ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారదా ?
నీరసించిన సర్కారీ దవాఖనాలు ఆటకెక్కిన ప్రజా వైద్యానికి చికిత్స తప్పని సరి రాష్ట్ర ప్రభుత్వాల ఆదీనంలో ప్రజా ఆరోగ్యం ఉంటుంది. జిల్లా ఆసుపత్రులు ప్రాధమిక ఆసుపత్రులు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారడం లేదు,అటు ప్రైవేటు పో టును భరించలేక, ఇటుప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం అడుగడుగునా సంమాన్యుడిని వెక్కిరిస్తోంది. రోగులను హీనంగా చీదరించుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రుల ను చూసి సామాన్యుడు వణికి పోతున్నారు. నగరంలో అదో ప్రధాన ఆసుపత్రి అక్కడికి మాన్యులు సామాన్యులు వస్తారు. అయితే మాన్యులు సామాన్యులు ఇక్కడ వేరేగా చూస్తారు.సామాన్యుడు అత్యవసర సేవకు వస్తే కార్పోరేట్ కు ఏమాత్రం తీసిపోని ధర ఒక్క ఐ సి యు లో బెడ్ దొరకాలంటే ప్రహసనమే అంతా పెద్దల దయపై ఆధార పడుతుంది.అక్కడ పలుకు బడి ఉంటేనే బెడ్ లేదా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ ధారా రోజుకు 2౦,౦౦౦ కట్టాల్సిందే.సరే అని రోగులు ఒప్పుకున్నా అక్కడికి అంటే ఐ సి యు కి వచ్చిమ రోగుల స్థితి కుక్క పాట్లే బెడ్ ఎప్పుడు దొరుకు తుంది అంటే ఏమో అసలు మదగ్గర బెడ్స్ లేవు మీరు ఎవరికైనా చెప్పుకోండి కావాలంటే మీరు ఎప్పటి వరకైనా ఉండాల్సిందే మీరు ఓపిక తో ఉండాలి అంటారు సదరు వైద్యులు,మీరు కావాలంటే ఉస్మానియా, గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకు పొండి.అంటూ ఒచ్చినా రోగులు ఆమెట్ల పక్కన అలాగే పడిగాపులు పడుతూ ఉండడం చూస్తే ఎవరికైనా కడుపు తరిక్కు పోతుంది. అక్కడికి తీసుకు వాస్తే బతుకు తాదేమో అన్న ఆశతో వచ్చే రోగులకి చుక్కలు చూపిస్తారు సగటు సెక్యూరిటీ సిబ్బంది పో అక్కడికి ఫో ఇక్కడ ఉండద్దు.అంటూ అక్కడి నుంచి తోసేస్తారు. అక్కితో ఆగక లోపల మా వాళ్ళు ఉన్నారు ఒక్కసారి వెళ్లి వస్తాను అంటే ఒవీల్లేదు మీరు పోవద్దు ఏయ్ ఇక్కడ రా ఎక్కడపోతున్నావు మేరు ఇక్కడే ఉండాలి అక్కడ ఏమి జర్గుతుంది. అన్న ఆందోళన రోగి బంధువులలో ఉంటె వేమి చేయలేక బతుకు తాడో లేదో తెలీక వెక్కి వెక్కి ఏడుస్తూ గుడ్లలో నీరు ఉబికి వస్తున్న బయటపడని సగటు మధ్య తరగతి రోగి పరిస్థితి.చేతి వాడిని వదిలి కల వాడిని పట్టుకున్నట్లు ఇక్కడ ప్రధాన ఆసుపత్రిలో మౌలిక వసతులు లేక సరైన చాలినంత బెడ్స్ లేక కొట్టుకుంటున్న సామాన్యుడి గోడు వినపడదు,కనపడదు ప్రభుత్వానికి ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరినట్లు వరంగల్ లో కొత్త ఆసుపత్రి కొత్తభవనం కట్టి అందరు ఇక్కడికే రావాలంటూ పెద్దలు సెలవిచ్చారు. అసలు ఐ సి యు లో ఉన్న బెడ్ల వివరాలు,ఆరోజు ఎన్ని ఫిలప్ అయ్యాయి.ఎన్ని ఖాళీ ఉన్నాయి అన్న వివరాలు తప్పనిసరిగా వివరించే బోర్డ్లు ఉండాలి,ఇక సర్జరీకోసం వచ్చా రోగులకు సైతం బెడ్లు కేటాయించాలంటే అసలు అక్కడ ఏ వార్డులో ఎన్ని బెడ్స్ ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నెలల తరువాత బెడ్స్ అందుబాటులో ఉంటాయి అన్న సమాచారం ఉండాలి.అసలు ఆసుపత్రులలో బెడ్లె లేకుంటే ఇక మూడో విడత ప్రమాదాన్ని తట్టుకోడానికి చేస్తున్న ఏర్పాట్లు ఏమిటి రోగుల తాకిడిని తట్టుకోవడం ఎలా ప్రశ్నలకు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అసలు సమాస్యకు పరిష్కారం తయారీ జరుగుతోందా అన్నది ప్రస్నార్ధకం గా మారింది.జనాభా అవసరాలు తీరని ఆసుపత్రులు అక్కడ వైద్యం చేయని సిబ్బంది ఎందుకు.వారికి జీతాలు ఎందుకు ప్రజలను చీదరించుకోదానికా?ప్రజా ఆసుపత్రులు ఉన్నట్టా లేనట్టా అన్నది అర్ధం కానీ సమస్య.అన్నీ ఉన్నా అది ఎదో అన్నట్లు ప్రజా ఆసుపత్రి కి రావాలంటే ప్రభుత్వ వైద్య సిబ్బంది పని తీరు మరాకుంటే ఎన్నికోట్లు ఇచ్చిన్న ప్రభుత్వ ఆసుపత్ర్హి ని ఐ సి యు లో ఉన్నట్లే అసలు ప్రాజా అసుపత్రులకే చికిత్స అవసరం.
read moreనృత్యంతో ఆరోగ్యం సాధ్యం...
వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఎదో ఒక శరీర వ్యాయామం ఉండాలి మెడకు పని పెట్టాలి . చేసే పని పై ఏకాగ్రత ఉండాలి.అప్పుడే వ్యక్తి పరి పూర్నుడిగా ఆరోగ్యంగా ఉంటారు ఈ అంశం పై పరిశోదనలు చేస్తున్న కొందరు కళాకారుల తో ఈ అంశాల పైన కొందరు కళా కారులతో తెలుగు వన్ హెల్త్ మాట్లాడింది.ఆంశాలాలో కొన్ని మీ కోసం. తూర్పున సూర్యోదయానికి ముందే మన ఆలోచన మొదలు పెడుతుంది నిన్నజరిగిన సాధన లో ఏమి నేచుకున్నాం? ఆ నృత్య రీతి ఏమిటి,ఆలయ జాతి ఏమిటి ఒకటికి రెండు సార్లు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం,ఆవెంటనే ఆపాట లేదా సాహిత్యం లోఉండే అర్ధాన్ని తెలుసుకుంటాం అంటే దీనిని మొత్తంగా ఏకాగ్రతతో పూర్తిగా పరిశీలించి మళ్ళీ ఆ పాటాన్ని పూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటాం తద్వారా తిరిగి ఆంశాన్నే ప్రదర్శించే ప్రయత్నంలో సాధన చేస్తారు సంగీత కళాకారులు.నృత్య కళాకారులు. ఒక మహాకవి అన్నట్లు సాధనమున పనులు సమకూరు ధరలోన.అన్నట్లు సాధన చేస్తే మనసు,పూర్తిగా ఏకాగ్రత తో సాధన చేస్తే పట్టు వస్తుంది.నేర్పు వస్తుంది,ప్రదర్శించే ధైర్యం వస్తుంది తమ ప్రదర్సన పై వారికే నమ్మకం వస్తుంది.అలా కళాకారుడు నిత్య సాధనా సంపత్తి తో ఎదుగు తారు కృషి ఉంటె మనుషులు ఋషులు అవుతారు అన్నట్లు.యతో హస్తః తధో దృష్టి,యతో మనః తాదో భావః యతో భావః తాదో రసాః అంటే ఎక్కడైతే మీ చేతులు ఉంటాయో వాటి పనే మీద్రుష్టి ఉంటుందో,ఏవైపు మీ దృష్టి ఉంటుందోఅక్కడే మీ మనసు ఉంటుంది. ఎక్కడైతే మీ మనసు ఉంటుందో అక్కడే భావమం పలికిస్తుంది.అంటే దీని అర్ధం మీ మనసు శరీరం దృష్టిఎప్పుదైతే కేంద్రీకరిస్తాడరో అక్కడ భావాలు అవే పలుకు తాయి ఏ సాధకుడైనా సాధన క్రమంలో సాధన చేస్తే పూర్తిగా సంపూర్ణ కళాకారుడు అవుతాడు,మంచి బావుకుడు అవుతాడు,ప్రతి ప్రదర్శనలో కొత్తభావాళ్ళు ప్రదర్సిస్తాడు.కొత్త ఆవిష్కరణలు వస్తాయి,ఇంకొకవి ఏమన్నా డంటే సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. అందుకు నిత్యసాధకుడిలో ముఖంలో అందం తోనణికిసలాడుతుంది ఎప్పుడెప్పుడా తన కళా ప్రదర్సనను ప్రదర్సించాలా అన్ని ఉవ్విళ్ళూ రు తూ ఉంటారు అందుకు ఆప్రదర్సన ప్రేక్షకుల ప్రసంసలతో పాటు హర్షధ్వానాలు అందుకుంది. ఆంగిక,సాప్త్విక అభినయాన్ని, ఏకాగ్రతతో సాధన చేస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరానికి వ్యయామమం జరిగింది.అలా సాధన చేస్తూనే ఉంటారు తమకు రాదు అనుకున్న అంశాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటారో ఒక్కా సరి సాధన చేస్తే వచ్చే అఆలోకిక ఆనందం లో ఉబ్బి తబ్బిబై పోతాడు.సగటు సంగీత కళా కారుడు,లేదా సగటు నృత్య కళా కారిణి ఆసఫ్హనలోనే సంతృప్తి,ఆసధనలోనే పరిపక్వత,సాధనలోనే సాధ్యం కాని అంశా లపైనే తదేక దృష్టి అప్పుడే ఆకళ పట్ల సంతృప్తి.అలా అనుకోకుండానే కళాకారులైన వారు చాలానే ఉన్నారు.సాధన అనేది నీవు నివసించే ఇంటికి పునాది ఎలాగో నువ్వు ఎంచుకున్నకళకు పునాది కళా సాధన పునా దు లపైన మెరిసినా మురిసిన ప్రతి కళాకారుల జీవితాలు ఆరోగ్యంగా ఉన్నాయంటే సదానే పునాదిగా ఎన్నాళ్ళైనా సంగీత,నృత్యంలో ఆరోగ్య వంతమైన జీవితాన్ని ఇస్తుంది.మనసుకు ప్రశాంతత, అనందం,ఉత్తాహాం ఉల్లాసం ఆరోగ్యం సంగీతం నృత్యం తోనే అంటారు కళాకారులు.ఈ అంశం పై మరిన్ని పరిశోదనలు మీముందుకు తెస్తోంది తెలుగు వన్ హెల్త్.
read moreటిబితో ప్రమాదమే...
