
తొలి టెస్టులో భారత్ ఆలౌట్..ఇంగ్లండ్ ఎదుట భారీ స్కోర్
Publish Date:Jun 21, 2025
ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది. జైస్వాల్ (101), కేఎల్ రాహుల్ (42), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) పరుగులు చేయగా..ఏడేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ నిరాశపర్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (11), శార్దూల్ ఠాకూర్ (1) నిరాశపర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పంత్.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.
రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి : సీపీఐ నారాయణ
Publish Date:Jun 21, 2025
ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం
Publish Date:Jun 21, 2025
పాడి ఉత్పత్తిలో రాజీవ్ ముర్రా బ్రీడ్ డెయిరి
Publish Date:Jun 21, 2025
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక ఆదేశాలు
Publish Date:Jun 21, 2025

గాంధీలు జైలుకు వెడతారా?
Publish Date:Apr 19, 2025
అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో గాంధీలు జైలుకు వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది. మరో వంక ఈ కేసును తెర పైకి తెచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదని పూటకో టీవీ చానల్ లో ప్రవచనం చెప్పినట్లు చెపుతున్నారు. సో..సహజంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అరెస్ట్ చేస్తుందా? అనే ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు, సామాన్యులలోనూ వినిపిస్తోందని అంటున్నారు.
అయితే కావచ్చును కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు మోదీ నాయకత్వానికి సవాలుగా దూసుకొస్తున్న రాహుల్ గాంధీ దూకుడును అడ్డుకునేందుకే మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నది నిజం కావచ్చును. కానీ కేసు చరిత్రను చూస్తే అసలు ఏమీ లేకుండానే పదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులో ఈడీ ఏ ఆధారాలు లేకుండానే ఛార్జిషీట్ దాఖలు చేస్తుందా? అందులోనూ సోనియా, రాహుల్ గాంధీ పై ఛార్జిషీట్ దాఖలు చేసే సాహసం చేస్తుందా? అనే సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తం అవుతున్నాయి.
అదలా ఉంటే.. పరిపాలనా దక్షత, అభివృద్ధి లెక్కల విషయంలో ఎలా ఉన్నా.. రాజకీయ లెక్కలు వేయడంలో తప్పుచేయని మోదీ షా జోడీ కాంగ్రెస్ అగ్ర నేతలు ఇద్దరినీ ఒకే సారి టార్గెట్ చేస్తారా? ఆ తప్పు మోదీ షా జోడీ చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలకు సంబందించిన కేసుల్లో చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఈ ‘స్థాయి’ కేసుల్లో చాలా పకడ్బందీగా, ఎక్కడా ఏ దర్యాప్తు సంస్థకూ దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం పని కానిచ్చేస్తారని అంటారు. కానీ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చిక్కు ముళ్ళు పెద్దగా లేవు. అంతా ఓపెన్ సీక్రెట్ , ఖుల్లం ఖుల్లా ..అందరికీ అర్థమయ్యేలా ఉందని అంటున్నారు.
క్లుప్తంగా కేసు వివరాలోకి వెళితే,మూడు నాలుగు తరాల రాజకీయాలతో ముడిపడిన ఈకేసులో గొప్పగా చిక్కు ముళ్ళు ఏమీలేవు. నెహ్రూ గాంధీల తొలి తరం నేత, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1935 లో మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో అక్షర ఆయుధంగా పనిచేస్తుందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)సంస్థను స్థాపించి, ‘నేషనల్ హెరాల్డ్’ అంగ్ల పత్రికను ప్రారంభించారు.
ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత జవహరలాల్ నెహ్రూ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం ఢిల్లీ, లక్నో సహా మరికొన్ని మహానగరాలలో విలువైన స్థలాలను చౌకగా ఇచ్చారు. ఇవి కాక ఏజేఎల్ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంతే కాకుండా నెహ్రూజీ మానస పుత్రికగా ముద్ర వేసుకున్న పత్రికకు కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాళాల రూపంలో, ప్రకటనల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాయి. (పత్రిక మూత పడిన తర్వాత కూడా హిమాచల ప్రదేశ్ ప్రభుత్వం, ఈ మధ్యనే రూ. 2.50 కోట్ల ప్రకటనలు ఇచ్చినట్లు ఈడీ చార్జి సీట్లో ఉందిట.) అయినా, కంపెనీ 2008 నాటికి, రూ.90 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకు పోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడింది. ఈ అప్పులు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది.
