార్పొరేట్ కంపెనీలు మాత్ర‌మే బాగు ప‌డాల‌న్న ఉద్దేశం దాగి ఉంద‌ని అంటారు. రైతులు ఢిల్లీలో ఘోర‌మైన చ‌లిలో ఉద్య‌మం చేశారు. ఆ రైతుల్లో కొంద‌రు చ‌లికి త‌ట్టుకోలేక మ‌ర‌ణించాక‌.. అప్పుడు రైతు గిట్టుబాటు ధ‌ర‌ల చ‌ట్టం చేశారు.   ఇక ల‌డ‌ఖ్ లో 45 వేల ఎక‌రాల భూమి వ్య‌వ‌హారం. అక్క‌డంతా కొండ‌ల మ‌యం. ఆ భూమిని కూడా అదానీ ప‌రం చేసేశారు. సోలార్ ప‌వ‌ర్ కోసం క‌ట్ట‌బెట్టేశారు. అందుకే ఆర్టిక‌ల్ 370 ర‌ద్ద‌య్యింద‌న్న విష‌యం ఎంత మందికి తెలుసు?  ఇదంతా గుర్తించ‌ని గుజ‌రాతీ మార్క్ భ‌క్త జ‌నం.. హిందూ- ముస్లిం, భార‌త్- పాక్ మాయ‌లో ప‌డిపోతుంటారు. దీంతో ల‌ఢాఖ్ భూముల విష‌యంలో పోరాడుతున్న సోనం వాంగ్ చుక్ అనే సైంటిస్టును విల‌న్ గా చిత్రీక‌రిస్తారు. అత‌డ్ని జైల్లో పెట్టినా.. అంతా దేశం కోస‌మే అనుకుంటారు. కానీ, ఇదంతా అదానీ కోస‌మ‌ని తెలుసుకోలేని పిచ్చిత‌నం ఈ జ‌నానిద‌ని చెప్పుకొస్తారు కొంద‌రు ప‌రిశీల‌కులు. ఇక మ‌ణిపూర్ అల్ల‌ర్ల సంగ‌తి  స‌రే స‌రి. ఈ ప్ర‌పంచానికి తెలియ‌దు.. అక్క‌డ ఎంత‌టి ర‌క్త‌పాతం జ‌రిగిందో. ఇదంతా ఎందుకంటే అక్క‌డ అద్భుత‌మైన  లిథియం ఉంది. దీన్ని కూడా అదానీకి  రాసివ్వ‌డంలో భాగం. అందుకే ఆర్టిక‌ల్స్ ర‌ద్ద‌వుతుంటాయి. కొత్త కొత్త చ‌ట్టాలు పుట్టుకొస్తుంటాయి. ఎవ‌రైనా ఎదురొడ్డి పోరాడితే వారి  ప్రాణాలు సైతం పోతుంటాయ‌ని అంటారు కొంద‌రు విశ్లేష‌కులు. ఛ‌త్తీస్ గ‌ఢ్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల ఎన్ కౌంట‌ర్లో చ‌నిపోయిన హిడ్మా ఉదంతం తీస్కుంటే.. న‌క్స‌లైట్ల  ఉనికి లేని స‌మ‌యంలో కూడా అతి పెద్ద ఉద్య‌మం తీసుకొచ్చారు. అదే  2026 మార్చి నాటికి న‌క్స‌లైట్ ఫ్రీ స్టేట్ గా చేయ‌డం. దీని వెన‌క అస‌లు ఉద్దేశం ఏంటో చూస్తే.. హిడ్మా ఇక్క‌డ అడ్డుగా  ఉన్నాడ‌ని చెప్పి అత‌డ్ని ఎన్ కౌంట‌ర్ చేయించారు. ఎప్పుడైతే హిడ్మా అడ్డు తొలిగిందో.. ఆనాటి  నుంచి అదానీ సంస్థ‌ అక్క‌డ అడ‌వుల‌ను న‌రికి బొగ్గు త‌వ్వ‌కం ప్రారంభిస్తుంది. అందుకే తీవ్రంగా ఉద్య‌మిస్తున్నారు స్థానిక ఆదివాసీలు. అంతెందుకూ ఏపీలో అదానీ స్మార్ట్ మీట‌ర్స్ సంగ‌తే తీస్కుంటే  ఎంత దోపీడీ జ‌ర‌గ‌నుందో ముందు ముందు తెలుస్తుంద‌ని అంటారు. ఇక కేజీ బేసిన్ వ్య‌వ‌హారం విష‌యానికి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి గుజ‌రాత్ కి పైపులైన్లు వేసి మ‌రీ తోడేస్తున్న సంగ‌తి తెలిసిందే. నాటి సీఎం ఏమ‌య్యారో విధిత‌మే.  