తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

Publish Date:Jan 10, 2026

  జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బ‌రిలో దిగాలని ఆ పార్టీ డిసైడ్ అయింది. ఎన్నిక‌ల‌కు నెల రోజుల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్నప్ప‌టికీ సాధ్య‌మైన‌న్ని స్థానాల్లో పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేయున్నట్లు తెలిపారు. ప్ర‌తి జ‌న‌సైనికుడు, వీర మ‌హిళ ఉత్సాహంగా ప్ర‌చారానికి సిద్ధం కావాల‌ని ప్ర‌క‌టించింది.  పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం, అధ్యక్షుడు  ప‌వ‌న్ క‌ల్యాణ్ భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల్లోకి చేర‌వేయ‌డం ద్వారా తెలంగాణలో స‌రికొత్త రాజ‌కీయ వేధిక‌కు పునాధి వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని సూచించింది. త్వ‌ర‌లోనే పార్టీ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.   ఈ ఎన్నికల ప్రచారంలో జనసైనికులు చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని జనసేన పార్టీ పిలుపు నిచ్చింది.  

అమ‌రావ‌తి విష‌యంలో...జ‌గ‌నాసురుడి అస‌లు స్కెచ్ అదేనా?

Publish Date:Jan 11, 2026

  అమ‌రావ‌తి అంటే అర్ధ‌మేంటి? అని చూస్తే అమ‌రులుండే  ప్ర‌దేశం. దీనికి  మ‌ర‌ణం లేదు అని అర్ధం. ఇంకా చెబితే ఇంద్రుడి రాజ్యాన్ని కూడా  అమ‌రావ‌తీ అనే  అంటారు. ఇక బుద్ధుడు కాల‌చ‌క్ర బోధ‌న‌లు చేసిన ప్రాంతం కూడా ఇదే. ఇంత‌టి ఆధ్యాత్మిక‌, చారిత్ర‌క ప్ర‌దేశం కాబ‌ట్టే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి ఈ  పేరు పెట్టారు. ఇంద్రుడి  రాజ‌ధాని అమ‌రావ‌తిపై కూడా ఎన్నోసార్లు రాక్ష‌సులు దాడులు చేశారు. అప్పుడా దేవ‌త‌లు శ్రీమ‌హావిష్ణువును వేడుకోగా ఆయ‌న ద‌శావ‌తారాల ద్వారా ఈ రాజ‌ధానిని కాపాడిన ఉదంతాలు ఆధ్యాత్మికంగా  కోకొల్ల‌లు.ఆనాడు రాక్ష‌సులు ఎలా అమ‌రావ‌తిని అంతం చేయాల‌ని భావించారో.. ఇప్పుడు కూడా జ‌గ‌నాసురుడి వంటి రాక్ష‌సుల‌ తాకిడి ఎదుర్కుంటూనే ఉందీ రాజ‌ధాని.  తాజాగా  కూడా  రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని  నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి. ఆయ‌న ఇంగ్లీష్ లో చెప్పినా  దాని అర్ధం అమ‌రావ‌తి  నిర్మాణం త‌న‌కు ఇక్క‌డ ఇష్టం లేద‌ని చెప్ప‌డ‌మే. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయ‌డానికి మాజీ స‌క‌ల శాఖ‌ల మంత్రి స‌జ్జ‌ల రంగ ప్ర‌వేశం చేసి.. అమ‌రావ‌తి అంటే త‌మ‌కెలాంటి బేధాభిప్రాయాలు లేవ‌ని అన్నారు.  అయితే జ‌గ‌న్ చెప్పిన దానికీ దీనికి  చాలానే తేడా  క‌నిపిస్తోంది. అంటే అధినేత  ఇక్క‌డ అమ‌రావ‌తి నిర్మించ‌డ‌మేంట‌ని అంటే ఇక వెంట‌నే  ఆ అధినేత బంటు వ‌చ్చి తూచ్ అలాంటిదేదీ లేద‌ని చెప్ప‌డంలో ఒక మ్యాజిక్ దాగి ఉంద‌నే చెప్పాల్సి ఉంటుంది. అదెలాంటిదో చూస్తే.. గ‌తంలో నాని, ఆపై జోగి, నేడు స‌జ్జ‌ల వీరంద‌రి చేత అమ‌రావ‌తి అంటే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పించ‌డం. దీంతో జ‌గ‌న్ పార్టీ అమరావ‌తిపై ఎలాంటి వ్య‌తిరేక‌ఖ‌త లేద‌ని జ‌నం గంపగుత్త‌గా  ఓట్లు వేస్తార‌న్న వ్యూహం ఇందులో దాగి ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇదే అమ‌రావ‌తిపై జ‌గ‌న్ ఇంగ్లీష్ లో  వ‌ద్ద‌ని చెప్ప‌డంలో ఇంకో వ్యూహం దాగి ఉంది.గ‌తంలో అమ‌రావ‌తి అంటే త‌న‌కెలాంటి వ్య‌తిరేక‌త లేద‌ని ఆయ‌న స్ప‌ష్టంగా తెలుగులో అది  కూడా అసెంబ్లీ వేదిక‌గా చెప్ప‌డం వ‌ల్ల‌.. గ‌త ఐదేళ్ల వైసీపీ  జ‌మానాలో ఎలాంటి న‌ష్టం జ‌రిగిందో తెలిసిందే. అప్ప‌ట్లో జ‌గ‌న్ ఒప్పుకున్నాడు క‌దా? అనే మాట  ప‌దే ప‌దే వినిపించింది. అదే ఇప్పుడు త‌న వారంద‌రి చేత అవున‌నిపించి తాను మాత్రం కాద‌న‌డం వ‌ల్ల అది కూడా ఆంగ్లంలో.. ఇదొక స్కెచ్ గా  తెలుస్తోంది. ఈ  స్కెచ్ ద్వారా వ‌చ్చే రోజుల్లో ఆంధ్రుల క‌ర్మ‌గాలి పొర‌బాటున  ఫ్యాను గాలి వీస్తే.. ఆపై తాను ఆనాడే చెప్పాన‌ని త‌ప్పించుకునేలా ఒక వెస‌లుబాటు క‌ల్పించుకున్నారు జ‌గ‌న్. అంతే  కాకుండా ఆయ‌న ద‌గ్గ‌ర ఇంకో థియ‌రీ కూడా రెడీగా  ఉండ‌నే  ఉంది. తాను ఎక్క‌డుంటే అదే రాజ‌ధానిగా  ఆయ‌న ఇది వ‌ర‌కే స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో తాను రిషికొండ ప్యాలెస్ లో కూర్చుని... ముందే చెప్పానుగా ఇదే మ‌న రాజ‌ధాని అంటూ ఆయ‌న ప్లేటు ఫిరాయించ‌డానికే ఇదంతా అన్న సంకేతాలు స్ప‌ష్టంగా అందుతున్నాయ్. కాబ‌ట్టి... బీఅవేర్ ఆఫ్ జ‌గ‌నాసుర! అన్న హెచ్చ‌రిక‌లు సైతం అంతే  స్థాయిలో సైర‌న్ మోగుతోంది.