నేషనల్ హెరాల్డ్ స్టొరీలో ఇదే టర్నింగ్ పాయింట్. ఎందుకంటే.. ఒక రాజకీయ పార్టీ అప్పులు, ఇచ్చి పుచ్చుకోవదాలను చట్టం అనుమతించదు. అదొకటి అయితే.. పత్రిక మూత పడినా, దేశంలో అనేక నగరాల్లో ఉన్న ఏజేఎల్’ ఆస్తుల విలువ పడిపోలేదు.పెరింగింది.ఇప్పడు ఆస్తుల విలువ రూ. 2000 వేల కోట్ల పైమాటే అంటున్నారు.ఇంకొదరైతే రూ.5000కోట్లు అంటున్నారు.
వాస్తవానికి ఈ ఆస్తులు 2010 వరకు నెహ్రూ కుటుంబ ఆస్తులు కాదు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆస్తులు. కానీ 2010లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీచెరో 38 శాతం వాటాతో, (మిగతా 22 శాతంకు ఆ స్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా వాటాదారులు) యంగ్ ఇండియా కంపెనీ తెర మీదకు వచ్చింది. అక్కడితో, సీన్ మారిపోయింది. కొత్త కంపెనీ మూలధనం కేవలం రూ.5 లక్షలు మాత్రమే అయినా.. రూ.2000 వేల కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులతో పాటుగా, కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు చెపుతున్న రూ.90 కోట్ల అప్పు ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో, యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయింది. అక్కడితోనూ కథ ముగియ లేదు. ఏజేఎల్ ఆస్తులు యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయిన వెంటనే కాంగ్రెస్ ఇచ్చిన రూ.90 కోట్ల అప్పు ను కాంగ్రెస్ పార్టీ ఉదారంగా.. యంగ్ ఇండియా నుంచి జస్ట్ ఓ రూ.50 లక్షలు తీసుకుని మాఫీ చేసేసింది. మళ్ళీ యంగ్ ఇండియా కు ఆ రూ. 50 లక్షలు ఎక్కడివంటే.. అది మళ్ళీ మరో భేతాళ కథ. సో .. మొత్తంగా చూస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయం ఏమంటే.. సోనియా,రాహుల్ గాంధీలలు ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్న యంగ్ ఇండియా జస్ట్ ఓ రూ.5 లక్షల పెట్టుబడితో రూ.2000 కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులకు హక్కు దారు అయింది. సో.. ఇప్పుడు ఇలా నాలుగు గోడల మధ్యా జరిగినట్లు చెపుతున్న ఒప్పందాలలకు సంభందించి సాగుతున్న విచారణలో భాగంగానే ఈడీ, సోనియా, రాహుల్ గాంధీలను ఎ 1, ఎ 2 గా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసింది.
నిజానికి, 2012- 2013లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు వెలుగు చూసింది. సీబీఐ విచారణ చేపట్టింది. ఆ సమయంలోనే సోనియా, రాహుల్ గాంధీలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివకు వరకూ కూడా గాంధీలు ఇద్దరూ బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఈడీ కూడా గతంలో ఆ ఇద్దరినీ విచారించింది. ఇప్పడు చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ చార్జి షీట్ దాఖలు చేసినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేస్తుందని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెంటనే అరెస్ట్ కాలేదు. అసలు అరెస్ట్ అవసరమా.. కాదా అనేది ఈడీ కాదు.. కోర్టులు నిర్ణయిస్తాయి. సో.. ఇప్పటికి ప్పుడైతే గాంధీలు అరెస్ట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే అంటున్నారు. బట్.. చట్టం తన పనితాను చేసుకు పోతుంది .. చట్టానికి సహకరించడం పౌరుల ధర్మం. గాంధీలు అందుకు అతీతులు కాదు. వారికి మినహాయింపూ ఉండదు.