మానవ జీవితానికి ఎంత చరిత్ర ఉందొ మనుషుల్ని పట్టి పీడించే క్షయ వ్యాధికి అంటే టి.బి కి కూడా చరిత్ర ఉంది క్షయకు సంబందించిన ప్రస్తావన మన వేదాలలోను వుంది.క్రీస్తు పూర్వం 6౦౦ నటి కలం లోనే చరక సంహిత సుశ్రుత గ్రంధంలో ఉందని వుంది.తేలికగా కనిపెట్ట గలిగి పూర్తిగా నయం చేయగలిగే క్షయ వ్యాధికి సగటున నిమిషానికి ఒక భారాతీయుడు చనిపోతున్నా డంటే మన వాళ్ళు ఈ వ్యాధి పట్ల ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్సిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ట్యూబక్లోసిస్ గా పిలవ బడే క్షయ వ్యాధికి సంబందించిన క్రిమి ని 1882 లో రాబర్ట్ కాక్ అనే జర్మన్ డాక్టర్ కనిపెట్టడని ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీదే ఈ వ్యాధిని కోచ్స్ డి సిజెస్ గా పిలుస్తారు.ఆయన కనిపెట్టిన క్షయ వ్యాధి కరక క్రిమి పేరు మై కో బాక్టీరియమ్ టుబేర్ క్లోసిస్ దూర దృష్ట వసాత్తూ ఈ వ్యాధికి ట్రీట్ మెంట్ ఆ తరువాత మరో అరవై ఏళ్ల దాకా కనిపెత్తబడలేదు.ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 8 మిలియన్ల కొత్త టి బి కేసులు నమోదు అవుతున్నాయి. వాటిలో 1. 5మిలియన్ల కేసులు మన దేశానికీ సంబందించినవే సగటున నిమిషానికి ఒక భారతీయుడు టిబి మూలంగా చనిపోతున్నారాణి తెలుస్తోంది. టిబి ఎలా మొదలౌతుంది?... టిబి శరీరం లోని ఏ భాగానికైనా సోకవచ్చు ఎక్కువగా ఊపిరి తిత్తులకు సోకు తోంది.సాధారణంగా టిబి క్రిములున్న గాలిని పీల్చడం వల్ల ఇవతలి వ్యక్తి టిబి సోకుతుంది. టి బి సికిన మనిషి దగ్గి నప్పుడు,ఉమ్మి వేసినప్పుడు,మాట్లాడు తున్నప్పుడు లేదా చీదు తున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి క్రిములు గాలిలోకి వ్యాపిస్తాయి ఆ గాలిని పీల్చిన ఎదుటి మనిషి లోకి క్రిములు ప్రవేసిస్తాయి. ఒక మనిషి శరీరంలోకి టి బి క్రిములు ప్రవేశించగానే ఆ క్రిముల్ల్ని వసపరుచుకోడానికి అతడి శరీర కఫాన్ని తయారు చేస్తుంది. క్రిముల్ని ఇముడ్చుకున్న ఆ మ్యుకస్ ను ఆ వ్యక్తి దగ్గడం లేదా ఉమ్మడం ద్వారా లేదా చీదడం ద్వారా బయటికి నేట్టివేస్తాడు. శరీరంలో టి బి క్రిములు ఇంకా ఎమన్నా మిగిలి ఉంటె వాటిని అతడిలోని రక్త కణాలు చంపడానికి ప్రయత్నిస్తాయి. రెండు రకాలుగానూ అతడి శరీరం టి బి క్రిములను వదిలించుకోలేక అవి ఆశరీరంలో తిష్ట వేసి కుని ఆవ్యక్తి శ్వాస నాళాల ద్వారా వరూధి చెందు తాయి. సరైన పోషకాహారాన్ని తీసుకోక పోవడం డయాబెటిస్,ఎయిడ్స్,కోరింత దగ్గు ,తట్టు,కిక్కిరిసిన ప్రదేశాలలో నివాసముండడం, సరైన పరిశుభ్రత పాటించక పోవడం.ఇలాంటి వన్నీ టి బి ఇన్ఫెక్షన్ అభ్వృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి. టి బి లక్షణాలు.... 1)టి బి లక్షణాలు ఏ అవయవానికి సోకిందన్న దాని మీద శరీరంలో ఒక్క ఊపిరి త్తులకే కాదు ఏ అవయవంకైనా టిబి సోకవచ్చు. లింఫ్ గ్రంధులు, ఎముకలు, కీళ్ళు, చర్మం, ప్రేవులు, మెదడు, కిడ్నీలు ఇలా ఏ అవయవామైనా సోకవచ్చు అని అంటున్నారు నిపుణులు. సాధారణంగా మన శరీరంలోని రోగ నిరోధక యంత్రాంగం టిబి క్రిమి మనకు సోకకుండా అంటే ఇన్న్ఫెక్ట్ కాకుండా కాపాడుతుంది. అయితే కొందరిలో ఈ యంత్రాం గం బలహీనంగా ఉండడం వల్ల ఆవ్యక్తులు టి బి బారిన పడుతూ ఉంటారు. ఊపిరి తిత్తులలో టిబి.... మనిషికి టిబి ఎక్కువగా ఊపిరి తిత్తులకే సోకుతూ ఉంటుంది.దీని ముఖ్య లక్షణం దగ్గు.టిబి మూలంగా వచ్చే సాధారణ దగ్గు సాధారణ మందులకు సిరప్ లకు లొంగదు.ఏ వ్యక్తి అయినా రెండు వారాలకు పై బడి దగ్గుతూ ఉంటె ఈ రెండు వారాలలో ఏ మందు వాడినా ఉపయోగం లేకపోతే ఆవ్యక్తి టి బి సోకిందేమో అని సందేహించ వచ్చు. ఈ వ్యాధిలో దగ్గు తో పాటు జ్వరం కూడా ఉంటుంది.సాధారణంగా ఈ జ్వరం ఉదయం వచ్చి సాయంత్రానికి తగ్గిపోతుంది.వారం లోగా రోగి బాగా బలహీనం అయిపోతాడు. ఇన్ఫెక్షన్ కొంత్రోల్ చేయడానికి శరీరం తన శక్తి నంతా కూడా దీసుకుని ప్రయత్నం చేయడం వల్ల త్వరగా బరువు కోల్పోతాడు.ఆకలి వేయక పోవడం లేదా సరిగ్గా అన్నం తినలేక పోవడం మరో సమస్య. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం మొదలైన కొద్దీ దగ్గి దగ్గి ఉమ్మేసి నప్పుడు కళ్ళే తో పాటు రక్తం పడుతుంది. చాతిలో నెప్పి వాళ్ళ ఇబ్బంది కలగ వచ్చు. ఈ లక్షణా లన్ని కలగలిపి మొత్తం మీద తాను అనారోగ్యం తో బాధ ఒఅదుథున్నాడని అనిపించవచ్చు ఏ పని చేయలేకపోవడం లేదా మనుషులకు దూరంగా ఎప్పుడూ పడుకోవాలని అనిపించడం గమనించవచ్చు. లింఫ్ గ్రంధులకు టిబి... మన శరీరం మొత్తం మీద అనేక లింఫ్ గ్రంధులు వుంటాయి.శరీరంలో ఏ భాగమైనా ఇన్ఫెక్షన్ కు గురి అయినప్పుడు.సూక్ష్మ క్రిముల పైన దాడి చేయడం కోసం ఈ గ్రంధులు రక్షక కణాలను ఉత్పత్తి చేస్తాయి.ఆ భాగానికి పంపిస్తాయి.రోగ నిరోధక శక్తి యంత్రాంగం బలహీనంగా ఉన్నప్పుడు ఆభాగాన టిబి చోటు చేసుకోవచ్చు.అప్పుడు లింఫ్ గ్రంధులు వస్తాయి.సాధారణంగా టిబి మొదట మెడ వద్ద గ్రంధికి సోకుతుంది. వెన్నెముక టిబి... వెన్నెముకకు టి బి సోకడం చాలాఅరుదుగా జరుగుతూ ఉంటుందిఈ స్థితిలో వెన్నెముక పెళుసుగా స్తిఫ్ఫ్ గా ఉంటుంది నొప్పి కలుగుతూ ఉండడమే కాదు గూని కూడా వచ్చే అవకాసం ఉంది. టిబి వచ్చిన వెన్నె ముక భాగానికి దగ్గరలో చీము గడ్డ లాంటిది ఏర్పడుతుంది.దీనిని కోల్డ్ అబ్స్సుస్స్ అంటారని వైద్యులు పేర్కొన్నారు. మిగతా చీము గడ్డల్లా ఈ చీముగడ్డ మూలంగా నొప్పి అంటూ ఏమి ఉండదు.నయం చేసుకోకుండా ముద్ర పెడితే పక్షవాతమూ వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. బోన్ టిబి... ఎముకలకు, కీళ్ళకు సోకే టిబి లో తుంటి వద్ద కీలు,మోకాలి కీలు,చీలమండలు,పాదం,ఎముక,భుజం కీలు,మోచేతి కీలు, మణి కట్టు,చేతి ఎముకలకు టి బి సోకే అవకాసం ఉంది. ఎముకకలకు,కీళ్ళకు టిబి సోకిన వ్యక్తి కీళ్లలో నొప్పివస్తుంది.ఆయా అవయవాలు కదలికలు ఇబ్బందిగా ఉంటాయి. కుంటడం, లేదా అంగ వైకల్యమూ సంభవించవచ్చు. టిబి సోకిన ఎముకకు దగ్గరలో వుండే కండరాలు బలహీన పడి లేదా చిక్కి సల్యమై రాత్రులు ఆయా భాగాలలో వచ్చే నొప్పికి చిన్న పిల్ల లైతే నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు.ఈ విషయాన్ని తల్లి తండ్రులు గమనించాలి. కిడ్నీకి టి బి... కిడ్నీ కి టి బి వస్తే చాలా తొందరగా కిడ్నీ చెడిపోతుంది.టిబి వచ్చిన రోగుల్లో మూత్రానికి మాటిమాటికీ వెళ్ళాల్సి రావడం.మూత్ర విసర్జన చాలా బాధాకరంగా ఉంటుంది.మూత్రం తో పాటు రక్తం కూడా పడవచ్చు.తరువాత వెన్ను నొప్పి ప్రారంభ మౌతుంది.తరువాత తరువాత జనేన్ద్రియలకు పాకే అవకాసం ఉంది. స్త్రీలలో కిడ్నీలకు టి బి సోకితే వాళ్ళు గొడ్రాలుగా మారే అవకాసం ఉంది.మన దేశంలో స్త్రీలు గోడ్రాలుగా మారడానికి కారణం కిడ్ని కి టి బి యే కారణమని నిపుణులు తేల్చారు. పొత్తికడుపు లో టి బి... పొత్తి కడుపుకు టి బి సోకితే నీళ్ళ విరేచనాలు,ఆకలి కోల్పోవడం,తీవ్రమైన జ్వరం,పొత్తి కడుపు ఉబ్బడంమొదలైన లక్షణాలు ఉంటాయి. గుండెకుటి బి... వాస్తవానికి గుండె చుట్టూ ఉండే సంచి లా ఉండే భాగం పెరి కోర్దియం అంటారు దీనికి టి బి సోకిందో గుండెకు టిబి సోకి నట్లే. గుండె దగ్గరగా ఉండే చాత్తి భాగాన నొప్పి ఉంటుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది.ఉచ్వాస నిశ్వాసాలు వేగా వంతంగా ఉంటాయి. కన్ను చేవ్వి,ముక్కు గొంతుకు టిబి... కంటికి,చెవికి,ముక్కుకి,గొంతుకి టి బి సకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కంటికి టి బి వ్వాస్తే దృష్టి కోల్పోవచ్చు,ఇంకా నయం చేయడానికి వీలు కాని విధంగా ఉంటె కన్ను తొలగించాల్సి వస్తుంది. అలాగే శ్వాస నాళానికి కూడా టిబి సోకే అవకాసం ఉంది,అదృష్ట వశాత్తు ఆయా శరీర భాగాలలో డిఫెన్స్ యంత్రాంగం పటిష్టంగా ఉండడం వల్ల టి బి చాలా అరుదుగా వచ్చే అవకాసం ఉందని నిపుణులు పేర్కొన్నారు. మెడకు టిబి... మెడకు టి బి వస్తే దీనిని టి బి మేనేన్జటిస్ అంటారు మెదడు లోని కణాలకు టి బి సోకి నప్పుడు ఆభాగాన టుబర్ క్లోమా ఏర్పడుతుంది మెదడు పోరాభాగాలకు టి బి సోకితే అది మేనిన్జిటిస్ కు దారు తీస్తుంది.ఇది ఎక్కువగా చిన్నపిల్లలో వస్తుంది. దీనిని బట్టి మనకు శరీరంలో ఏ భాగంలో ఐనా టి బి వస్తుంది.అది ఆయా వ్యక్తి శరీరం మొత్తం మీఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది.ఒక్కసారి వ్య్సక్తిలోని రోగ నిరోధక శక్తి బలహీనా పడిందంటే ఒకదాని వెంట మరో అనారోగ్యం దాడి చేస్తూనే ఉంటుంది.సకాలంలో వ్యాధిని గుర్తించి నయం చేసుకోక పోతే ప్రమాదమే.
read moreఅంటు వ్యాధులతో జరా భద్రం...