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

దుఃఖాలు.. సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..!

Publish Date:Jan 10, 2026

  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.
[

Health

]

సమయానికి తినకపోతే ఈ సమస్య రావడం పక్కా..!

Publish Date:Jan 10, 2026

ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్,  కాల్షియం,  ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం.  ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం.  అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం  కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట.  సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..  మైగ్రేన్.. ఆహారం సమయానికి తీసుకోకపోతే  అది తలనొప్పి సమస్యగా మారుతుందట.  మరీ ముఖ్యంగా ఈ తలనొప్పి కాస్తా మైగ్రేన్ గా మారే అవకాశం ఉంటుందట. మైగ్రేన్ చాలా తీవ్రమైన తలనొప్పికి కారణం అవుతుంది.  ఆహారం సమయానికి తీసుకోకపోతే ఇది వారంలో రెండు నుండి మూడు రోజులు మైగ్రేన్ కారణంగా బాధపడాల్సి ఉంటుందని ఆహార నిపుణులు, వైద్యులు అంటున్నారు. మైగ్రేన్ వల్ల జరిగేది ఇదే.. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చే మైగ్రేన్ నొప్పి ఒక రోజు మాత్రమే ఉంటుందట.  కానీ దానివల్ల ఏకాగ్రత లేకపోవడం, దృష్టి లేకపోవడం, అలసట,  బలహీనత  మైగ్రేన్ ప్రభావాన్ని మరింత పెంచుతాయి.  దీని కారణంగా మైగ్రేన్ తరువాత  రెండు మూడు రోజులు ఏ పనిని ఏకాగ్రతగా చేయలేరు.. . సమయానికి తినాలి.. జాగ్రత్తగా, సమయానికి  తినడం వల్ల తలనొప్పి, దాని వల్ల కలిగే  దుష్ప్రభావాలను నివారించవచ్చు. అందుకే ఎన్ని పనులున్నా సమయానికి ఆహారం తినడాన్ని విస్మరించకూడదు. పెద్దవారు ఉదయం ఆఫీసుకు వెళ్ళేముందు,  పనికి వెళ్ళేముందు తినడం తప్పనిసరి.. అలాగే పిల్లలకు కూడా తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళేముందు ఆహారం పెట్టాలి.  ఎక్కువ సేపు టీవి, ఫోన్, కంప్యూటర్ వంటివి చూడటం వల్ల పిల్లలలోనూ, పెద్దలలోనూ తలనొప్పి, మైగ్రేన్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆహారం దగ్గర నిర్లక్ష్యం చేయకూడదు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...