జగన్ కోటరీ నుంచి సజ్జల ఔట్?
Publish Date:Apr 9, 2025
ఫిర్ ఏక్ బార్., కేసీఆర్ సర్ కార్?
Publish Date:Apr 8, 2025
రాజకీయాల్లో కవిత మళ్లీ యాక్టివ్.. హరీశ్కు చెక్ పెట్టేందుకేనా?
Publish Date:Nov 24, 2024
జగన్ బెయిలు రద్దు.. సీబీఐ స్టాండ్ మారిందా?
Publish Date:Nov 12, 2024
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
రేసులో పడిపోయిన ప్రతిసారీ నిలబడటమే కాదు.. పరుగెత్తి గెలవడమంటే ఆషామాషీ కాదు.. అది ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారు కాబట్టే చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు. చంద్రబాబు ఏజ్ బార్ అయింది.. టీడీపీ పనైపోయంది.. రాష్ట్రంలో ఇక వైసీపీకి ఎదురే లేదని జగన్ టీం తెగ హడావుడి చేసింది. అయితే సెవెన్టీ ప్లస్ ఏజ్లో కూడా పొలిటికల్గా తాను యంగ్ టర్క్నని నిరుపించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి చరిత్ర సృష్టించారు. దాంతో పాటు ఎన్డీఏ కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి, కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు. 76వ పడిలోకి అడుగుపెట్టిన ఆయన పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అనడం కంటే. తెలుగుదేశం, జనసేనల బలమే వైసీపీని మట్టికరిపించిందనడం కరెక్ట్.ఎందుకంటే ఆ పార్టీల అండ లేకుంటే బీజేపీకి ఏపీలో ఉన్న ఉనికి నామమాత్రమే. విజనరీ లీడర్, అపరచాణక్యుడిగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీబీఎన్ మండుటెండల్లో ప్రచారం చేసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇతర పార్టీల నేతలు భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక షార్ట్ బ్రేక్లు తీసుకున్నారు. కాని ఆ సూర్యుడు ఈ చంద్రుడి స్పీడ్కి బ్రేక్లు కాదు కదా కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేకపోయాడు. సెవెన్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్లో తొంభై సెగ్మెంట్లలో సీబీఎన్ ప్రచారం చేశారంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థం అవుతుంది. ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం. బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్.. సౌత్ అసియన్ ఆఫ్ ద ఇయర్.. వరల్డ్ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్ మెంబర్.. ఇదీ విజనరీ లీడర్ చంద్రబాబుకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు.
ఆ విజనే రాజధాని లేకుండా విడిపోయిన ఏపీలో జరిగిన మొదటి ఎన్నికల్లో జనం చంద్రబాబుకు పట్టం కట్టేలా చేసింది. అంతర్జాతీయంగా నారావారిని ఎందరు ఎన్నిరకాలుగా ఆకాశానికెత్తేసినా, తెలుగోళ్లకు మాత్రం అభివృద్ది కాముకుడు, అపరచాణక్యుడే. చంద్రబాబు పేరు చెప్తే హైదరాబాద్ హైటెక్ సిటీకి పునాది వేసిన సైబర్ టవర్సే గుర్తొస్తాయి. అలా ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో తనదైన బ్రాండ్ వేసుకున్న సీబీఎన్. విభజిత ఆంధ్రప్రదేశ్ కు కూడా హైదరాబాద్ స్థాయి రాజధానిని ఏర్పాటు చేస్తారనీ, అభివృద్దిని పరుగులు పెట్టిస్తారనే 2014 ఎన్నికల్లో ప్రజలు ఆయనను నెత్తినపెట్టుకున్నారు.