అంటూ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి?అభివృధి చెందిన దేశాలలో అంటు వ్యాధులు సెక్స్ ద్వారా వ్యాపిస్తాయి.లేదా గాలి ద్వారా,రక్తం ద్వారా లేక స్పర్స ద్వారా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. వెనుక బడిన దేశాలలో ఇవి క్రిములుకీటకాల ద్వారా ,ఆహారం ద్వారా ఇంకా ఇతరత్రా అనేక రకాలుగా వ్యాప్తి చెందు తాయి. అంటూ వ్యాధులు ఎవరికీ సోకుతాయి? అంటూ వ్యాధులు ప్రబలంగా ఉన్న దేశాలలో నివసించేవారికి, ప్రయాణించే వారికి,మూడు నెలల లోపు పాపాయిలకు, అంటూ వ్యాధి సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు, ఆటలమ్మ చికన్ పాక్స్ వంటి బాల్యపు జబ్బులు పెద్దవాళ్ళకు సోకితే దాని ప్రభావం వారి పై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృద్ధులు బలహీనంగా ఉన్న వాళ్ళకు అంటూ వ్యాధులను తట్టుకోగలిగే సామార్ధ్యం ఉండదు.కనుక వారికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటూ వ్యాదులలో కొన్ని... ఎయిడ్స్,హెపటైటిస్,జలుబు,ఫ్లూ,తట్టు.రాబీస్,రుబెల్లా,గనేరియా,సిఫిలిస్ సుఖ వ్యాధులు. మెదడు వాపు వ్యాధి,న్యుమోనియా,క్షయా.టైఫాయిడ్,అమీబియాసిస్.కోలోరా,మలేరియా, తదితరాలు అంటూ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయి... ఆయా వ్యాధులను బట్టి వ్యాధుల లక్షణాలు ఇలా ఉంటాయి. నీళ్ళ విరేచనాలు. జ్వరం తలనొప్పి దద్దురులు. మొదలైనవి అంటూ వ్యాధుల-నివారణ ఉపాయాలు... డాక్టర్లు సూచించే అన్ని రకాల టీకాలను పిల్లలకు వేయించడం. విదేశాలకు వేల్తున్నప్ప్పుడు అక్కడ ప్రబలి ఉండే అంటు వ్యాధుల గురించి మీ డాక్టర్ను కన్సల్ట్ చెయ్యండి. అంటూ వ్యాధులు ప్రభాలి ఉన్న ప్రాంతం లోనుంచి ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి ఐస్ క్రీములు,అక్కడ ఉండే అపరి శుభ్రమైన నీరు,సరిగా ఉడకని ఆహార పదార్ధాలు తినకుండా ఉండండి.మిగతా ఆయా అంటూ వ్యాధులకు సంబందించిన జాగ్రతలు త్రేసుకోండి.కొన్ని సందత్భాలలో మామూలు వ్యాధే అని అనుకున్నారా అంతే ప్రాధమిక స్థాయిలో గిర్తించండి ఆరోగ్యంగా ఉండండి.
read moreగుండె జబ్బు వచ్చిందో గుటుక్కేనా..!
నేడు ప్రపంచంలో మారిన జీవన శైలి.ఆహారపు అలవాట్లు,ముఖ్యంగా మానసిక ఒత్తిడి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.దెబ్బకు స్త్రీ,అయినా ,పురుషులైనా ప్రాణాలను గుటుక్కు మనిపించే ప్రాణాంతక జబ్బులలో గుండె జబ్బు ఒకటి.హార్ట్ అట్టాక్ రావడానికి కారణం ముఖ్యంగా మనం జీవించే విధానం ప్రధాన కారణం గా పేర్కొంటున్నారు నిపుణులు. లేదా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం గా పేర్కొన్నారు. జీవన విధానాన్ని మార్చుకోడం ద్వారా గుండె పోటు వచ్చే అవకాశాన్ని 7౦ % దాకా తగ్గించ వచ్చనేది నిపుణుల అభిప్రాయం. అలవాట్లు మార్చుకోవడం ద్వారా గుండె పోటు రాకుండా మీరు ఎంత వరకూ సఫలం కాగలరో చూద్దాం. గుండె పోటు తగ్గడానికి ఏం చెయ్యాలి,గుండెపోటు తగ్గడానికి ఉన్న అవకాశాలు చూద్దాం. ఏం చెయ్యాలి... గుండెపోటు తగ్గే అవకాశాలు... పొగ తాగడం మానాలి... పొగ తాగుతున్న వాళ్ళ కంటే పొగతాగడం మానేసి 5 సంవత్సరాలు అయిన వాళ్ళకు 5౦-నుండి 7౦% దాకా హార్ట్ అట్టాక్ రిస్కు తగ్గుతుంది. ఎక్సర్ సైజులు చేయడం... ఏ ఎక్సర్ సైజులూ చేయని వాళ్ళకంటే రెగ్యులర్ గా ఎక్సర్ సైజు లు చేసే వాళ్ళకు హార్ట్ అట్టాక్ రిస్క్ 45% ఉండవచ్చు. శరీరానికి తగ్గ బరువు మెయిన్... ఎత్తుకు తగ్గ బరువు వున్నా వాళ్ళు ఉండాల్సిన మీద 2౦ % టైన్ చేయాలి ఎక్కువ బరువున్న వాళ్ళకంటే 35% నుంచి 55%తక్కువ రిస్క్ కలిగి ఉంటారు. రోజుకో యస్ప్రిన్ తీసుకోవడం... ఆస్ప్రిన్ తీసుకొని వాళ్ళ కంటే రోజుకో ఆస్ప్రిన్ ని తీసుకునే వాళ్ళు 35%రిస్క్ ఉంటుంది. హై బిపి కి చికిత్స తీసుకునే వాళ్ళు--- డయాస్టాలిక్ ప్రెషర్ ని తగ్గించుకున్న ప్రతిసారీ వీళ్ళు హార్ట్ అట్టాక్ రిస్క్ ను 2 -3 % తగ్గించుకున్నవాళ్ళు అవుతారు. డయాబెటిస్ఎక్కువగా ఉన్నవాళ్లు... డయాబెటిస్ తో బాధ పడే వాళ్ళ కంటే చక్కెర శాతం ఎక్కువగా ఉండే వాళ్ళకు గుండె పోటు అవకాశాలు బాగా తక్కువ. ఒచ్చే సంచికలో గుండె నొప్పి రకాలు శాస్త్ర చికిత్సలు తడి తర ఆంశాల పై పూర్తి వ్యాసం ప్రచురిస్తాం.
read moreఇన్ఫెక్షన్లు శరీరానికి హానికరం...
శరీరానికి అపకారాన్ని కలగ జేసే సూక్ష్మ క్రిములు మనశారీరంలోకి ప్రవే సించి నప్పుడు. వచ్చే క్రిములను పతోజేన్స్ అంటారు.వీటి ప్రవేశం తో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. పాతోజెన్స్ లో ఈ క్రింది రకాలు ఉంటాయి. బాక్టీరియా వైరస్ లు ప్రోటోజోవా రికెట్సి యే ఫంగి పురుగులు. ఇలాంటి రకరకాల క్రిములు కూడా ఒక మనిషి నుంచి మరొక మనిషికి అనేక మార్గాల ద్వారా సోకు తూ ఉంటాయి. 1) ఒక వ్యక్తి దగ్గినప్పుడు.గాలి లోకి వ్యాపించే తుంపర అవతలి వ్యక్తి పీల్చడం ద్వారా వేరొకరికి సోకుతుంది. 2)కొన్ని రకాల క్రిములు ముద్దు ద్వారా,సంభోగం ద్వారా,ఒకరినుంచి మరొకరికి సోకుతుంది. 3)దోమల ద్వారా ప్రోటోజోవా రకానికి చెందిన ప్లాస్మోడియం అనబడే మలేరియా క్రిములు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందు తాయి. 4)పక్షుల ద్వారా, చిలకల ద్వారా ప్సిట్టకాసిస్ అణా బడే బ్యాక్టీరియా సోకుతుంది. 5)కలుషితమైన ఆహారం,నీరు,మట్టిలో కొన్ని విష క్రిములు.ఇవి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేసిస్తాయి. 6)కొన్ని విష క్రిములు తల్లి ద్వారా, గర్భదారణ సమయంలో ప్రసవ సమయంలో ను బిడ్డకు సోకు తాయి. క్రిములు ఎలా ఎప్పుడు పోడుగుతాయి.... 1)మనకు అపకారాన్ని కలగ జేసే విష క్రిములు ఒక సారి శరీరంలోకి ప్రవేశించాక అవి తమ ఉత్పత్తిని వృద్ధి చేసుకుంటూ పోతాయి.అవి మన శరీరం పై ప్రభావాన్ని చూపుతూ తమ లక్షణాలను ప్రదేసించడానికి కొంత సమయం పడు తుంది. 2)క్రిములు శరీరం లోకి ప్రవేశించి లక్షణాల్ని ప్రదర్సుంచే దాకా ఉండే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే పొడగాబడే కాలం అని అంటారు. 3)ఇంక్యు బేషన్ కాలం అనేది కలరా లాంటి వ్యాధికి కొన్ని గంటల సమయమే పడితే కాలేయం మీద ప్రభావాన్ని చూపడానికి 5 నెలల సమయం పడుతుంది.ఈ వ్యాధిని హేపటైటిస్ వ్యాధి అని అంటారు. 4)ఒక వ్యక్తికి అంటూ వ్యాధి వచ్చినప్పుడు అతని శరీరం ఆ ఇన్ఫెక్షన్ మీద పోరాడడానికి కొన్ని యాంటీ బాడీస్ కావాలి వాటి అభివృధి చేసుకుంటుంది. 5)ఆ వ్యాధి తగ్గిన తరువాత కూడా యాంటి బాడీస్ అతని శరీరంలో నిలవ ఉండి మళ్ళీ అలంటి క్రిములు సోకి నప్పుడు దానిని నివారించ గలిగే స్థితిలో ఉండి ఆ క్రిమికి సంబందించినంత మేర అతడిలో సహజసిద్ధ నిరోధక శక్తిని ఏర్పరుస్తాయి. 6)శరీరంలో వివిధ రకాల రోగాలతో పోరాడే యాంటీ బాడీస్ తాయారు అయ్యేటట్లు టీకాలు అంటే వ్యాక్సిన్ల ద్వారా శరీరానికి కృత్రిమంగా ప్రేరే పిస్తారు డాక్టర్లు. అసలు వ్యాక్సిన్ లోని సూత్రం ఏమిటి?... 1)ఫలానా వ్యాధి కి సంబందించిన పదార్ధాన్ని తగిన మోతాదు లో వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశ పెట్టినప్పుడు. వ్యాధి ఏర్పడ కుండానే ఆ వ్యాధితో పోరాడ గలిగే యంటి బాడీస్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి.ఇక అప్పటినుంచి ఆ వ్యక్తిని ఆ వ్యాదిక్రిములు ఏమీ చేయలేవు. 2)అంటే అతడి శరీరం అప్పటి నుంచి ఆ వ్యాధి క్రిములను నివారించాగలిగే స్థితికి చేరుకుంతుంది అంటే మరో మాట చెప్పాలంటే అతడికి వ్యాధి రాదని ఆర్ధం. 3)అంటే అన్నిరకాల ఇన్ఫెక్షన్ లకు వ్యాక్సిన్ ఇంకారాలేదు.కాని ఇప్పటికీ లభ్యమౌతున్న వ్యాక్సిన్స్ తో మనం కొన్ని భయంకర మైన వ్యాధులను నివారించుకో గలిగాం అయితే కోవిడ్ లాంటి మహమ్మారికి ఇంకా పూర్తిగా పరిశోదన చేస్తేగాని మరిన్ని వ్యాక్సిన్లు మందులు వస్తే తప్ప కోరోనాపై పూర్తిగా అదుపు చేయలేము. అందుకే ప్రపంచం యావత్తు మహమ్మారి పై యుద్ధం చేసేందుకు ఎవరికీ ఉన్న పరిజ్ఞానం మేరకు వారి వారి స్థాయిని బట్టి ఇంకా పరిశోదనలు చేస్తూనే ఉన్నారు. మానవుడు ఆశాజీవి వివిధ రూపాలలో మారుతున్న కోరోనా వైరస్ ను కనుక్కో వాలంటే వైద్యులు ఎన్ని ఏళ్ళు తపస్సు చేయాలో కాలమే సమాధానం చెప్పాలి. ప్రాకృతికంగా సహజ సిద్ధమైన ఔషదాలు,ఆధునిక చికిత్సలు అవసరమైన మేర ఉన్నప్పటికీ పూర్తిగా వైరస్ పోయే వరకు విస్రమించాల్సిందే. గతంలో వచ్చిన వైరస్ లను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఎలా ఉపయోగ పడిందో అలాగే వైరస్ పై పోరాడాలంటే వ్యాక్సిన్ తోనే సాధ్యమని నిరూపించారు. వ్యాక్సిన్ వేసుకోండివైరస్ ను తప్పించు కొండి.వ్యాధి పై పోరాడండి.