ఇక్క‌డ జ‌నం ఎక్క‌డ మోస‌పోతుంటారంటే.. నాణానికి ఒక వైపు మాత్ర‌మే చూడ్డం వ‌ల్ల‌. మోడీ అండ్ కో ఆడించే  హిందూ- ముస్లిం, భార‌త్- పాక్ వంటి రాజ‌కీయ నాట‌కాలు మ‌రుగున  ప‌డిపోతుంటాయ్. ఒక వైపు బొమ్మ మాత్ర‌మే చూపించి మ‌రో వైపు అంబానీ, అదానీల‌కు ఈ దేశ ఆదివాసీల సంప‌ద దోచి పెట్టేస్తుంటార‌ని అంటారు ఈ వ్య‌వ‌హారాలు తెలిసిన‌ వారు. పాక్ అంటే మ‌న‌కు మాత్ర‌మే శ‌తృత్వం. అదే మోడీకి కాదు. అందుకే  ఆయ‌న ఎవ‌రికీ తెలీకుండా ఆ దేశం వెళ్లి విర్యానీలు భోం చేసి వ‌చ్చేస్తుంటారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో పాక్ ని ఒక శ‌తృదేశంగా చిత్రీక‌రించి జ‌నాన్ని ఆ మాయ‌లో ప‌డేలా  చేస్తుంటార‌న్న‌ది ఇక్క‌డ స్ప‌ష్టాతి స్ప‌ష్టం. కానీ దాన్నెవ‌రూ ప‌ట్టించుకోకుండా టోట‌ల్ బ్ల‌ర్.. చేసి బొమ్మ చూపిస్తారన్న  ఆరోప‌ణ‌లున్నాయ్.  బీహార్లోనూ అంతే ల‌క్ష  ఎక‌రాల భూమిని కేవ‌లం రూపాయ ధ‌ర‌కు అంబానీ ప‌రం చేసేశారు. అదేమంటే జ‌నం ఇళ్లు, గుడులు కూల‌దోస్తున్నారు దీంతో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ టైంలో మోడీ భూటాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.. అయితే ఇక్క‌డికి మోడీ ఎందుకెళ్లారో చూస్తే.. ఆ వెంట‌నే ఆ దేశంలో అదానీ ప్ర‌త్య‌క్ష‌మై.. అగ్రిమెంట్ చేసుకున్నారు.  ఇదే కాదు దేశ‌మేదైనా.. స‌రే, మోడీ ఏదైనా విదేశీ ప‌ర్య‌ట‌న చేస్తే.. ఆ వెన‌క‌ అదానీ వ్యాపార అగ్రిమెంట్లు దాగి ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇది నిన్న‌మొన్నటి ఇండిగో అయినా, మ‌రొక‌టైనా అంతా దేశం కోస‌మ‌ని అంటారు కానీ, అదానీ కోస‌మేన‌ని తెలుస్తోంది. కానీ ఈ వ్య‌వ‌హార‌మేదీ జ‌నానికి  ఎందుకు తెలీదంటే, దేశ వ్యాప్తంగా ఉన్న 13 మీడియా సంస్థ‌లు అదానీ చేతిలో ఉండ‌గా.. అంబానీ చేతిలో 21 ఉండ‌టంతో ఇదంతా క‌నిపించ‌ని మ‌హామాయ‌గా జ‌రుగుతూనే వస్తోంది. ఇలాంటివి ఇంకెన్ని.. సంక్షోభాలు చూడాలో ఆ పైవాడికే  ఎరుక‌!!!