అమరావతి రాజధానికి అంకురార్పణ చేసి .. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న టైంలో చంద్రబాబు స్పీడ్కి బ్రేకులు పడ్డాయి. ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధ్యక్షుడు చేసుకున్న అభ్యర్ధన రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనామకంగా, అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్, 14 ఏళ్లు సీఎంగా ఉన్న సీబీఎన్ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించి అభాసుపాలయ్యారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక వైపు అమరావతి డెవలప్మెంట్, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టిస్తూనే, పెట్టబడులు, పరిశ్రమల స్థాపనపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.
ఇప్పుడు ఏపీ, తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్లను చూస్తే తెలుగోళ్లకు చంద్రబాబునాయుడే కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన సీబీఎన్ ను రాష్ట్ర విభజన తర్వాత మరోసారి సీఎంని చేసింది ఆ హైటెక్ విజనే. ఆయన అమరావతి రాజధాని అనగానే జగన్ సహా అందరూ ఆమోదించారు. అయితే.. 2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి. రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు మిగిలారు
.బటన్ నొక్కుడు పాలిటిక్స్ మొదలు పెట్టిన జగన్.. సంక్షేమం డబ్బులు డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తూ కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో కూడా ఆ నవరత్నాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో కనిపించారు. పైగా.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తన హయాంలోని పథకాలు అన్నీ ఆగిపోతాయని ప్రచారంలో చెప్పారు. 2014లో ఎన్డీఏ కూటమితో గెలిచిన చంద్రబాబు. గత ఎన్నికల్లో ఆ కూటమికి దూరమై దెబ్బ తిన్నారు. అయితే... రాష్ట్రం సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మళ్లీ 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేనలతో కలిశారు.
అయితే పేరుకి ఎన్డీఏ కూటమి అయినా దానికి పెద్ద దిక్కు చంద్రబాబే అయ్యారు. ప్రచార బాధ్యతను కూడా భుజ స్కంధాలపై వేసుకుని ముందుకు సాగారు. ఓవైపు ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూనే... తాము అధికా రంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు చంద్రబాబు.. ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించారు. నవరత్నాలని వైసీపీ అంటే. సూపర్ సిక్స్, భవిష్యత్తుకు గ్యారెంటీ హామీలతో చంద్రబాబు దూసుకుపోయారు. జగన్ సర్కారు మద్యం పాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచ్లు విసిరారు. టీడీపీ అధినేత నవరత్నాల పేరుతో జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి.. నెక్లెస్లు తీసుకుంటున్నారంటూ ప్రజల్ని ఆలోచింపచే శారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నడిపించారు
. పని రాక్షసుడిగా టాగ్లైన్ తగిలించుకున్న హైటెక్ లీడర్ బర్త్ డేట్ 1950 ఏప్రిల్ 20. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. మండు టెండల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన 90 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసారంటే.. మామూలు విషయం కాదని రాజకీయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దటీజ్ చంద్రబాబు అంటూ కితాబులిచ్చారు.
. ఆయనకంటే వయస్సులో చిన్నవారైన పవన్కళ్యాణ్, జగన్.. ఎండ ధాటికి తట్టుకోలేక షార్ట్ బ్రేక్లు తీసుకున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం నిత్య యవ్వనుడిలా అలుపెరుగని పోరాటం చేశారు. ఒక్కసారి కూడా బ్రేక్ తీసుకోకుండా, అటు పార్టీ నేతలతో పాటు ప్రజలూ ఆశ్చర్య పడేలా చేశారు. అంతే కాదు.. రోజుకి మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొంటూ జనాలతో మమేకం అయ్యారు. ప్రతి అంశాన్నీ జనాలకు చెప్పటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో అంశాలతో పాటు జగన్ ప్రభుత్వ పనితీరుపై తనదైనలో శైలిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు, సీట్ల సర్ధుబాటు సహా అన్ని అంశాలనూ జనంలోకి తీసుకెళ్లగలిగారు. ఓవరాల్గా ఈ అభివృద్ది కాముకుడు చేసిన పోరాటం ఫలించింది. ఆయన ఊహించిన దానికంటే బెస్ట్ రిజల్ట్ లభించింది.151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగారు. అటు కేంద్రంలోనూ సోలో మెజార్టీకి దూరమైన బీజేపీకి దిక్కు అయ్యారు. ఎన్డీఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా అవతరించడంతో కేంద్రానికి అణిగిమణిగి ఉండాల్సిన ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది టీడీపీకి. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఏపీ వాసులంతా కలలుగంటున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. అందుకే అందరి నోటా ఎన్నికల ప్రచారం తర్వాత ఒకటే మాట వినిపించింది. అదే .. సీబీఎన్ ద గ్రేట్.