read more5000 సంవత్సరాల కాలం నాటి బ్యాక్టీరియా ఇంకా బతికే ఉంది
5౦౦౦ సంవత్సరాల కాలం నాదు ప్రాణాలను కబళించిన ప్లేగు వ్యాధికి సంబందించిన బ్యాక్టీరియా మనిషిలో ఇంకా బతికే ఉందని తెలిపారు.బ్రిటన్ లోని బి జి ఎ ఇ యు డామ్నిక్ గోద్నార్ చనిపోయిన వ్యక్తిలో ఇంకా ప్లేగు వ్యాధి కి సంబందించిన బ్యాక్తీరియాను పరిశోదనలో కనుగొన్నట్లు తెలిపారు. ప్లేగు వ్యాధికి కారణమైన యేర్సినియా అనబడే స్ట్రైన్ చాలా పురాతన మైన స్ట్రైన్ ను 5౦౦౦ సంవత్సరాల తరువాత కనుగొన్నారు.వీరి పరిశోదనలో వై పెస్టిన్ 2,౦౦౦ సంవత్సరాల అంతకు పూర్వం అయి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల అంచనా. జనటిక్ ఏనాలసిస్ట్ల పరిశోధనల ప్రకారం దీనిప్రభావం తక్కువగానే ఉండవచ్చని,అయితే బ్యాక్టీరియా పూర్తిగా చనిపోలేదని ఇది మధ్యస్థం గా హ్యండల్ సేకరించిన సమాచారం ప్రకారం ప్ప్లేగు వ్యాధి ఇద్దరిలో ఉందనివారి ఆస్తి పంజరాలను తవ్వి వెలికి తీసినట్లు సమాచారం.అప్పుడు 18౦౦ సంవత్సరాలు ఇప్పుడు ఆప్రాంతం పేరు ల్రేట్ నియా ఇద్దరు వ్యక్తులు 2౦ సంవత్సరాల వరకు కనిపించకుండా పోయారని వారిని జర్మన్లు సమీకరించిన ఫిజిషియన్ అంత్రోపాలజిస్ట్ రుడాల్ఫ్ విర్చో పాతకాలం నాటి స్ట్రైన్ ను బ్యాక్తీరియను కనుగొన్నారు. వీరు చేసిన పరిశోధన సెల్ రిపోర్ట్ లో ప్రచురించారు. ఇది 2౦౦ సంవత్సరాల పూర్వం నాటి దై ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు క్రానియా ను జర్మన్ ఫిజీషియన్ రుడాల్ఫ్ విర్చన్ సెల్ తీరీ లో నిపుణులు కావడం వల్లే ఈ తీరీ ద్వారా ఈ వ్యాధి ప్రభావం పై ఆంత్రో పాలజీ ద్వారా దీనిని అభివ్రుది చేసినట్లు పేర్కొన్నారు.1875 లో ఆర్కియాలజిస్ట్ కార్ల్ జార్జ్ కౌంట్ స్లేవేర్స్ క్రమ పద్దతిలో రిన్ను కలన్స్ల్ లో తవ్వకాలు జరిపారు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని లేత్వియా సైవర్స్ తమ పరిశోదనలో ఒక స్త్గ్రీ ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న స్త్రీ ఆస్తిపంజరాన్ని కనుగొన్నారు.అలాగే 2౦-3౦ సంవత్సరాల మధ్యఉండే పురుషుని ఆస్తి పంజరాన్ని జర్మన్ ఫిజీషియన్ రుడాల్ఫ్ విర్చో కను గోన్నారు.రెండవ ప్రపంచ యుద్ధ్సం తరువాత ఈ ఇద్దరు కనపడకుండా పోయారని 2౦ సంవత్సరాల వరకు అడాల్ఫ్ విర్చే కలక్షన్లో కనుగొన్నారని ఆప్రచురణలో పేర్కొన్నారు. దీనిని బట్టి ఎన్ని సంవత్సరాల కాలం నాటి బ్యాక్టీరియా ఐనా బతికే ఉంటుందని ఈ పరిశోదన వెల్లడిస్తోంది.ఇక ప్రస్తుతం వేదిస్తున్న కోరోనా వైరస్ కూడా మనం చనిపోయినా అల్లాగే సజీవంగా నే ఉంటుందా అన్న అనూమనాలు కలిగిస్తున్నాయి. పూర్గ్టిగా వైరస్లను శాస్వతంగా నసింప చేస్తే తప్ప వైరస్ లు నసిన్చావని ఈ దిశగా వైరస్ల నివారణకు పూర్త్గిగా పరిశోదనలు చెప్పట్టాలని శాస్త్రజ్ఞులు ఆలోచిస్తున్నారు.
read moreభారత్ లో మూడో వేవ్ ముంచుకొస్తోందా?
కోవిడ్ 19 లో భాగంగా భారాత్లో మూడో వేవ్ ప్రభావాన్ని రానున్న రోజుల్లో చూడ నున్నా మా ? మూడబ విడత పిల్లల పై ప్రభావం చూపుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తుంది.భరత్ లో వచ్చిన రెండవ వేవ్ వైరస్ మ్యుతేట్ కావడాన్ని గుర్తించారు.ఈ సందర్భంగా రెండు విడతల లో జరిగిన పరిశీలనలో ముఖ్యంగా ఆర్ధికంగా చితుకి పోయిన రోజువారీ కూలీలు నిస్సహాయులుగా ఏమి చేయలేక కుంగిపోయారు.వైద్య రంగంలో సేవలు అందించే నిపుణుల కొరత ను యూర్కోన్నాము. రోగులకు మందుల కొరత,ఆసుపత్రిలో బెడల కొరత,ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేదించింది. ఇప్పటికీ రెండవ వేవ్ ప్రభావం నుండి పూర్తిగా కోలుకోమి స్థితిలో ఉన్నారు సామాన్యులు.రెండవ విడత ప్రభావం తగ్గిందని మనం ఊపిరి పీల్చుకోలేము కోవిడ్ మూడవ వేవ్ ప్రభావం కోరలు చాస్తే తట్టుకోవడం ఎలా? అందుకు తగ్గ ప్రణాళిక సంసిద్దత ఉన్నాయా అని మనల్ని మనం ప్రస్నిన్చుకోవాల్సి వస్తుంది? రానున్న రోజుల్లో మూడవ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. పెద్ద వాళ్ళ కంటే చిన్న పిల్లల్లో నే ఇమ్యునితీ తక్కువగా ఉంటుందని దీని ప్రభావం పిల్లలపైనే ఉంటుందని అంచనా. ఆరోగ్య రంగం మూడవ విడత ను ఎదుర్కునేందుకు సమాయత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతోంది ఎందుజు అంటే ప్రపంచంలో ని జనాభాలో 17. 7 శాతం ప్రజలు భారాత్లోనే ఉన్నారని ఇప్పటికీ భారత్ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బ తిన్న నేపధ్యంలో మూడవ వ విడతలో ఈ తీవ్రతను ఎదుర్కోడానికి ఎలా సమాయత్త మౌతుందని ప్రపంచదేశాలు భారాత్ ను చూస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడ్డారు.ప్రస్తుతం వ్యాక్సిన్ డ్రైవ్ లో ఉన్న భారాత్ జూన్ నాటికి 32,91,58,139 వ్యాక్సిన్ తీసుకున్నారని పిల్లల కోసం నిర్దేశించిన వ్యాక్సిన్ మూడవ విడత క్లినికల్ ట్రైల్స్ అయ్యాయి ఇక పిల్లల వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారు? పిల్లల టీకా ఎలా పనిచేస్తోంది? అలంటి ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. థర్డ్ వేవ్ మిన్చుకోస్తున్న వేల అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు రమి చేద్దామని అనుకుంటున్నాయి. రాజకీయం ముఖ్యమా పిల్లల ప్రాణాలు ముఖ్యమా? ఆగష్టు రెండవ వరం లో వచ్చేస్తోందని చెపుతున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వైద్యులు.