గంజాయి మత్తులో కార్లకు నిప్పంటించిన యువకులు

  హైదరాబాద్‌ నగరంలో కొంతమంది యువకులు నడిరోడ్డు మీద హంగామా సృష్టించారు. యూసుఫ్‌ గూడా రహమత్ నగర్ కార్మికనగర్‌లోని ఎస్వీఎస్‌ గ్రౌండ్‌లో గురువారం మధ్యాహ్నం సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ నిలిపి ఉంచిన పలువురు వ్యక్తులకు చెందిన కార్లు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకోవడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అలజడి చెలరేగింది. క్షణాల్లో మంటలు ఎగసిపడుతూ వరుసగా వాహనాలను చుట్టుముట్టాయి.  ఈ మంటలో మూడు కార్లు, ఒక ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బందిఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సుమారు కొన్ని గంటల ప్రయత్నాల తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చినా అప్పటికే పలువురు కార్లు ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రాథమిక విచారణలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  గంజాయి మరియు మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు  నడి రోడ్డుపై హల్ చల్ చేస్తు...అక్కడ నిలిచిన కార్లకు ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన గ్రౌండ్‌లో సెక్యూరిటీ లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారకులైన యువకులను పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగించారు.

ప‌ట్టులోనూ అవినీతి ప‌ట్టా వెంక‌న్నా...నీ చుట్టూ ఏం జ‌రుగుతోంది స్వామీ

  క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి చుట్టూ మ‌రీ ఇన్ని అవినీతి బాగోతాలా?  మొన్న ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారం, నిన్న ప‌ర‌కామ‌ణి ఇష్యూ.. తాజాగా ప‌ట్టు వ‌స్త్రాల అవినీతి బండారం.  పాపం ఆ వెంక‌న్న ఇంత పెద్ద నామాల‌తో క‌ళ్లు మూసుకుని ఉంటారు కాబ‌ట్టి  వీరిష్టానికి వీరు య‌ధేచ్చ‌గా దోపిడీ చేసేస్తున్నారు. ఆయ‌న నిజ నేత్ర ద‌ర్శ‌న  స‌మ‌యంలో ఈ అవినీతి బండారం ఎవ‌రో ఒక‌రి రూపంలో బ‌య‌ట ప‌డేస్తున్నారు. ఇంత‌కీ తాజా వ్య‌వ‌హారంలో ఎవ‌రూ,  ఏంట‌ని చూస్తే.. ప‌దేళ్ల కాలంలో అంటే, 2015- 25 మ‌ధ్య‌కాలంలో కేవ‌లం ప‌ట్టు కండువాల కుంభ‌కోణంలో 54 కోట్ల పై చిలుకు కొల్లగొట్టేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. శ్రీవారు రాత్రింబ‌వ‌ళ్లు కాళ్లు నొప్పులు పుట్టేట‌ట్టు నిలుచుంటారు. ఇక‌ జ‌నం బాధ‌లు విని విని, చెవులు చిల్లులు ప‌డేలాంటి  ప‌రిస్థితి. వారి క‌ష్ట‌న‌ష్టాల‌న్నీ విని వారి ఆర్త‌నాదాల‌న్నీ తీర్చినందుకుగానూ కానుక‌ల రూపంలో రోజూ కోటి రూపాయ‌ల‌కు పైగా సంపాదిస్తుంటారు.  ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక దేవుడిగా అల‌రారుతుంటారు. అలాంటి దేవుడి సొమ్ము ఎలాగైనా స‌రే కాజేయాల‌న్న ఆలోచ‌న కొద్దీ.. కొంద‌రు అవినీతి ప‌రులు ప్రతి చిన్న విష‌యానికీ.. పెద్ద పెద్ద టెండ‌ర్లు వేసి శ్రీవారి  సొమ్ము  ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు. తాజాగా శ్రీవారి సొమ్ము ఎలా కాజేశారో చూస్తే.. స్వామి వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు ఒక శేష వ‌స్త్రం క‌ప్ప‌డం ఆచారం.  అయితే స్వామివారి స్థాయికి త‌గ్గట్టు, ఈ వ‌స్త్రం ప‌ట్టుగా ఉండాల‌ని భావించి న‌గ‌రిలోని  ఒక సంస్థ‌కు ఈ కాంట్రాక్టు అప్ప‌గించ‌గా.. ఈ సంస్థ గ‌త కొంత‌కాలంగా మూడు వంద‌లు కూడా  చేయ‌ని ప‌ట్టు వ‌స్త్రానికి  ప‌ద‌మూడు వంద‌ల‌కు పైగా  వ‌సూలు చేస్తోంది. స‌రే ఇదేమైనా ప్యూర్ మ‌ల్బ‌రీ ప‌ట్టా? అని చూస్తే.. అది  కూడా కాద‌ని తేలింది. టీటీడీ విజిలెన్స్ విభాగం ల్యాబ్ లో టెస్ట్ చేయించ‌గా.. పాలిస్ట‌ర్- పాలిస్ట‌ర్ గా రిపోర్టులొచ్చాయి. ఈ ఏడాది కూడా  ఈ వ‌స్త్రం 15 వేల ఆర్డ‌ర్లు ఇచ్చింది  టీటీడీ. ఇదెలా బ‌య‌ట ప‌డిందో చూస్తే టీటీడీ  చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఇలాంటిదే ఒక ప‌ట్టు వ‌స్త్రం కొన‌గా దాని ధ‌ర 400 వంద‌ల రూపాయ‌లు కూడా లేదు.  