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
నోస్ట్రాడమస్ జోస్యం నిజం కానుందా?
Publish Date:Nov 26, 2024
సొంత పార్టీ శ్రేణులకే వెగటు పుట్టిస్తున్న జగన్ రెడ్డి అతితెలివి!
Publish Date:Nov 13, 2024
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు పీక్స్ కు?
Publish Date:Oct 19, 2024
భారతీయుల ఆరోగ్య యోగానికి ఆది గురువు.. పతంజలి మహర్షి!
Publish Date:Jun 21, 2025
ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈసారి యోగా డే దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అందులోనూ అన్ని రాష్ట్రాల చూపులు విశాఖపట్నం ఆర్.కె బీచ్ వైపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజు యోగా అనేది విదేశీయులను కూడా ఆకర్షించే అంశం అయిపోయింది. ఇది మనిషి ఆరోగ్యానికి జీవనాడి అయ్యింది. అయితే ఈ యోగాను భారతీయులకు అందించినది పతంజలి మహర్షి. అందుకే యోగా డే సందర్బంగా ఆ మహనీయుడిని గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యం. అలాగే.. యోగా కోసం పతంజలి మహర్షి చేసిన కృషి, ఆయన చరిత్ర తెలుసుకుంటే..
పతంజలి మహర్షి చరిత్ర వృత్తాంతం భారత సంస్కృతిలో ఒక గంభీరమైన, ఆధ్యాత్మికంగా ప్రేరణాత్మకమైన గాథ. ఇది పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ఒక భగవద్భక్తుడు, తత్త్వవేత్త, గొప్ప పండితుడు. ఆయన్ను మూడు ముఖ్యశాస్త్రాలలో విపులమైన కృషి చేసినవాడిగా గుర్తిస్తారు . ఆ మూడు ఏమిటంటే.. యోగశాస్త్రం, వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం), ఆయుర్వేదం.
ఆయన చరిత్ర వృత్తాంతం..
ఆదిశేషునిగా అవతారం..
పతంజలి మహర్షి, విష్ణుమూర్తికి సేవ చేసే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడతారు. ఒక సందర్భంలో, విష్ణుడు తన హృదయంలో శివుని ఆనందతాండవాన్ని దర్శించుకుంటుండగా, ఆదిశేషునికీ ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలిగిందట. అందుకు అనుగుణంగా విష్ణుమూర్తి ఆదిశేషునికి భూలోకంలో అవతరించాల్సిందిగా సూచించాడు.
గోనికా తపస్సు & పతంజలి అవతారం..
విష్ణుమూర్తి ఆదిశేవును భూలోకంలో అవతరించమని ఆదేశించి సమయంలో గోనికా అనే పతివ్రత స్త్రీ, సూర్య భగవానుని ప్రార్థిస్తూ లోకానికి ఉపయోగపడే బిడ్డ కావాలని తపస్సు చేస్తూ, చేతులలో నిండుగా నీటిని తీసుకుని అంజలి ఘటిస్తూ అంటే నమస్కారం చేస్తూ అర్చించుకుంటున్న సమయంలో పాము రూపంలో ఆదిశేషుడు ఆమె చేతుల్లోకి పడిపోయాడట. అందువల్ల ఆ బాలుని పేరు పతంజలి (పతనము + అంజలి) అని ఉద్భవించింది.
నటరాజుని తాండవ దర్శనం..