read moreజలుబు ఎవరికి వస్తుంది... తగ్గించుకునే సులువైన మార్గాలు
జలుబు వీలాకి మాత్రమే వస్తుంది. వాళ్ళకి రాదు అన్నది కాదు. అందరికీ వస్తుంది ముఖ్యంగా స్చూల్ కి వెళ్ళే పిల్లలకి సంవత్సరానికి 1౦ సార్లు రావచ్చు యుక్త వయస్సులో ఉండే వాళ్ళకి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు రావచ్చు నని వైద్యులు పేర్కొన్నారు. స్కూలు కు వెళ్ళే పిల్లలకి జలుబు అధికంగా రావడానికి కారణం ఏమిటి అంటే స్కూల్ లో పిల్లలు ఒక్కొకరు ఒక్కో వైరస్ లకు ఎక్స్పోజ్ అవుతారు పైగా అప్పటికీ వాళ్ళలో రోగ నిరోధక శక్తి ఇంకా ఉంటుంది.పెరుగు తున్నకొద్ది రోగనిరోదక శక్తి పరి పక్వానికి వచ్చి వాళ్ళు జలుబు వైరస్ ల దాడి ని తట్టుకోగలిగే స్థితికి వస్తారు. అసలు తేలికగా జలుబు బారిన పడే వాళ్ళు వ్యక్తులు వీళ్ళే.... తాగుబోతులు.పొగతాగే అలవాటు ఉన్నవాళ్లు. వృద్ధులు. బలహీనులు. ఉబ్బసం,బ్రోన్కైల్ ఆస్తమా ఉన్నవాళ్లు. మొదలైన వాళ్ళు అని వైద్యులు గుర్తించారు. అసలు జలుబు ఎంతకాలం ఉంటుంది?... జలుబు ఎంతకాలం ఉంటుందనేది,మనిషినుంచి మనిషికి అంటుకున్న వైరస్ ని బట్టి రోగ నిరోధక శక్తిని బట్టి.మారుతూ ఉంటుంది సాధారణంగా జలుబు 2 నుంచి 5 రోజులు ఉంటుంది. కాంప్లికేట్ అయితే వారం లేదా రెండు వారాల దాకా ఉండ వచ్చు. జలుబు లక్షణాలు... మనకు సోకే జలుబులో అధిక భాగపు జలుబు హెడ్ కొల్డ్స్ అంటే ముక్కులోకి,గొంతులోకి అంటి పెట్టుజకుని ఉంటాయి. ఇలాంటి జలుబుప్రధమ లక్షణం గొంతులోనో ముక్కులోనో చిన్నగా తిక్ల్ చేసినట్లు ఉంటుంది. తరు వాత తుమ్ములు,తరువాత ముక్కునుంచి నీళ్ళు కారడం ఉంటుంది. సాధారణంగా జలుబు వైరస్ మనకు సోకిన 1-2 రోజులకే ప్రారంభ మౌతుంది. ముక్కు లోపల తుమ్ము రాబోతున్న ఇమాజినేషన్,తుమ్ములు,నీరు కారడం,వగైరాలతో,ముక్కు లోపలికి బాక్టీరియా కూడా ప్రవేశించి వుండే పసుపు పచ్చగా చీమిడి కూడా మొదలౌతుంది. ఆ తరువాత నుంచి ఒళ్ళు నొప్పులు,జ్వరం,తలనొప్పి,ఉండోచ్చు.ఇన్ఫెక్షన్ గొంతునుంచి లోపలి ప్రవేశిస్తే గొంతులో,చాతిలో,నొప్పి బరువుగా అనిపిస్తుంది.గొంతు బొంగురు పోవడం పొడి దగ్గు మొదలైనవి ఉంటాయని సాధారణ వైద్యులు చెపుతున్నారు. దగ్గు ప్రారంభంలో పొడిగానే ఉన్న రోజులు గడుస్తున్న కొద్ది ఇబ్బందికి గురిచేస్తుంది.ముఖ్యంగా రాత్రివేళ మిమ్మల్ని రాత్రివేళ నిద్ర పోనివ్వదు.అంతే కాక మీకు రుచి వాసన తేలీ కుండా పోతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో జలుబు మరే తీవ్రమై మధ్య చెవి ఇన్ఫెక్ట్ కావడం జరుగుతుంది. సైను సైటిస్,బ్రాన్ కైటిస్,వాటికీ దారు తీయవచ్చు. అంతకు ముందు ఆస్తమా,క్రానిక్ బ్రాంకైటిస్,చెవిపోటు ఉన్న వాళ్ళు జలుబు వస్తే అంతకు ముందు ఉన్న సమస్యలు ఎక్కువ చేసి రోగిని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా జలుబు వల్ల మధ్య చెవి ఇన్ఫెక్ట్ అయినప్పుడుఅది మేనిన్గితిస్ ఎంసిఫిలిటిస్ కు దారి తీయ వచ్చు.దీని వల్ల పరిస్థితి మరింత తీవ్రమై సీరియస్ కండిషన్ ఏర్పడవచ్చు.ఒక్కోసారి అచుట్టుపక్కల భాగాలు ఇన్వొల్వె అయ్యి తల నొప్పి వంతులు మెడ పట్టేయడం వంటి సమస్యలు ఉంటాయి. జలుబు కొన్ని అపోహలు... వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది.వర్షంలో తడిస్తే జలుబు రావాలని లేదు.మీరు ఇంట్లో ఉన్న జలుబు చేస్తుంది. ఇంలో ఏమాత్రం తేమ ఉన్న జలుబు వస్తుంది వర్షం కురిసినప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారుమీ ఇంట్లో చెమ్మ వాతావరణం వేడి వాళ్ళ వైరస్ ముక్కును అంటి పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుజుంటే జలుబు చేస్తుంది... ముద్దు పెట్టుజుంటే జలుబు చేస్తుంది అన్నది 1౦ % కేసులలో ఉండవచ్చు.లాలా జాలం ద్వారా ఒకరినుంచి ఒకరికి జలుబు సోకవచ్చు. ముద్దు పెట్టుకున్నప్పుడు ముక్కులు రెండు దగ్గర అవుతాయి. చలిలో తెరిగితే జలుబు చేస్తుంది.... మనం చలిలో తరిగితే జలుబు చేస్తుంది అని అనుకుంటాం కాని నిత్యం మంచు ప్రదేసాలలో వుండే వాళ్ళకు జలుబు అంతగా సోకదు. వేడి ప్రదేశాలలో ఉండే వాళ్ళకి జలుబు బాద. జలుబును తగ్గించుకునే మార్గాలు... విటమిన్ సి,పెన్సిలిన్,యాన్తి బాయిటిక్స్ లాంటివి జలుబును తగ్గిస్తాయి.అనుకోడం భ్రమ మాత్రమే. యాంటి బాయిటిక్స్ బాక్టీరియా మూలంగా ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి ఉపక రిస్తాయి.తప్ప వైరస్ మూలంగా వచ్చే జలుబు లాంటి అస్వస్థత వద్ద యంటి బాయిటిక్స్ పప్పులు ఏవి ఉడకవు. వ్వితమింక్ మన శరీరంలో ఉండే చెత్తని బయటికి తోలే పని చేస్తుంది.జలుబును పూర్తిగా తొలగించాడు కాని వరం రోజులు ఉండే జలుబును రెండు మూడు రోజులు ఉంటుంది. వితమింక్ దగ్గడం,చీదడం లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది.ఇందుకోసం మీరు విటమిన్ సి కల టాబ్లెట్స్ వాడడం కంటే ఆరంజి, ద్రాక్ష, పళ్ళ రసాలను,తాగడం మంచిది. ఆహారం... జలుబు చేసినప్పుడు కొవ్వుగల ఆహార పదార్ధం,మాంసం,పాల ఉత్పత్తులు,తక్కువగా తీసుకోండి, తాజా పళ్ళ రసాలు కయాగూరలు ఎక్కువగా తీసుకోండి. చికెన్ సూప్... జలుబు చేస్తే కోడి కూర తినమంటూ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.వైద్య పరంగా అది సరైనదే అని అనిపిస్తుంది. ఒక కప్పు వేడి వేడి చికన్ పులుసు మీ ముకు బిరడాని తొలగించి ముక్కులో ముక్కునుంచి పలుచగా నీరు కారడం గమనించ వచ్చు. అది బహుశా కోడి కూరలో వేసిన మూలికలు నషాళానికి చేరి మీ ముక్కును శుభ్రం చేసి ఉంటాయి. ముక్కు కారడం వల్ల మీరు మాటి మాటికీ మీ ముక్కు చీదడం వల్ల మీ శరీరంలోని సూక్ష్మక్రిములు బయటకు వెళ్లి పోతాయి. ఉప్పు నీటితో పిక్కిలించండి... జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం ఉప్పునీతిని గొంతులోపోసి పుక్కులించండి.దీనివల్ల కొంత రిలీఫ్ వస్తుంది. ఆవిరి పట్టడం... ఇది మన పూర్వీకుల నుంచి ఆచరిస్తూ అస్తున్న పద్ధతి ఒక గిన్నెలో బాగా మరగ బెట్టిన నీటిని తీసుకుని అందులో కొంత విక్స్ అమృతాంజనం గాని తీసుకుని తలమీద దుప్పటి లేక టవల్ ను కప్పుకుని ఆవిరిని గట్టిగా పీల్చండి జలుబు తాలూకు ముక్కు దిబ్బడ తగ్గుతాయి. ముక్కుకు వెస్లిన్... ఇక ఆఖరుగా చీదగా చీదగా ముక్కు వొరుసుకు పోయి మంట పుడుతూ ఉంటుంది పెట్రోలియం జెల్లి ని గని వెస్లిన్ గని ముక్కు చివర పట్టించి కొంచం ముక్కు లోపలి భాగం రాసుకుంటే ఈ బాధ తప్పు తుంది. బ్రాంది,వైన్.... చాలా మందికి కొంచం జలుబు చేయగానే 3 టీ స్పూన్ల బ్రన్దీని వేడి నీళ్ళలో కలుపుకుని తాగితే కొంత రిలీఫ్ ఇస్తుంది అంటారు మందు బాబులు.
read moreఫ్లు వస్తే ఏం చేయాలి ఎలాంటి మందులు వాడాలి...
అసలు ఫ్లు వస్తే ఎలా ఉంటుంది ఎలాంటి బాధ పడతారు అన్న విషయాలు తెలుసుకుందాం. జరీ కింద పది నలిగి పోయినట్టు గా బాధ పడుతున్నారా?జ్వరం వచ్చి ఇక చచ్చిపోతనేమో అన్నంత గా భయ పడిపోతున్నారా?ఇప్పుడు పడుతున్న బాధకంటే చచ్చిపోయినా బాగుండు నని అనుకుంటున్నారా? తల పోటుగా ఉండడం కండరాలు గుంజుతున్నట్టుగా ఉందా?నుదురు మంటల్లో కాలిపోతున్నట్టుగా ఉంటుందా? అయితే అది ఫ్లు వైరస్ అని మీరు గ్రహించాలి.తగ్గి పోయే అంతవరకూ అది మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. అమెరికాలో సంవత్సరానికి 1౦3మిలియన్ల ప్రజలు ఫ్లు బారిన పడుతూ ఉంటారు.72 వేల మంది రోగులు ఉండడం ఆసుపత్రిలో చేరుతూ ఉండడం గమనించవచ్చు అలాగే అమెరికాలో ఫ్లు,నిమోనియా తో 69,౦౦౦ మంది మరనిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫ్లూ చాలా నెమ్మదిగా అమ్మయకంగా వస్త్ఝుంది.ఒళ్ళంతా కొద్దిపాటి నొప్పులు ప్రారంభమై,కొద్దిగా తల నొప్పి,గొంతునొప్పి వస్తుంది.కొన్ని గంటల తరువాత చలి ప్రారంభమై జ్వరం,దగ్గు,శరీరం లాగుతున్నట్లు అంటే గుంజినట్లుగా,కీళ్ళ నొప్పులు వచ్చి మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే అది ఫ్లూ అని చెప్పవచ్చు.. అసలు ఫ్లూ ని ఎలా చూడాలి ఫ్లూ ని వెయ్యి తలలు ఉన్న రాక్షసిగా చూడాలని అంటున్నారు వైద్యులు. ఇంఫ్లూయేన్ జా లో మూడు రకాల వైరస్లు ఉన్నా ప్రధమికం గా ఎ,బి,సి అనే మూడు రకాలే ఉన్న అవి ఒకదానికి ఒకటి కలగలిపి అనేక రూపాల కింద రూపాంతరం చెందుతుంది.