ఈ విష‌యం గుర్తించిన నాయుడు టీటీడీ  కొంటోన్న ప‌ట్టు పై  కండువా ఎంతుందో ప‌రిశీలిస్తే 1300 కి పైగా ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ఆయ‌న ఈ ప‌ట్టుబండారం మొత్తం బ‌య‌ట‌కు కూలీ లాగ‌గా ఇక్క‌డ‌ కూడా యాభై కోట్లకు పైగా దోపిడీ జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఇలా శ్రీవారి విష‌యంలో ప్ర‌తి చిన్న విష‌యంలోనూ ఏదో ఒక అవినీతి మ‌యంగా మార‌డం చూస్తుంటే.. ఇందుకంటూ ఒక అంతు లేద‌ని  తెలుస్తోంది. భ‌క్తులు తామేసిన డ‌బ్బు ఎలాంటి  అవినీతిప‌రుల పాల‌వుతుందో అన్న ఆందోళ‌న చెందుతున్నారు. అలాగ‌ని ఇదేం ఎక్క‌డో ఉండే బోలే బాబా వంటి న‌కిలీ నెయ్యి స‌ర‌ఫ‌రా చేసే సంస్థ కాదు.. ద‌గ్గ‌ర్లోనే  ఉండే న‌గ‌రిలోని వీఆర్ఎస్ అనే సంస్థ‌. ఈ ప్రాంతంలో స్వామి వారి ప‌ట్ల ఎన్నో భ‌య‌భ‌క్తులుంటాయి. అలాంటి వీరికి కూడా వెంక‌న్న అంటే భ‌యం భ‌క్తీ లేక పోవ‌డ‌మూ ఒక చ‌ర్చ‌నీయంశంగా త‌యారైంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు బిగ్ షాక్

  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చుక్కెదురైంది. రేపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ఏసీపీ వెంకటగిరి ఎదుట ఉదయం 11 గంటల లోపు లొంగిపోవాలని పేర్కొంది. విచారణ సమయంలో ఆయనను ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 14 రోజులు ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ వేయగా, ఇంటరాగేషన్ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో  ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై మంగళవారం అత్యున్నత న్యాయస్థాన విచారణ జరిపింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గతనెల.. నవంబర్ 18వ తేదీనే వాదనలు జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది అందుబాటులో లేరు. దాంతో ఈ పిటిషన్‌పై విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరగా ఈ రోజు.. అంటే గురువారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది  

కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో  పిన్నెల్లి సోదరులు గురువారం (డిసెంబర్ 11) మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు లొంగిపోవడానికి సర్వోన్నత న్యాయస్థానం   ఇచ్చిన గడువు ముగుస్తున్న తరుణంలో మాచర్చ కోర్టుకు హాజరై సరెండర్ పిటిషన్ దాఖలు చేసి లొంగిపోయారు.  ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు జె. వెంకటేశ్వర్లు, జె. కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వారు ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును, ఆ తరువాత సుప్రీం కోర్టునూ ఆశ్రయించారు. రెండు చోట్లా వారికి చుక్కెదురైంది.   సుప్రీం కోర్టు వారి ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేస్తూ రెండు వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో వారు కోర్టులో లొంగిపోయారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  అలాగే గురజాల సబ్‌ డివిజన్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించడంతో  పాటు పోలీస్‌ యాక్ట్‌ 30ను అమలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు వైసీపీ నాయకులకు   హౌజ్‌ అరెస్టు చేశారు.