పతంజలి మహర్షి తన తల్లిదండ్రుల వద్ద పెరిగి, తర్వాత చిదంబరం వచ్చినాడు. అక్కడ శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్నాడని తెలిసి. అతనికి శివుని తాండవాన్ని చూసే అవకాశం లభించింది. నంది, భృంగిలు అతని శరీరాకృతిపై హేళన చేసినా, అతను నోరుతో “నటరాజ నవకం” అనే స్తోత్రాన్ని గానం చేసి శివుని ఆనందింపజేశాడు. ఈ నటరాజ నవకం అనేది పూర్తీగా డమరుక శబ్దంతో ఉంటుంది. నటరాజ నవకం విని సంతోషించిన శివుడు నిన్నునాట్యంలో భాగం చేస్తాను బాధపడకు అని చెప్పి శివుడు అతనిని తన పాదాల చుట్టూ చుట్టి తాండవంలో భాగస్వామిని చేశాడు. ఇది పతంజలి మహర్షి భగవత్ ప్రేమకు సంకేతం.
త్రికరణ శుద్ధి లక్ష్యంగా విద్యాబోధన..
శివుని ఆశీర్వాదంతో పతంజలి, భూలోకానికి త్రికరణ శుద్ధి అంటే మనస్సు, వాక్కు, కర్మ అనేవి సాధించేందుకు మూడు శాస్త్రాలను అందించాడు.
యోగశాస్త్రం – మనస్సు శుద్ధి కోసం
వ్యాకరణం – వాక్కు శుద్ధి కోసం
ఆయుర్వేదం – శరీర శుద్ధి కోసం
శిష్యులకు బోధన..
పతంజలి 1000 మందికి బోధన ఇవ్వాలనుకున్నాడు. అందరి అర్హతలు భిన్నంగా ఉండటంతో, ఓ తెర వెనుక ఆదిశేషురూపంలో బోధించాడు. తెర ఎత్తవద్దని చెప్పినా ఒక శిష్యుడు అతని నియమాన్ని ఉల్లంఘించి తెర తీసేశాడు. దీంతో 999 మంది విద్యార్థులు కాలిపోయారు. మిగిలిన శిష్యుడికి పతంజలి మొత్తం విద్యను బోధించాడు, కాని అతను శాపగ్రస్తుడై బ్రహ్మ రాక్షసుడయ్యాడు.
శిష్యుడిని శాప విముక్తుడిని చేసిన ఘట్టం..
ఆ బ్రహ్మ రాక్షసుడు జ్ఞానాన్ని బోధించగల అర్హుడిని వెతుకుతూ, సరైన జవాబు చెప్పని వారిని మింగేవాడు. చివరికి పతంజలి మహర్షి స్వయంగా శిష్యుడి రూపంలో (చంద్రశర్మగా) వచ్చి, సరైన సమాధానం ఇచ్చి, జ్ఞానం తీసుకొని శిష్యుడిని శాపం నుండి విముక్తుణ్ని చేశాడు. ఆ రాక్షసుడు తరువాత గౌడపాదాచార్యుడుగా అవతరించాడు.
ఆయన రచనలు..
యోగ సూత్రాలు (196 సూత్రాలు) – యోగ దార్శనికశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం.
మహాభాష్యం – పాణినీ వ్యాకరణంపై వ్యాఖ్యాన గ్రంథం.
ఆయుర్వేదానికి సంబంధించిన రచనలకూ ఆయనకు ఆపాదించబడింది, కానీ ఆధారాల పరంగా స్పష్టత లేదు.
జీవసమాధి స్థలం..
పతంజలి మహర్షి జీవసమాధి స్థలం తమిళనాడు, తిరుపత్తూరు (త్రిచీ దగ్గర)లోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉంది.
ప్రార్థన శ్లోకం..
యోగేన చిత్తస్య పదేన వాచాం
మలం శరీరస్య చ వైద్యకేన।
యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం
పతంజలిం ప్రాంజలిరానతోఽస్మి॥
మనస్సు, వాక్కు, శరీరం శుద్ధి కోసం పతంజలిని ప్రణమిస్తాను అని ఈ ప్రార్థన అర్థం.
*రూపశ్రీ
ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?