అలాగని ఈఏడు వైరస్ ల కంటూ టీకా తీసుకున్నప్పటికీ ఫ్లూ వచ్చి మీమీద దాడి చేసే మిమ్మల్ని మీ శరీరాన్ని బలహీనం చేసే అవకాసం ఉంది. ఫ్లూ వచ్చినప్పుడు యాంటీ బాయిటిక్స్ తీసుకున్న లాభంలేదు.వైరస్ మూలంగా వచ్చే ఫ్లూ యాన్టి బాయిటిక్స్ పనిచేయవు. ఫ్లూ కు మీరు వేరే మందులు వాడాల్సిందే. ఫ్లూ వచ్చినప్పుడు ఎలాంటి జగత్తలు తీసుకోవాలి... ఫ్లూ వచ్చి నప్పుడు ఇంట్లో ఉండండి.ఫ్లూ ఒకళ్ళ నుండి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి.ఫ్లూ వచ్చినప్పుడు ఆఫీసుకి వెళ్లి పనిచేసే ప్రయత్నం చేయకండి.మీవల్ల మిగతా వాళ్ళకు సోకే ప్రమాదం ఉంది. ఫ్లూ తగ్గే దాకా ఇంట్లోనే ఉండండి.జ్వర, సాధారణ స్థితికి వచ్చేదాకా కొన్ని రోజులు ఆగండి.ఒక వేళ మీపిల్లలకు ఫ్లూ వస్తే ఫ్లూ పూర్తిగా తగ్గే దాకా వాళ్ళను స్చూలుకు పంపకండి. ఫ్లూ వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకోండి... ఫ్లో వచ్చిన వ్వల్లలో పూర్తిగా జ్వరం అలసట నీరసం ఉంటుంది కాబట్టి.మంచం మీదే రెస్ట్ తీసుకోండి.శరీరానికి రెస్ట్ ఇవ్వడం వల్ల మీ శరీరం తన శక్తిని కూడా గట్టుజుని ఫ్లూ ఇన్ఫెక్షన్ పై పోరాడేందుకు వినియోగిస్తుంది మీరు కదులుతూ మీరు ఎదో ఒక వ్యాపకం లోకి వెళ్ళారంటే మీరు పూర్తిగా నీరసించిపోయి ఉండడం వల్ల మీశరీరంలో డిఫెన్స్ మెకానిజం బలహీనపడి తీవ్ర సమస్యలకు దారి తీయవచ్చు. ఆహారం లో ఏమితీసుకోవాలి... ఫ్లూ జ్వరం తో బాధ పడేవారు డీ హైడ్రేషన్ కు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత ఎక్కువగా ద్రవ ఆహారాన్ని తీసుకోవాలి.మీరు ఘన ఆహారాని తీసుకున్న సహించదు.ద్రవ ఆహారం మీకు పోషక శక్తిని ఇస్తుంది. ఆహారంలో పల్చటి సూపులు,పళ్ళు,వెజిటేబుల్ రసాలు,అంటే ముఖ్యంగా బీట్రూట్,క్యారెట్ రసాలు,విటమిన్లు,ఖనిజ లవణాలు ఉండే ద్రవాలు తీసుకోవాలి. సగం జ్యుస్ కి అంతే నీళ్ళు కలిపి రుచికోసం కొంచం పంచదార కలుపుకోవచ్చు.పంచదారను ఎక్కువగా కలిపితే జ్వరంలో అది విరేచనాలకు దారి తీస్తుందిపంచదారను కొంచం గా మాత్రమే తీసుకోవాలి. శరీరం పూర్తిగా బలహీన పడి ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే... ఆస్ప్రిన్,నైస్,ఇబుప్రోఫెన్,లాంటి మందులుఫ్లూ తో పాటు వచ్చే మందులు తలనొప్పి,ఒల్లునోప్పులను తగ్గిస్తాయి.అది డాక్టర్ సూచన మేరకే వాడాలి. ఫ్లూ లక్షణాలు మధ్యాహ్నం,సాయంత్రము,ఎక్కువగా కనిపిస్తాయి.అందుకు డాక్టర్లు ఈ మందులను నాలుగు ఘంటలకి ఒకసారి వేయమని చెబుతారు.సొంత వైద్యం చేసుకోడం అనర్ధం. గమనిక అస్ప్రిన్ మందును పిల్లలకు ఇవ్వకూడదు.దీ ని వల్ల నరాల సంబందిత వ్యాధితో బాధ పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇష్టమొచ్చిన మందులు వాడవద్దు... ఫ్లూ తో బాధ పడుతున్నప్పుడు జలుబుకు సంబందించి మనకు తెలిసిన టాబ్లెట్స్ ను వాడవద్దు.లేక మందుల షాపు లో వాళ్ళు ఇచ్చిన మందులు వాడవద్దు.అలాంటి మందు వల్ల కొన్ని లక్షణాలు తొలగి పోయి,తాత్కాలికంగా ఫ్లూ తగ్గినట్టు అనిపిస్తుంది.కానీ మళ్ళీ తిరగ బెట్టి సీరియస్ సీరియస్ అయ్యే అవకాసం ఉంది ఉప్పు నీటిన్ పుక్కిలించండి... ఫ్లూ సోకినప్పుడు గొంతు పొడి ఆరి పోయి నట్లు ఉంటుంది.స్పూను ఉప్పునునీళ్ళలో కలిపి గార్లింగ్ చేస్తే కొంత రిలీఫ్ ఉండవచ్చు. అయితే ఆనీటిని మింగకూడదు. ఉప్పు లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మింగాక పోవడమే మంచిది. వేడి కాపడం పెట్టుకోవాలి... ఫ్లూ తో వచ్చే ఒళ్ళు నొప్పులకు అలసట అధికంగా ఉంటుంది.ఈ నొప్పులనుంచి కాస్త ఉపసమనం కోసం వేడి కాపడం ఉపయోగ పడుతుంది. తాజా గాలి తీసుకో డం ముఖ్యం... రోగి ఉన్న గదిలోకి తాజా గాలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసికోవాలి.అయితే చలివేయకుండా వెచ్చటి పక్క బట్టలను అమర్చుకోవాలి. వెన్ను నిమరడం చేయాలి... ఫ్లూ తో బాధ పడే వ్యక్తులు ఎవరైనా మృదువుగా మసాజ్ చేయించుకున్నట్లుగా ఎవరితో ఐనా వెన్ను నిమిరించుకుంటే ఆవ్యక్తిలో రోగ నిరోధక యంత్రాంగం యాక్టివ్ అయ్యి ఫ్లూతో పోరాడేందుకు తయారు అవుతుంది. తేలిక పాటి ఆహారం తీసుకోవాలి... ఫ్లూ రోగులకు ఆకలి ఉండదు కాని ఫ్లూ తగ్గు ముఖం పడుతూ ద్రవ ఆహారం నుంచి ఘన ఆహారం తీసుకుంటునప్పుడు పేషంట్ తీసుకునే ఆహారం చాలా తేలికగా జీర్ణ మయ్యేడిగా ఉండాలి.బ్రెడ్ పాలు మెత్తటి వరిడాక్టర్ సూచించిన విధంగా తీసుకోవాలి.
read moreకోవిడ్ కేసుల పెరుగుదలతో భయం పట్టు కుందా?
కోవిడ్ కేసులు పెర్గుతూ ఉండడంతో ఆసుపత్రులకు భయం పట్టుకుంది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్యాన్డమిక్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కోవిడ్ రోగుల శాతం గణనీయంగా పెర్గుతూ ఉండడం తో శరీరంలో ఒళ్ళు నెప్పులు, జ్వరం,లంగ్ ఫైబ్రోసిస్,పల్మనరీ ఎంబాలిజం,బ్రెయిన్ ఫాగింగ్ వంటిసమస్యలతో అవుట్ పేషెంట్ రోగులుగా వస్తున్నారని డాక్టర్స్ తెలిపారు. చాలామందిలో మానసిక సంబందమైన సమస్యలు యాంక్జైటీ,ఒత్తిడి,కంఫ్యుషన్. హై బిపి,జ్ఞాపక శక్తినికోల్పోడం,కొత్తగా డయాబెటిస్,వంటి సమస్యలతో రోగులు వస్తున్నట్లు తెలిపారు.మూడునెలల కాలంలో 99౦ రోగులలో 31.8%రోగులు పోస్ట్ కోవిడ్ రోగులు కావడం విశేషం.11% మందిలో కోవిడ్ లక్షణాలు ఇంకా ఉన్నాయని,9-నుండి12 నెలలలో అలసట 12.5%మైలోరియా 9.3%ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉన్న రోగులు ఉన్నారు.డిల్లి లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సాకేత్ తెలిపారు. కోవిడ్ లక్షనాలు లేని వారు కూడా దీర్ఘకాలిక కోవిడ్ సమస్యలు గుర్తించామని.మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి డైరెక్టర్ డాక్టర్ వివేక్ నంజియా అన్నారు. వీరు ఎక్కువగా కళ్ళు, ఇతర అవయవాలపై ప్రభావం ఉందని తేల్చారు.చాలా కేసులను పరిశీలించిన మీదట వైరస్ దీర్ఘకాలంగా కొనసాగే అవకాసం ఉందని. వైరస్ నుండి బయట పడ్డ తరువాత కూడా సమస్యలు వస్తున్నాయని పూనా జూపిటర్ ఆసుపత్రికి చెందిన మహేంద్ర డడ్కే అన్నారు.పోస్ట్ కోవిడ్ లో న్యూరో వైడైటరీ లక్షణాలు డిప్రెషన్,ఒత్తిడి,యాంక్జైటీ,బ్రెయిన్ ఫాగ్,నిద్రలేమీ. ఊపిరి పీల్చుకోలేక పోవడం వంటి సమస్యలతో వస్తున్నారనిముఖ్యంగా వారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తరువాత వచ్చిన సమస్యలుగా పేర్కొన్నారు.ఏది ఏమైనా ఇతర అవయవాల ను నాశనం చేయలేదని ఐ సి యు లో ఉన్నవారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నవారే నని తేల్చారు. ఒక్కోసారి కోవిడ్ నెగెటివ్ వచ్చిన ఐ సి యు లో ఉండేవారని నిమోనియా తదితర సమస్యలు వారిని వేదిస్తున్నట్లు గుర్తించామన్నారు.
read moreతల నొప్పికి మసాజ్ దేరఫీ...
మసాజ్ చేయడం మూలంగా టెన్క్షణ్ తో ఉన్న కండరాలు వదులు అవుతాయి. తల వెన్నెముక భాగంలో మసాజ్ చేస్తే మిమ్మల్ని వేదిస్తున్న తల నొప్పి పోతుంది. 1 ఈ మసాజ్ ని మీకు మీరు కాకుండా వేరే వాళ్ళు చేస్తే మీరు రిలాక్స్ కాగలుగు తారు. 2 మసాజ్ చాలా మృదువుగా చిన్న చిన్న వర్తులకారపు పద్దతిలో మాజ్ చేస్తూ పోవాలి. ఒక్కో పాయింట్ వద్ద కనీసం 7 సెకండ్ల పాటు ఉండాలి.వేళ్ళ కొనలతో నుదురు పై భాగాన మధ్య పాపిడి ప్రారంభ భాగాన ముందు మసాజ్ చేయాలి.మధ్య పాపిడి పొడవునా దాకా మస్సాజ్ చేస్తూ పోవాలి. నుదుటికి ఇరు వైపులా పక్క పాపిడి భాగంలో మధ్య పపిడికి సమాంతరంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత చిన్న చిన్న వర్తులాకార పద్దతితో మీ అరచేతులతో తలకు రెండు వైపులా మసాజ్ చేయాలి.ఇప్పుడురెండు బొటన వేళ్ళ తోను తలకు రెండు వైపులా మెడ పైన మాడుకు కింది భాగాన మసాజ్ చేయాలి. ఆతరువాత రెండు చూపుడు వేళ్ళ తోనూ తలకు అటు ఇటూ వైపు భాగాలలో మసాజ్ చేయాలి. ఇపుడు మొహాన్ని నెమ్మదిగా పైకి ఎత్తి బొటన వేళ్ళతో గానీ లేదా నాలుగు వేళ్ళతో గాని రెండు చేతులతో మసాజ్ చేయాలి.ఇక చివరికి వీపు భాగంలో వద్ద మసాజ్ చేయడం ద్వారా మీరు చేస్తున్న మసాజ్ కార్యక్రమం పూర్త్గి అవుతుంది.అది మీ తల నొప్పికి మసాజ్ ట్రై చేయండి మీనోప్పి గాయప్.
read moreపక్షవాతంతో జీవితం ముగిసినట్టేనా?