ప‌ట్టులోనూ అవినీతి ‘ప‌ట్టు’!

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి చుట్టూ మ‌రీ ఇన్ని అవినీతి బాగోతాలా?  మొన్న ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారం, నిన్న ప‌ర‌కామ‌ణి చోరీ అంశం.. తాజాగా ప‌ట్టు వ‌స్త్రాల అవినీతి బండారం. పాపం   వెంక‌న్న ఇంత పెద్ద నామాల‌తో క‌ళ్లు మూసుకుని ఉంటారు కాబ‌ట్టి  వీరిష్టానికి వీరు య‌ధేచ్చ‌గా దోపిడీ చేసేస్తున్నారు. ఆయ‌న నిజ నేత్ర ద‌ర్శ‌న  స‌మ‌యంలో ఈ అవినీతి బండారం ఎవ‌రో ఒక‌రి రూపంలో బ‌య‌ట ప‌డేస్తున్నారు. ఇంత‌కీ తాజా వ్య‌వ‌హారంలో  ఉన్నది ఎవ‌రు?  ఏమిట‌ని చూస్తే.. ప‌దేళ్ల కాలంలో అంటే, 2015- 25 మ‌ధ్య‌కాలంలో కేవ‌లం ప‌ట్టు కండువాల కుంభ‌కోణంలో 54 కోట్ల పై చిలుకు కొల్లగొట్టేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. శ్రీవారు రాత్రింబ‌వ‌ళ్లు కాళ్లు నొప్పులు పుట్టేట‌ట్టు నిలుచుంటారు. ఇక‌ జ‌నం బాధ‌లు విని విని, చెవులు చిల్లులు ప‌డేలాంటి  ప‌రిస్థితి. వారి క‌ష్ట‌న‌ష్టాల‌న్నీ విని వారి ఆర్త‌నాదాల‌న్నీ తీర్చినందుకుగానూ కానుక‌ల రూపంలో రోజూ కోటి రూపాయ‌ల‌కు పైగా హుండీలో జమ అవుతుంటాయి. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక దేవుడిగా తిరుమల వేంకటేశ్వ రస్వామి అలరారుతున్నారు.  అటువంటి వెంకన్న దేవుడి  సొమ్ము  స‌రే కాజేయాల‌న్న ఆలోచ‌న కొద్దీ.. కొంద‌రు అవినీతి ప‌రులు ప్రతి చిన్న విష‌యానికీ.. పెద్ద పెద్ద టెండ‌ర్లు వేసి శ్రీవారి  సొమ్ము  ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు. తాజాగా శ్రీవారి సొమ్ము ఎలా కాజేశారో చూస్తే.. స్వామి వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు ఒక శేష వ‌స్త్రం క‌ప్ప‌డం ఆచారం. అయితే స్వామివారి స్థాయికి త‌గ్గట్టు, ఈ వ‌స్త్రం ప‌ట్టుగా ఉండాల‌ని భావించి న‌గ‌రిలోని  ఒక సంస్థ‌కు ఈ కాంట్రాక్టు అప్ప‌గించారు. ఈ సంస్థ గ‌త కొంత‌కాలంగా మూడు వంద‌లు కూడా  చేయ‌ని ప‌ట్టు వ‌స్త్రానికి  ప‌ద‌మూడు వంద‌ల‌కు పైగా  వ‌సూలు చేస్తోంది. స‌రే ఇదేమైనా ప్యూర్ మ‌ల్బ‌రీ ప‌ట్టా? అని చూస్తే.. అది  కూడా కాద‌ని తేలింది. టీటీడీ విజిలెన్స్ విభాగం ల్యాబ్ లో టెస్ట్ చేయించ‌గా.. ఆ సంస్థ  పాలిస్టర్ పాలిస్ట‌ర్ వస్త్రాలను సరఫరా చేసినట్లు తేలింది.  ఈ ఏడాది కూడా  ఈ వ‌స్త్రం 15 వేల ఆర్డ‌ర్లు ఇచ్చింది  టీటీడీ. ఇదెలా బ‌య‌ట ప‌డిందో చూస్తే టీటీడీ  చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఇలాంటిదే ఒక ప‌ట్టు వ‌స్త్రం కొన‌గా దాని ధ‌ర 400 వంద‌ల రూపాయ‌లు కూడా లేదు.  