Publish Date:Jun 21, 2025
యోగా గురించి ఆయుర్వేదం ఏం చెప్పింది? దీనికున్న ప్రాధాన్యత ఏమిటి?
Publish Date:Jun 20, 2025
ఈ రెండు తప్పులు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు..!!
Publish Date:Jun 20, 2025
ఈ రెండూ మీ జీవితాన్ని మార్చేస్తాయ్!
Publish Date:Jun 19, 2025
యోగాలో శక్తివంతమైన ఆసనాలు ఏవంటే..!
Publish Date:Jun 21, 2025
యోగ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. యోగాలో శక్తివంతమైన (Powerful) ఆసనాలు శరీరానికి శక్తిని, స్థిరతను, సౌష్టవాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఆసనాలు. ఇవి శారీరకంగా గట్టిగా ఉండటంతో పాటు మానసిక శాంతిని కూడా అందిస్తాయి. ఇవి శక్తి, సహనం, స్తైర్యం, ఫోకస్, ప్రాణశక్తి పెంచే విధంగా పనిచేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాసనాలు ఏవో తెలుసుకుంటే..
శక్తివంతమైన యోగాసనాలు..
వీరభద్రాసనాలు..
వీరభద్రాసనాలలో మూడు రకాలు ఉన్నాయి. ఇవి వేస్తుంటే శరీరానికి ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. కాళ్ళు, చేతులు, వెన్నెముక బలపడతాయి. మనస్సు కేంద్రీకృతం అవుతుంది.
నౌకాసన (Boat Pose)..
నౌకాసనం వస్తుంటే శరీరంలో మధ్య భాగం (core) శక్తివంతంగా తయారవుతుంది. అబ్డోమినల్ మసిల్స్, స్పైన్ బలపడతాయి. మానసిక దృఢత పెరుగుతుంది.
బకాసన (Crow Pose)..
బలమైన చేతులు, మోకాలుకు సపోర్ట్ కావాలంటే బకాసన వేయడం చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల ఫోకస్, సమతుల్యత అభివృద్ధి చేస్తుంది. ధైర్యాన్ని పెంచుతుంది.
ఉర్ధ్వ ధనురాసనం (Upward Bow or Wheel Pose)..
ఊర్థ్వ ధనురాసనం వేస్తే వెన్నెముక, గుండె, ఛాతీ తెరుచుకుంటాయి. ఇది శక్తిని పంచుతుంది, ఉత్సాహం పెంచుతుంది.
పరివ్రుత్త పర్వతాసన (Revolved Triangle Pose )
పరివృత్త పర్వతాసన వేయడం ద్వారా శరీరానికి లవణత (flexibility), బలం ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయం చేస్తుంది.
అధో ముఖ శ్వానాసన (Downward Facing Dog)..
అధోముఖ శ్వానాస వేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది. ఇది శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
చతురంగ దండాసన (Low Plank)..
చేతులు, భుజాలు, మధ్య భాగం బలంగా తయారవుతాయి. శక్తిని కేంద్రీకరించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.
ప్రాణాయామం తో కలిపితే..
శక్తివంతమైన ఆసనాలకు ప్రాణాయామం (విశేషంగా కపాలభాతి, బస్ట్రికా) తోడైతే శక్తి స్థాయి మరింత పెరుగుతుంది.
సూచనలు:
ఆసనాలు సాధన చేయడానికి ముందుగా మైల్డ్ వార్మప్ చేయాలి.
శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యం.
మొదట్లో శిక్షణ పొందిన గురువు సూచనతో చేయడం ఉత్తమం.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు ఏం తినాలి? ఏం తినకూడదు?
Publish Date:Jun 21, 2025
గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఎలాంటి గ్రీన్ టీ ని ఎంచుకోవాలి?
Publish Date:Jun 21, 2025
ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఆయుర్వేదంలో దీని గురించి ఏం చెప్పారంటే..!
Publish Date:Jun 20, 2025
ప్రతి రోజు ఒక కప్పు దానిమ్మ రసం తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..
Publish Date:Jun 19, 2025