కన్ను మూసి తెరిచే లోగా జరిగి పోతుంది.క్షణ కాలంలో మీ జీవితం మారిపోతుంది. అసలు పక్షవాతం అంటే--మెదడు లోపలి ధమనుల ద్వారా మెదడుకు వెళ్ళే రక్త ప్రవాహానికి ఆకస్మికంగా ఆటంకం కలగడమే పక్ష వాతం అని అంటారు. మీరు మాట్లాడే శక్తినికోల్పో వచ్చు,ఆలోచించగలిగే శక్తిని కోల్పో వచ్చు.కాలు చెయ్యి పడిపోవచ్చు అదేపక్షవాతం పక్ష వాతాన్ని వైద్య పరిభాషలో అపోప్లేక్టిక్ స్ట్రోక్ అంటారు. అమెరికాలో మనుష్యుల్ని మృత్యువు దగ్గరికి చేరుస్తున్న ప్రమాద కర జబ్బులలో గుండె జబ్బులు క్యాన్సర్,తరువాత పక్ష వాతం మూడో స్థానం లోకి వస్తుంది. అమెరికాలో ప్రతిసంవత్సరం షుమారు అరమిలియను మందికి పక్షవాతం బారిన పడుతున్నారని ఒక అంచనా.వాళ్ళలో లక్షా యాభై వేలమంది కి పైగా మృత్యు వాత పడుతున్నారు.బతికి ఉన్నవాళ్ళు కూడా ఎదో ఒక శారీరక లోపంతోజీవిస్తున్నారని తెలుస్తోంది. మాటపడిపోవడం.దృష్టిలోపం,జ్ఞాపకశక్తి,లేకపోవడం లేదా శరీరలో ఒక పక్క ఎదో ఒక భాగం చచ్చుబదిపోవడం లాంటి ఎదో ఒక అవలక్షణం తో జీవితాన్ని వెళ్ళ దీస్తున్నారు. పక్షవాతం అంటే ఏమిటి? డాక్టర్స్ దీనిని సెలబ్రెల్ ఎమర్జెన్సీ కింద చెబుతారు. సెలేబ్రెల్ అంటే మెదడు అర్ధం ఏమర్గెంచి అంటే ఆకస్మికం అని అర్ధం లేదా అకస్మాత్తుగా వచ్చిందని అర్ధం. మెదలోపలి ధమనుల ద్వారా మెదడుజు వెళ్ళే రక్త ప్రవాహానికి ఆకస్మికంగా ఆటంకం కలగడమే స్ట్రోక్ పక్షవాతం. రక్త ప్రవాహానికి ఆటంకం కలగాదమనేది ధమనిలోని ఎదో భాగాన రక్తం గడ్డకట్టడం బ్లడ్ క్లోట్ మూలంగా కావచ్చు. లేక దమని చిట్లడం మూలంగా ను కావచ్చు. దమని ద్వారా మెదడుకు వెళ్ళే రక్తం మెదడుకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను అందిస్తుంది.మెడకు రక్త సరఫరా ఆగిపోగానే ఆక్సిజన్ సరఫరా కూడా ఆగిపోతుంది.ఆక్సిజన్ సరఫరా లేక పోయేసరికి మెడకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది.అపుడు మెడకు చెందిన విలువైన కణజాలం నసిన్చిపోతాయి.లేక సీరియస్ గా డ్యామేజ్ అవుతాయి. ఈ డామేజ్ జరగడానికి కేవలం నాలుగు లేదా ఐదు నిమిషాలు చాలు అంతే. మెడకు వెళ్ళేసరఫరా కి నాలుగు ఐదు నిమిషాలు అవరోధం ఏర్పడితే చాలు పక్ష వాతం వచ్చేస్తుందన్న మాట. ఇలా డామేజ్ అయిన మెదడు కణాలు మీ ఎడమ చేతిని పని చేయించేవి అయితే మీ ఎడమ చేయి పడిపోతుంది. జ్ఞాపక శక్తిని కొంత్రోల్ చేసేవి అయితే జ్ఞాపక శక్తిని కోల్పోతారు.ఒకవేళ మెదడు తాలూకు అత్యధిక కణజాలం నశిస్తే అమనిశే చనిపోతాడు. ఆకస్మికంగా రక్త సరఫరా ఆగిపోవడం స్ట్రోక్ అనేది అప్పటికిఅప్పుడు ఆరోగ్యంగా ఉన్న దమనుల లో ఏమి ఆగదు. ఏళ్ల తరబడి డ్యామేజ్ అయిన ధమనులలో మాత్రమే జరుగుతుంది. స్ట్రోక్/లేదా పక్షవాతం ఎలా ఏర్పడుతుంది.--ఎన్నిరకాలు ---- సేలేబ్రెల్ త్రంబోసిస్---- మెడకు వెళ్ళే రక్త నాళాలలో ఎక్కడో ఒక చోట రక్తం గడ్డ కడుతుంది.ఇలా రక్తం గడ్డకట్టడాన్ని బ్లడ్ క్లోట్ అంటారు దీనిని వైద్య పరిభాషలో త్రోమ్బోస్ అంటారు.క్రమేణా ఈ క్లోట్ పెద్దదై రక్తాన్ని పూర్తిగా మూసేస్తుంది. --- రక్తనాళాలలో ఏర్పడ్డ త్రోమ్బోస్ ని ప్రారంభంలోనేగుర్తిస్తే రక్తనాళాన్ని పూర్తిగా మూసేయకుండా ఉండే విధంగా ఉండడానికి తగిన మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. సెలబ్రల్ ఏమ్బాలిజం... మరేదో శరీరం నుండి కొట్టుకు వచ్చిన రక్తపు గడ్డ లేదా నరేదైనా ముక్క గాని ఉంటె దానిని ఎమోలుస్ అంటారు.మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనిలో ఇరుక్కుపోయి రక్త సరఫరాకి ఆటంకాన్ని కలిగిస్తుంది. సెలేబ్రల్ హేమరేజ్... మెదడుకు రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్తనాళం ఏదైనా చిట్లి నప్పుడు ఆ ప్రాంతం నుండి రక్తం బయటకు చిమ్మి లీక్ అవుతుంది. ఏదైనా ట్యూమర్ లాంటిది మెదడుకు రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్త నాళాన్ని అదిమి పెట్టి నప్పుడు ఆ నాళం మూసుకుపోయి మెడకు వెళ్ళే రక్తం ఆగిపోతుంది.ఈ నాలుగు సందర్భాలలోనూ వ్యక్తికి పక్ష వాతం వచ్చే అవకాసం ఉంది.
read moreయాంటీ బాయిటిక్స్తో జాగ్రత్త...
యాంటీ బాయిటిక్స్ తో కొలట్రాల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం నిపుణుల హెచ్చరిక. యాంటి బాయిటిక్స్ వల్ల కాలాన్ క్యాన్సర్ వచ్చే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తునారు. 5౦ సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు.ఇటీవలి కాలం లో యాంటీ బాయిటిక్ మందుల వాడకం విపరీతంగా పెరిగింది. యాంటీ బాయిటిక్స్ అదే పనిగా వాడారో ఆరోగ్యసమస్యలు తప్పవని అవి మరింత తీవ్రంగా ఉంటాయని.అయితే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటి బాయిటిక్స్ సహాయ పడతాయి.ఏది ఏమైనా అనారోగ్య సమస్యల పైన శాస్త్రజ్ఞులు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. ఒక నూతన పరిశోదన ప్రకారం యురోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ వరల్డ్ కాంగ్రెస్ 2౦21 గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ క్యాన్ సర్ పై నిర్వహించిన సదస్సులో ఈ అంశం చర్చించారు. ప్రత్యేకంగా 5౦ సంవత్సరాలలోపు కాలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అనవసరమైన యాంటి బాయిటిక్స్ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని పరిశోదన వెల్లడించింది. యాంటి బాయిటిక్స్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగ పడతాయి.ఏది ఏమైనా యాంటీ బాయిటిక్స్ అతిగా వాడితే దీనిఫలితం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. యాంటీ బాయిటిక్స్ అనవసర వాడకం... సిడి సి ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ఇన్ఫెక్షన్లకు యాంటీ బాయిటిక్స్ ఉపయోగ పడతాయి,కాని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు వాడడాన్ని గమనించవచ్చు.ఇన్ఫెక్షన్స్ పై ప్రభావ వంతంగా పనిచేసిన యాంటి బాయిటిక్స్ వైరస్ ల పై పని చేయవని నిపుణులు తేల్చి చెప్పారు. యాంటీ బాయిటిక్స్ ఎల్లప్పుడూ తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదు.కొన్ని సందర్భాలాలో మాత్రమే వాడాల్సి ఉంటుంది కొన్ని సర్ర్లు శరీరం దానికదే ఇన్ఫెక్షన్ ను తగ్గించుకుంటుంది.అనవసరంగా యాంటీ బాయిటిక్స్ జాతీయ,అంతార్జాతీయ స్థాయిలో యాంటీ బాయిటిక్స్ వాడకం పెరగడం పై సి డి సి తీవ్రంగా పరిగణించింది. యాంటీబాయిటిక్స్ ను చాలా జాగ్రత్తగా వాడాలని,యాంటీ బాయిటిక్స్ వాడకం నివారించడం ద్వారా దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దుష్పరిణామాలు నివారించవచ్చు.నని సిడి సి తెలిపింది. ప్రజాలు విచ్చల విడిగా వాడడం వల్ల క్లోస్టిదిఒ దీఫ్ఫిసిల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఇన్ఫెక్షన్ల రకాలను యాంటి బాయిటిక్స్ నియంత్రిస్తుంది.నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ హెల్త్ యాంటి బాయిటిక్స్ బ్యాక్తీరియాను చంపడానికి ఉపయోగ పడుతుంది. గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ ట్రాక్ సమస్యలు తీవ్రత ఉన్నందున యాంటి బాయిటిక్స్ వాడకంలో సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేసారు.అవసరం లేని యాంటీ బాయిటిక్స్ ఓపి లోనే 3౦%ఉంటున్నాయని యు ఎస్ వెల్లడించింది.ఎమొరీ విశ్వ విద్యాలయానికి స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ మైఖేల్ వుడ్ వర్త్ సహాయ ప్రొఫెసర్ ఇన్ఫెక్షియస్ దిసేఅజేస్ అట్లాంటా మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. ఆరోగ్యాన్ని అందించేవారికి యాంటీ బాయిటిక్స్ వాడకం పెద్ద సవాలుగా నిలిచింది.యాంటి బాయిటిక్స్ వాడకం పై లాభాలు,నష్టాలు దుష్పరిణామాలు ఉన్నాయని యన్టీ బాయిటిక్స్ అంతార్జాతీయ ప్రాధాన్యత వల్ల టాక్సీ కేంట్స్ తగ్గి పోతాయి.ఎంపిక చేసిన యాంటీ బాయిటిక్స్ తట్టుకోగలిగిన యాంటీ బాయిటిక్స్ వాడాలి. కొలట్రాల్ క్యాన్సర్ పై ప్రభావం... అమెరికన్ క్యాన్సర్ సొసైటి చర్మ సంబంద క్యాన్సర్ను నిరోదించింది.అమెరికాలో అతి పెద్ద క్యాన్సార్లలో కొలట్రాల్ క్యాన్సర్ గా గుర్తించింది.కొలట్రాల్ క్యాన్సర్ ఇటీవలి కాలంలో తగ్గు ముఖం పట్టాయి. 64 సంవత్సరాల్ లోపు వారిలో కొలట్రాల్ క్యాన్సర్లు పెరిగి నట్టు గుర్తించారు.అయి తే ముఖ్యంగా యువతీ యువకులలో కొలట్రాల్ క్యాన్సర్ వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.ఈ విషయాన్ని క్యాన్సర్ జర్నల్ లో ప్రచురించారు. కోలాట్రాల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ను 45-5౦ సంవత్సరాల మధ్య తప్పనిసరిగా చేయించాలని సూచించింది. కొలట్రాల్ క్యాన్సర్ను ప్రాధమిక స్థాయిలో గుర్తించిన పక్షంలో నివారించవచ్చని అభిప్రాయ పడింది. క్యాన్సర్ నివారణ పై దృష్టి పెట్టాలి... కొలట్రాల్ క్యాన్సర్ మరణాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.క్యాన్సర్ మరణాలలో కొలట్రాల్ క్యాన్సర్ 2 వ స్థానం లో ఉంది. శరీర వ్యాయామంలేకపోవడం,అతిగా మద్యం సేవించడం,పొగాకు వాడకంవల్ల కొలట్రాల్ క్యాన్సర్ కు కారణాలుగా గుర్తించారు.కొలట్రాల్ క్యాన్సర్ లో వైద్యం లో లేని మరో జబ్బు అతని వయస్సు,లేదా కుటుంబ చరిత్ర,జనటిక్స్ వల్ల ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్,వంటి కారణాలు గా చెప్పారు ఈలక్షణాలు ఉన్నవారు సత్వరం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తేల్చారు.కొలట్రాల్ క్యాన్సర్ పై ఇంకా పోర్తిగా తెలియాల్సి ఉంది.కోలాన్ క్యాన్సర్ యాంటి బాయిటిక్స్ పై పూర్తి పరిశోదనలు చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.