ఈ విష‌యం గుర్తించిన ఆయన టీటీడీ  కొంటున్న ప‌ట్టు పై  కండువా ధర  ప‌రిశీలిస్తే అది 1300 రూపాయలకు పైగా ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ఆయ‌న ఈ ప‌ట్టు బండారం మొత్తం  కూపీ లాగ‌గా ఇక్క‌డ‌ కూడా యాభై కోట్లకు పైగా దోపిడీ జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఇలా శ్రీవారి విష‌యంలో ప్ర‌తి చిన్న విష‌యంలోనూ ఏదో ఒక అవినీతి మ‌యంగా మార‌డం చూస్తుంటే.. ఇందుకు  ఒక అంతు దరీ లేదా అన్న విస్మయం కలుగుతోంది.   భ‌క్తులు తాము స్వామి వారికి కానుకగా, ముడుపుగా సమర్పించిన సొమ్ము అవినీతి పరుల పాలౌతోందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అలాగ‌ని ఇదేం ఎక్క‌డో ఉండే బోలే బాబా వంటి న‌కిలీ నెయ్యి స‌ర‌ఫ‌రా చేసే సంస్థ కాదు.. ద‌గ్గ‌ర్లోనే  ఉండే న‌గ‌రిలోని వీఆర్ఎస్ అనే సంస్థ‌. ఈ ప్రాంతంలో స్వామి వారి ప‌ట్ల ఎన్నో భ‌య‌భ‌క్తులుంటాయి. అలాంటి వీరికి కూడా వెంక‌న్నదేవుడంటే  అంటే భ‌యం భ‌క్తీ, భయం లేకుండా   పోవ‌డ‌ం సంచలనంగా మారింది.  

మెస్సీతో ఫొటో దిగాలంటే..?

హైదరాబాద్ మహానగరం ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మానియాతో ఊగిపోతోంది. లియోనెల్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్ బ్యాల్ మ్యాచ్ ఆడతారు. అలాగే అదే రోజు ఫలక్ నూమా ప్యాలెస్ లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంతకీ మెస్సీ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటే?  గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా లెస్సీ భారత్ లోని నాలుగు ప్రధాన నగరాలలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ రానున్నారు. ఇంతకీ గోట్ అంటే ఏమిటి అంటారా  గోట్ అంటే గ్రేటెస్ట్ ప్లేయర్ ఆప్ ఆల్ టైమ్.  అదలా ఉంచితే గోట్ నిర్వాహకురాలు స్వాతి రెడ్డి మెస్సీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. అదేంటంటే మెస్సీ ఫలక్ నూమా ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో అభిమానులు ఆయనతో ఫొటో దిగేందుకు అవకాశమిస్తారు. మెస్సీ అభిమానులకు ఇది నిజంగా ఎగిరి గంతేసే వార్తే. అయితే మెస్సీతో ఫొటో దిగాలంటే దాదాపు పది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అలా చెల్లించగలిగిన వంద మందికి మెస్సీతో ఫొటో దిగే చాన్స్ లభిస్తుంది.

మెగా ఆక్షన్‌తో మారనున్న ఐపీఎల్ రూపురేఖలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2026 మెగా ఆక్షన్ వచ్చే వారమే మొదలు కానుంది.  ఈసారి ఏ ప్లేయర్, ఏ టీమ్‌లోకి వెళతాడు, ఎలాంటి మార్పులు కనిపించబోతున్నాయ్? ఫ్రాంచైజీలు ఎవరెవరిని అట్టిపెట్టుకుంటాయ్? అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే.. అంతకంటే ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. ఈసారి కొత్త జట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయ్. పాపులర్ ఫ్రాంచైజీలు.. చేతులు మారనున్నాయ్. అసలు.. ఐపీఎల్ స్వరూపమే మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. జరుగుతున్న పరిణామాలు, కనిపిస్తున్న పరిస్థితులు అలా ఉన్నాయ్. ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందే.. ఈ నెలలో మెగా ఆక్షన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. 350 మంది ప్లేయర్లు.. వేలంలోకి రానున్నారు. ఇప్పటికే.. ఆక్షన్ కోసం నమోదు చేసుకున్న ప్లేయర్ల జాబితా నుంచి బీసీసీఐ.. ఎవరూ ఊహించని విధంగా 1005 మంది పేర్లను తొలగించింది. అదేవిధంగా.. 35 మంది కొత్త ప్లేయర్ల పేర్లను వేలంలోకి చేర్చింది. 350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్‌.. డిసెంబర్‌ 16న.. అబుదాబీలో జరుగుతుంది. ఈ మేరకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు  బీసీసీఐ మెయిల్స్ కూడా పంపింది.  బిడ్డింగ్ ప్రాసెస్.. బ్యాటర్లు, ఆల్‌ రౌండర్లు, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా.. క్యాప్డ్ ప్లేయర్లతో మొదలవుతుంది. తర్వాత.. అన్‌క్యాప్ట్ ఆటగాళ్ల వేలం మొదలవుతుంది. ఈ 350 మంది ప్లేయర్లలో.. ఎవరు ఏ టీమ్‌లోకి వెళ్తారు.. ఏ జట్టు నుంచి.. ఏ ఫ్రాంచైజీకి షిప్ట్ అవుతారనే దానిపై  ఉత్కంఠ నెలకొంది. ఇక.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కొన్ని ఫ్రాంచైజీలు కొత్తగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే.. ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అమ్మకానికి పెట్టిన న్యూస్ క్రికెట్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కూడా చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టీమ్స్‌ని దక్కించుకునేందుకు.. నలుగురైదుగురు బయ్యర్లు రేసులో ఉన్నారు. వారిలో.. ఈ ఫ్రాంచైజీలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిగా మారింది. పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికా సహా.. కొత్త ఓనర్లు ఎక్కడి నుంచి వస్తారన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం.. రాజస్థాన్ రాయల్స్ టీమ్.. రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ చేతుల్లో ఉంది. ఈ కంపెనీకి.. ఫ్రాంచైజీలో 65 శాతం వాటా ఉంది. దాంతో.. రాజస్థాన్ రాయల్స్ మెజారిటీ వాటా అమ్మాలని చూస్తోంది. తమ టీమ్ విలువ.. బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్.. తమ టీమ్‌లో వాటా అమ్మడానికి ప్రధాన కారణం.. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ విపరీతంగా పెరగడమే. ఈ అధిక విలువని నగదు రూపంలోకి మార్చుకోవాలని.. ఇప్పుడున్న ఓనర్లు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బదాలే నేతృత్వంలోని ఓనర్లంతా.. తమ మెజారిటీ వాటాని  లేదా, పూర్తిగా ఫ్రాంచైజీని అమ్మడానికి  చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. గేమింగ్ దిగ్గజం క్రాఫ్టన్ ఇండియా, అదానీ గ్రూప్ లాంటి పెద్ద కంపెనీలతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ఇటీవలే.. ఆర్సీబీ ఓనర్ అయిన డియాజియో కంపెనీ కూడా.. ఫ్రాంచైజీ సేల్ ప్రాసెస్‌ని మొదలుపెట్టింది. ఈ మేరకు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆ సంస్థ తెలిపింది. అయితే.. లేటెస్ట్ డేటా ప్రకారం.