read moreఇన్సులిన్ వాడకంలో జాగ్రత్తలు
డయాబెటిస్ మందులతో కట్టడి చేయలేక పోతే డాక్టర్ సూచించిన విద్జంగా ఇంసూలిన్ తప్పనిసరిగా వాడాల్సిందే ఇంసూలిన్ ఇంజక్షన్న్ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ఆయా రోగుల లక్షణాలు వ్యక్తిగత అవసరాన్ని బట్టి ఉంటుంది.ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న అంశాన్ని డాక్టర్స్ సూచిస్తారు. రక్తంలో చక్కెర శాతం పడిపోయి హై పో గ్లై సీమియా రాకుండా రాకుండా ఉండటానికి అంటే బ్లడ్ షుగర్ ను తగిన విధంగా నియంత్రణలో ఉంచుకోడం కోసం మే ఇంసూలిన్ ఇంజక్షన్ తీసుకుంటారు. వీటిలో మూడురకాల ఇంసూలిన్ లు ఉన్నాయి.1)సోలుబ్లె2 )ప్రోటామిన్3)ఇన్సులిన్ జింక్ సస్పెంసాస్ ఇంజక్షన్ ద్వారా ఇంసూలిన్ ని ప్రవేశ పెట్టినప్పుడు అది శరీర కాణా లలోకి గ్లూకోజ్ ద్వారా శరీరానికి అవసరమైన శక్తి అందే విధంగా చేస్తుంది.చాలా మందికి పేషంట్ లకు రోజుకు ఒక ఇంజక్షన్ సరిపోతుంది. ఇంకొందరికి రోజుకు రెండు తీవ్రతను బట్టి రోజుకు 3నుండి 4 డోసులు కూడా ఆహారానికి ముందు అవసర మౌతాయి.ఎన్నిసార్లు తీసుకోవాలి ఎంతతీసుకోవాలనే దానిని డాక్టర్స్ నిర్ధారిస్తారు. ఇన్సూలిన్ ఇన్జేక్షన్ వాడకంలో జాగ్రత్తలు----- ఇన్సూలిన్ ని చల్లటి ప్రదేశంలో ఉంచాలి.రేఫ్రేజి రేటర్ లో మంచు తయారయ్యే డీప్ గ్రీజేర్ లో మాత్రం ఉంచకూడదు. ముఖ్యంగా పలుకులు,పలుకులు గా కనిపించే మకిలి పట్టిన ఇంసూలిన్ ను కొనవద్దు. శరీరంలో ఇంజక్షన్ చేసే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఇంజక్షన్ భోజనానికి 2౦-3౦ నిమిషాలు ముందు తీసుకోవాలి.ఇంజక్షన్ బాటిల్ పైన లేబుల్ ని చెక్ చేయాలి.ఇంసూలిన్ బోటిల్ పైన ఎక్స్ పైరీ డేట్ ను కూడా గమనించాలి. స్వంతంగా ఇంజక్షన్ చేసుకోడానికి నేర్చుకోవాలి.వివిధ సమయాలలో మీ బ్లడ్ షుగర్ ను పరీక్ష చేసుకునే విధానాని కూడా నేర్చుకోవాలి. మీరు తీసుకునే ఇన్సూలిన్ డోసేజ్ షెడ్యుల్ ని బట్టి మీరు ఎప్పుడు భోజనం చేయాలి,ఇతరా లేదా శారీరక పనులు మొదలైన వాటి మధ్య సమన్వయం ఉండాలి.ఒక చిన్న డైరీ ని రాయడం అలవాటు చేసుకోవాలి అందులోమీరు ఇంజక్షన్ చేసుకున్న తేది,టైం,బ్లడ్ గ్లూకోజ్,ఎమన్నా రీయక్షన్ వచ్చిందా అయితే అది ఎ రకమైన రియాక్షన్ గురించిన వివరాలు ఉండడం మంచిది. ఇంజక్షన్ ని ఎలా చేయాలి------ మీరు తీసుకునే పరిణామం లో డాక్టర్ సూచించిన విధంగా సిరంజ్ లోకి తీసుకోవాలి. ఇంజక్షన్ ని మీ శరీరంలో కండరం లోకి లేక కొవ్వు ఉన్న భాగానికి ఇంజక్ట్ చేసుకోవాలి. సామాన్యంగా కొవ్వు ఉన్న భాగాలలో కి చేసుకోడం సులువుగా ఉంటుంది. చాలా మంది భుజాలు, తొడలు, పొత్తికడుపు, పిర్రలు, మొదలైన భాగాలలో చేసుకోవాలి ఆభాగం చర్మం మొద్దు బారిపోకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ఇంజక్షన్ చేసే ప్రాంతాన్ని మ్సరుస్తూ ఉండాలి. ఇంజక్షన్ చేయబోయేభాగాన ఆల్కాహాల్ లో ముంచిన దూదితో శుభ్రం చేయాలి. బొటన వేలు మిగతా వ్రేళ్ళ మధ్య ఇంజక్షన్ చేయబోయే భాగాన్ని పట్టుకుని పెన్సిల్ ను పట్టుకునే విధంగా సిరంజిని రెండు చేతి వేళ్ళ మధ్య పట్టుకుని సూదిని నిటారుగా చర్మంలోకి గుచ్చాలి. తర్వాత సిరంజి పలున్గేర్ ని కిందకి నొక్కాలి ఇప్పుడు వెల్ల మధ్యా పట్టుకున్న చర్మాన్ని వదిలేసి సిరంజిని పైకి లాగాలి.
read moreభారత్లో ప్రతిఏటా 7 లక్షల మరణాలు లాన్ సెట్ జర్నల్ లో వెల్లడి...
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణలో చోటుచేసుకుంటున్న వాతవరణ మార్పులు వాళ్ళ అసమాన ఉష్ణోగ్రతలు పెరగడం,అలాగే అతిశీతల వాతవారంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని లన్సేట్ హెచ్చరించింది. 2౦౦౦ -2౦19 సంవత్సరంలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరిగి పోయాయని ఇది గ్లోబల్ వార్మింగ్ గా నిపుణులు పేర్కొన్నారు. సంవత్స రంలో 7,4౦,౦౦౦ మరణాలు కేవలం భారాత్లో చోటు చేసుకోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నిపుణులు స్పష్టం చేసారు. వాతావరణంలో మార్పుల వల్ల వేడి,అతి సీతలం గా ఉండడం వల్లే మరణాలు పెర్గుతున్నాయని లాసెట్ ప్లానెట్ హెల్త్ జర్నల్ లో ప్రచురించిన నివేదికలో వెల్లడించింది. మొనాష్ విశ్వ విద్యాలయం,ఆస్ట్రేలియాలో ప్రపంచ వ్యాప్తంగా 5 మిలియన్ల ప్రజలు మరణించారని వాతావరణంలో మార్పుల వాళ్ళ భారత్ లో6,55,4౦౦ అధిక ఉస్నోగ్రతాల వల్ల83,7౦౦ గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.2౦౦౦ నుండి 2౦19 ప్రపంచంలోని వాతావరం లో మార్పులు వచ్చాయని ఒక దశాబ్దం లో ౦.26 డిగ్రీ ల సెల్సియస్ గా నమోదు కావడాన్ని అధయన బృందం పరిశీలించింది. ప్రపంచ వ్యాప్తంగా 9.43 మరణించారని ఆధ్యనంలో లో వెల్లడించారు.అంటే ప్రతి1౦,౦౦౦ మంది ప్రజలలో 74 మంది అదనంగా ఉంటున్నారని అది అతి చల్లదనం వల్ల చనిపోవాదాన్ని మనం గమనించవచ్చు. దీర్ఘ కాలంలో వాతావరణంలో మార్పులు మరణాలు మరింత పెరగవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పు యూరప్,సహారా ఆఫ్రికా,అత్యధిక వేడి,శీతల ప్రాంతాలు ఉండడం వల్ల అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని లాస్ సెట్ జర్నల్ లో ప్రచురించారు. ఆశియలో ముఖ్యంగా తూర్పి దక్షిణ యూరప్ లో 1౦,౦౦౦ మంది అధిక ఉష్ణోగ్రతల మరణించారు. సహారా ఆఫ్రికాలో 1౦,౦౦౦ మంది అధిక శీతల వాతావరణంవల్ల మరణించారు.43 దేశాల నుండి సేకారించిన డాటా ఆధారంగా వివిధ రకాల వాతావరణాలు,సామాజిక,ఆర్ధిక,భౌగోళిక అంశాల ఆధారంగా వివిదరకాల మౌలిక వసతుల కల్పన ప్రజా ఆరోగ్యం సేవలు పర్గానలోకి తీసుకున్నామని నిపుణులు లా సెట్ జర్నల్ లో పేర్కొన్నారు.
read moreజికా వైరస్ అత్యంత ప్రమాదకరం అప్రమతంగా ఉండాలని హెచ్చరిక...
డెల్టావేరియంట్ కన్నా,డెల్టా ప్లస్ కన్నా అత్యంత ప్రమాదకరమైన వైరస్ గా జికా వైరస్ ను పేర్కొన్నారు.తొలుతభారత్ లో కనుగొన్న జికా వైరస్ లోకల్ వైరస్ గా పేర్కొన్నారు.జికా వైరస్ ల కన్నా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తునారు.ప్రస్తుతం వర్షాకాలం ఉన్నందున జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉబ్తుందని న్నిపునులు అంచనా వేస్తున్నారు.కేవలం వెక్టర్ దోమ వల్ల వ్యాపిస్తుందని,అందుకే దీన్ని వెక్టర్ జోన్ డిసీజ్ గా పేర్కొన్నారు.దీని లక్షణాలలో ముఖ్యంగా జ్వరం,శరీరమంతా దద్దుర్లు,జాయింట్స్ కీళ్లలో నొప్పులు కండరాలలో నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు.ఒకరకంగా చెప్పాలంటే చుకున్ గునియా,డెంగ్యు,ఇపుడు జికా ముఖ్యంగా కాళ్ళు కీళ్లలో నిసత్తువ వచ్చి కీళ్లలో ముణుకులు,మోచిప్పలలో తీవ్రమైన నొప్పి,అనొప్పి శాశ్వతంగా మారిపోయే అవకాసం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జికా ఎయిడిన్ ఈజిప్ట్ దోమ వల్ల వచ్చే డెంగ్యు కు కారణమైనా దోమ వల్లే జికా వ్యాపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాగా ఈజిప్ట్ దోమ మూడు రోజుల్లో పెర్గుతుందని రెండు వారాల తరువాత దీని లక్షణాలు బయట పడతాయని ఈలక్షనాలు 2 ,లేదా 3 రోజులు ఉంటాయని, అలాగే ఈ లక్షనాలు కనపడవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ముఖ్యంగా జ్వరం,కండరాల నొప్పులు,జాయింట్స్ లలో నొప్పులు తల నొప్పి కాళ్ళ కలక,దద్దుర్లు వస్తాయని వైద్యులు తెలిపారు. చుకున్ గునియా గర్భిణీలకు ఆత్యంత ప్రమాదకరమని దీనివల్ల పుట్టిన పిల్లలు కొన్నిరకాల్ అంగ వైకల్యంతో పుట్టవచ్చని ఈ అంశాన్ని గమనించాలని పేర్కొన్నారు దీనికి ప్రత్యేకంగా మందులు లభ్యం కాలేదని,డీ హై ద్రేషణ్ రాకుండా చూసుకోవాలని జ్వరం వస్తే tyenole(r) లేదా acetominophin,వాడవచ్చునని స్తేరాయిడ్స్ కు దూరంగా ఉండాలని,ఇతర సమస్యలతో బాధ పడే వారు డాక్టర్ను ను సంప్రదించాలని డబ్ల్యు హెచ్ ఓ సూచించింది. పైన పేర్కొన్న లక్షణాలు ఉన్న వారు లేదాఅనుమానితుల కోవిడ్ లక్షణాలు ఉన్న వారినుండి స్యాంపుల్ సేకరించాలని వీటిని వైరాలజీ ల్యాబ్ కు పంపాలని,ముఖ్యంగా గర్భిణీలు,అప్పుడే పుట్టిన పిల్లల సీరం నమూనాలు వైరాలజీ ల్యాబ్ కు పంపాలని సూచించారు. కేరళా లో ఇప్పటికే 24 సంవత్సరాల గర్భిణిలో జికా కనిపించిందని,త్రివేండ్రంలో మరో 13 మంది లో ముగ్గురికి జికా ఉందన్న అనుమానం వ్యక్తం చేసారు.ఈమేరకు రోగుల నమూనాలను పూనా వైరాలజీ కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈమేరకు కేరళలో జికా వైరస్ కేసులు వెలుగు చూడడం తో కర్ణాటకా ప్రభుత్వం అప్రతమైంది ఈమేరకు కర్ణాటకా రాష్ట్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది దక్షిణ కర్నాటకలోని ఉడిపి,చామ రాజ నగరం కర్ణాటక సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేసాలలో పేర్కొంది.జికా వైరస్ విస్తరించే అవకాసం ఉన్నందున ఆశా,హెల్త్ వర్కర్స్ గ్రామీణ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని,యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కర్ణాటకా రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా కమీషనర్డాక్టర్ త్రిలోక్ ఒక ప్రకటనలోఆదేశాలు జరీ చేసినట్లు సమాచారం.
read more










.jpg)








.jpg)