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఈ ఏడాది 20 శాతం తగ్గింది. గత ఏడాది 12 బిలియన్ డాలర్లుగా ఉన్న ఐపీఎల్ వాల్యూ.. ఇప్పుడు 9.6 బిలియన్లకు చేరింది. దేశంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మెగా వేలం చుట్టూ ఉన్న అనిశ్చితుల కారణంగానే.. ఐపీఎల్ విలువ తగ్గిందన్న చర్చ జరుగుతోంది. భారత్-పాక్ వివాదం, భద్రతా సమస్యల కారణంగా.. ఈ ఏడాది వారం పాటు ఐపీఎల్‌ని నిలిపేయాల్సి వచ్చింది.  కోవిడ్ మహమ్మారి బారిన పడిన 2020 సీజన్ కాకుండా.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ భారీగా పడిపోయిన ఏకైక సంవత్సరం ఇదే. ఇప్పటికే.. లీగా వాల్యుయేషన్‌లో.. రెండేళ్లు క్షీణించింది. ఓ రిపోర్ట్ ప్రకారం.. 2023లో.. ఐపీఎల్ వాల్యూ 92 వేల 500 కోట్లుగా ఉంది. అదే.. 2024కి వచ్చేసరికి.. 82 వేల 700 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది.. ఐపీఎల్ వాల్యూ మరింత పడిపోయింది. ఇప్పుడు.. ఐపీఎల్ విలువ కేవలం 76 వేల 100 కోట్లుగా ఉంది. రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై ప్రభుత్వం విధించిన నిషేధం వల్లే.. ఐపీఎల్ గ్రోత్ తగ్గడానికి కారణమంటున్నారు.  ఒక్క.. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ మాత్రమే పెరిగింది. ముంబై ఇండియన్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా.. 108 మిలియన్ డాలర్లతో తమ స్థానాన్ని నిలుపుకుంది. అయినప్పటికీ.. ఎంఐ టీమ్ బ్రాండ్ వాల్యూ కూడా 9 శాతం తగ్గింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సీజన్‌లో తమ తొలి టైటిల్ సాధించినప్పటికీ.. 10 శాతం వాల్యూ తగ్గిపోయింది. ప్రస్తుతం.. 105 మిలియన్ డాలర్ల వాల్యూతో.. రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ కూడా 24 శాతం తగ్గి.. 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 33% తగ్గి 73 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది.. ఎంతో కొంత వృద్ధిని నమోదు చేసిన ఏకైక ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ మాత్రమే. ఆ టీమ్ బ్రాండ్ విలువ 2% పెరిగి 70 మిలియన్ డాలర్లకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ 3 శాతం, లక్నో టీమ్ 2 శాతం, ఢిల్లీ క్యాపిటల్స్ 26 శాతం, సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 శాతం,  రాజస్థాన్ రాయల్స్ వాల్యుయేషన్  35శాతం పడిపోయాయి.

వైఎస్ వివేకా హత్య కేసు.. తదుపరి దర్యాప్తునకు ఆదేశాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు ఆదేశాలిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ  చేసింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, 2014 ఎన్నికలకు ముందు ఆయన స్వగృహంలోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్య కేసు విచారణ అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది. వైఎస్ వివేకా కుమార్తె అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. తదుపరి దర్యాప్తునకు బుధవారం (డిసెంబర్ 10) ఆదేశాలిచ్చింది.   ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందనీ, లేకుంటే  అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. అయితే, దర్యాప్తు ఇప్పటికే ముగిసిందని, మళ్లీ విచారణకు అవకాశం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై దృష్టి సారించాలనీ, అందుకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది.