మాస్ డైరెక్టర్ మార్క్ యాక్షన్లో కార్తీ.. ఫిలిం నగర్ లేటెస్ట్ అప్డేట్!
టాలీవుడ్లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను. ఆయన తెరకెక్కించే యాక్షన్ సీక్వెన్స్, హీరోలకు ఇచ్చే పవర్ఫుల్ ఎలివేషన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయి. తాజాగా ఈ మాస్ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఇద్దరి కలయికలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోందని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. నిజానికి బోయపాటి తన తదుపరి చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పట్టాలెక్కలేదు. ఈ క్రమంలోనే బోయపాటి తన పదునైన కథకు కార్తీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతారని భావించి, ఆయనను సంప్రదించినట్లు సమాచారం. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న కార్తీ, బోయపాటి చెప్పిన లైన్ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.నటుడిగా కార్తీకి ఉన్న వైవిధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'యుగానికొక్కడు' నుంచి మొన్నటి 'పొన్నియిన్ సెల్వన్', 'సర్దార్' వరకు ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేశారు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ను మెప్పించడంలో ఆయన దిట్ట. ఇప్పుడు బోయపాటి మార్క్ ఊర మాస్ యాక్షన్ తోడైతే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు మొదలుపెట్టేశారు. గతంలో బోయపాటి శ్రీను బాలయ్యతో చేసిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల వచ్చిన ఆయన చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఈసారి కార్తీతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని బోయపాటి కసిగా ఉన్నారట. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం కార్తీ తన కమిట్మెంట్లను పూర్తి చేసే పనిలో ఉండగా, బోయపాటి స్క్రిప్ట్ వర్క్ను ఫైనలైజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే మాత్రం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒక భారీ మాస్ జాతర మొదలైనట్టే! మరి ఈ కొత్త కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
May 10, 2026
Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మహేష్ తర్వాత మళ్ళీ 'ఆర్ఆర్ఆర్' హీరోలతోనేనా?
- 'వారణాసి' తర్వాత రాజమౌళి మూవీ ఏ హీరోతో? - ఎన్టీఆర్, రామ్ చరణ్ వైపే జక్కన్న మొగ్గు చూపుతున్నాడా? - మరో మల్టీస్టారర్ చేసే సాహసం చేస్తాడా? - ఆ రెండు స్టోరీలతో దర్శకధీరుడు వేస్తున్న స్కెచ్ ఏంటి? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' (Varanasi) సినిమా చేస్తున్నారు. ఈ భారీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుంది అనే చర్చ మొదలైపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'వారణాసి' సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్'తో ఈ ఇద్దరు హీరోలకు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అలాగే, రాజమౌళితో వారికున్న బాండింగ్ కూడా చాలా ప్రత్యేకమైనది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం విడివిడిగా రెండు పవర్ఫుల్ కథలను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఏ కథ ముందుగా కొలిక్కి వస్తే.. ఆ హీరోతో సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. గతంలో వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్ చేసిన రాజమౌళి.. ఈసారి మాత్రం విడివిడిగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం ఆయన బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లు టాక్. అలాగే రామ్ చరణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని మరో భారీ కథపై కసరత్తు జరుగుతోందట. ఈ ఇద్దరు హీరోలలో ఎవరితో ముందుగా సినిమా సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బహుశా రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్తో కలిసి ఈ రెండు స్క్రిప్టులపై సమాంతరంగా చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి రాజమౌళి పూర్తి దృష్టి మహేష్ బాబు సినిమాపైనే ఉంది. 'వారణాసి' మూవీ ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది పూర్తి కాగానే తన తదుపరి హీరో ఎవరనే దానిపై జక్కన్న అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.
May 09, 2026
'జాతి రత్నాలు' అనుదీప్ నెక్స్ట్ మూవీ.. హీరో ఎవరో తెలిస్తే షాక్!
కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో నితిన్ (Nithiin), వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. దర్శక ద్వయం నారి సిరిసవాడ, సోమశేఖర్ టి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ(Anudeep KV)తో నితిన్ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనుదీప్ తనదైన శైలిలో సిల్లీ అండ్ హిలేరియస్ కామెడీని పండించడంలో దిట్ట. నితిన్ కూడా 'భీష్మ' వంటి సినిమాలతో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటంతో వినోదం రెట్టింపు అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' (People Media Factory) నిర్మించనుందని సమాచారం. అనుదీప్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడని, నితిన్ బాడీ లాంగ్వేజ్కు తగినట్లుగా కథను సిద్ధం చేశాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది. అనుదీప్ గత చిత్రం 'ఫంకీ' నిరాశపరిచింది. ఇప్పుడు ఈ సినిమాతో తాను హిట్ కొట్టడమే కాకుండా, నితిన్ ను కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి.
May 08, 2026
Allu arjun: మాటలు మారాయి.. రాకా తాజా న్యూస్ నిజమేనా!
పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ కి కట్ అవుట్ ని పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రెజెంట్ 'రాకా'(Raaka)తో ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తో అయితే చిన్నప్పుడు మనం చెప్పుకొని మర్చిపోయిన చందమామ కథల్ని రాకా కథ గురించి చెప్పుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. రీసెంట్ గా రాకా గురించిన ఒక ఫ్రెష్ రూమర్ నన్నెవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదనే రీతిలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం తన బర్త్ డే సందర్భంగా సంవత్సరానికి రెండు చిత్రాలని చేస్తాన ని అల్లు అర్జున్ ప్రకటించాడు. ఈ నేపధ్యంలో రాకా కి ఎక్కువ టైంని స్పెండ్ చేయకూడదని అల్లు అర్జున్ ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది వేసవి కంటే ముందే రాకా రావచ్చనే మాటలు వినపడుతున్నాయి.లోకేష్ కనగరాజ్ తో కూడా అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తాను ఇచ్చిన మాట ప్రకారం రెండు సినిమాలు రావాలంటే రాకా ని త్వరగా ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నాడనే రూమర్స్ మొదలయ్యాయి. Also read: VIjay: పీచే ముడ్.. విజయ్ పై ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్ రాకా మాత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత హై బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండనున్నాయి. ఏ విషయంలోను అట్లీ(Atlee)కాంప్రమైజ్ కావడం లేదు. దీపికా పదుకునే పై కొన్ని కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరణ జరుపుకున్న రాకాని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.
May 07, 2026
Balakrishna: ముఖ్యమంత్రిగా నందమూరి బాలకృష్ణ!
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో భారీ సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా ఇది. 'NBK112' వర్కింగ్ టైటిల్ రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. కొరటాల మార్క్ పొలిటికల్ డ్రామా దర్శకుడు కొరటాల శివ తన సినిమాల్లో సామాజిక బాధ్యతతో కూడిన అంశాలను చర్చిస్తూనే, కమర్షియల్ ఎలిమెంట్స్ను అద్భుతంగా జోడిస్తారు. గతంలో 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబును ముఖ్యమంత్రిగా చూపించి మెప్పించిన కొరటాల, ఇప్పుడు బాలయ్య కోసం అంతకు మించిన పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. "పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఏ మూవ్మెంట్" (Power Meets Purpose.. Mass Becomes A Movement) అనే క్యాప్షన్తో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమా మూడ్ను క్లియర్ గా ఎలివేట్ చేస్తోంది. ఈ కథలో బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ మేకింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా నటసింహాం గర్జన బాలకృష్ణకు రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో 'అధినాయకుడు' వంటి చిత్రాల్లో రాజకీయ నాయకుడిగా కనిపించినా.. ఇప్పుడు కొరటాల శివ డిజైన్ చేసిన సీఎం పాత్ర చాలా హుందాగా, అదే సమయంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఉంటుందని టాక్. సమాజంలోని అవినీతిని అంతం చేసే ఒక నిజాయితీ గల నాయకుడిగా బాలయ్య నటన ఈ సినిమాకు హైలైట్ కానుంది అంటున్నారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్, కొరటాల శివ క్లాస్ మేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పాత్రలో బాలయ్యను ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.
May 02, 2026
Balakrishna: కలలో కూడా ఊహించని కాంబో.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో బాలయ్య సినిమా!
- రూట్ మార్చిన బాలయ్య - ఊహించని డైరెక్టర్ తో సినిమా - క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో డిఫరెంట్ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్లు తెరపైకి వస్తుంటాయి. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. క్లాస్ సినిమాల స్పెషలిస్ట్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) & మాస్ సినిమాల పవర్ హౌస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, ఈ కాంబో సెట్ అయితే టాలీవుడ్లో ఇది ఒక మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు. క్లాస్ వర్సెస్ మాస్: ఒక కొత్త ప్రయోగం శేఖర్ కమ్ముల అనగానే మనకు 'ఆనంద్', 'గోదావరి', 'ఫిదా' వంటి సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సినిమాలు గుర్తొస్తాయి. ఆయన కథల్లో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. మరోవైపు బాలయ్య సినిమా అంటే హై-వోల్టేజ్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, మాస్ జాతర ఉండాల్సిందే. అయితే శేఖర్ కమ్ముల ఇప్పుడు బాలయ్య కోసం ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. బాలకృష్ణకు కూడా కొత్త తరహా కథలు వినడం, యువ దర్శకులకు అవకాశాలివ్వడం అంటే ఇష్టం. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా, తన మార్క్ నేటివిటీతో కూడిన ఒక బరువైన పాత్రలో బాలయ్యను చూపించే ప్లాన్ లో శేఖర్ కమ్ముల ఉన్నారట. ఇది ఒక పొలిటికల్ డ్రామా అయ్యే అవకాశముంది అంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే బలమైన ఎమోషన్స్ కు బాలయ్య నటన తోడైతే, అది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో డౌట్ లేదు. అభిమానుల్లో ఆసక్తి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK111' చేస్తున్నారు. అలాగే కొరటాల శివతో ఓ సినిమా చేసే అవకాశముంది. ఇక ఇప్పుడు అనూహ్యంగా శేఖర్ కమ్ముల పేరు తెరపైకి వచ్చింది. శేఖర్ కమ్ముల వంటి దర్శకుడితో ఆయన జతకడితే, బాలయ్యలోని మరో యాక్టింగ్ డైమెన్షన్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇద్దరి ఆలోచనా ధోరణులు వేరైనా, సినిమా పట్ల ఇద్దరికీ ఉన్న ప్యాషన్ ఈ క్రేజీ కాంబోను సాకారం చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. శేఖర్ కమ్ముల విజన్ లో బాలయ్య ఎలా ఉంటారు? ఆ గంభీరమైన గొంతుతో కమ్ముల రాసే సహజమైన డైలాగ్స్ ఎలా పండుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తే మాత్రం అది బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం. క్లాస్ డైరెక్టర్ చేతిలో మాస్ హీరో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాల్సిందే.
Apr 30, 2026
Peddi: జూన్ 25 కాదు.. మళ్ళీ మారుతున్న 'పెద్ది' రిలీజ్ డేట్!
2026 జూన్ నెలలో రిలీజ్ కానున్న భారీ చిత్రాల విడుదల తేదీల విషయంలో గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, యశ్ సినిమాల మధ్య జరుగుతున్న ఈ రిలీజ్ డేట్ గేమ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. బుచ్చిబాబు ప్రకటనతో మొదలైన అలజడి ఇటీవల జరిగిన 'కర' మూవీ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' (Peddi) సినిమాను జూన్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటే, అఖిల్ అక్కినేని నటిస్తున్న 'లెనిన్' (LENIN) మూవీ జూన్ 26న విడుదల కావాల్సి ఉంది. చరణ్ సినిమాతో పోటీ పడటం ఎందుకని 'లెనిన్' వాయిదా పడుతుందనే ప్రచారం జోరుగా సాగింది. నాగార్జున క్లారిటీ.. తగ్గేదే లే! అయితే, ఈ పుకార్లకు కింగ్ నాగార్జున తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. 'లెనిన్' ఫస్ట్ కట్ చూశానని, సినిమా అద్భుతంగా వచ్చిందని ప్రశంసించారు. అంతేకాకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 26, 2026న 'లెనిన్' థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో జూన్ ఆఖరి వారంలో రామ్ చరణ్ vs అఖిల్ పోరు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. టాక్సిక్ వాయిదా.. పెద్దికి అడ్వాంటేజ్? మరోవైపు, జూన్ 4న విడుదల కావాల్సిన యశ్ 'టాక్సిక్' (Toxic) మూవీ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ కారణాలతో వాయిదా పడింది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు 'పెద్ది' మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ 'పెద్ది' జూన్ 4కి వస్తే, అఖిల్ 'లెనిన్'కు సోలో రిలీజ్ దక్కుతుంది. కానీ బుచ్చిబాబు జూన్ 25 అని చెప్పడంతో ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 'పెద్ది' రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి బుచ్చిబాబు చెప్పినట్టుగా జూన్ 25న వచ్చి 'లెనిన్'కి షాక్ ఇస్తుందో లేక 'టాక్సిక్' తప్పుకోవడంతో ఖాళీ అయిన జూన్ 4 కి వస్తుందో చూడాలి.
Apr 29, 2026లెనిన్.. రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం.. మరోసారి వాయిదా?
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'లెనిన్' విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల తేదీ మరోసారి మారే అవకాశం ఉందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొదట 'లెనిన్' చిత్రాన్ని మే 1, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న వస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద అనవసర పోటీని నివారించడానికి 'లెనిన్' మేకర్స్ తమ సినిమాను జూన్ 26, 2026కి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూన్ 26 రిలీజ్ డేట్ను ఖరారు చేసినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ తేదీ కూడా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు: సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. అవుట్పుట్ విషయంలో రాజీ పడకూడదని నిర్మాత నాగార్జున భావిస్తున్నారట. రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం కూడా మే నెల నుండి జూన్ నెలాఖరుకు లేదా జూలైకి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ 'పెద్ది' జూన్ 26న రావాలని నిర్ణయించుకుంటే, అప్పుడు 'లెనిన్' మూవీని జూలై 24 లేదా ఆగస్టు నెలలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Apr 24, 2026
Rajinikanth: రజనీకాంత్ సినిమాలో విలన్గా స్టార్ డైరెక్టర్?
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'శివాజీ', 'రోబో', '2.0' సినిమాలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, త్వరలో రాబోతున్న #Thalaivar173 ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఒక షాకింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈసారి శంకర్ దర్శకత్వం వహించడం లేదు.. రజనీకి విలన్గా నటించబోతున్నారట. రజనీకాంత్ తన 173వ సినిమాను సిబి చక్రవర్తి దర్శకత్వంలో చేయనున్నారు. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి వినిపిస్తున్న తాజా వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇందులో విలన్ పాత్ర కోసం ఏకంగా దర్శకుడు శంకర్ను సంప్రదించినట్లు సమాచారం. దర్శకుడిగా మారకముందు శంకర్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అయితే, పూర్తిస్థాయి విలన్ పాత్రలో ఆయన కనిపించడం ఇదే మొదటిసారి అవుతుంది. రజనీకాంత్ వంటి మాస్ హీరోకు దీటుగా ఉండే పవర్ఫుల్ విలన్ పాత్రలో శంకర్ కనిపిస్తే కొత్తగా ఉంటుంది. ఒకవేళ ఇది నిజమైతే, వెండితెరపై శంకర్-రజనీ మధ్య పోరు చూడటం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది. ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ ఏంటంటే.. లోకనాయకుడు కమల్ హాసన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. రజనీకాంత్, కమల్ హాసన్, శంకర్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. శంకర్ విలనిజం, రజనీ స్వాగ్ కలగలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Apr 24, 2026బాలయ్యతో కొరటాల శివ క్రేజీ ప్రాజెక్ట్.. ఇక దేవర2 లేనట్టేనా?
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా పార్ట్-1 ఘనవిజయం సాధించడంతో, అందరి దృష్టి ఇప్పుడు ‘దేవర 2’పై పడింది. అయితే, తాజాగా ఫిలిం నగర్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దేవర సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ గ్యాప్లో కొరటాల శివ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్స్ మారడం దేవర సీక్వెల్పై ప్రభావం చూపుతోంది. ఈ సినిమా విడుదల తేదీని 2027 జూన్ 11గా చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అంటే వచ్చే ఏడాది పొడవునా తారక్ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కే తన సమయాన్ని కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో దేవర-2 పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యం కాదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, ఖాళీగా ఉండటం ఇష్టం లేని కొరటాల శివ, ఈ విరామంలో ఒక భారీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకు లైన్ వినిపించడం, దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగిపోయాయని సమాచారం. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి సినిమాలతో మెసేజ్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ను అద్భుతంగా పండించే కొరటాల, బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా ఒక పొలిటికల్ లేదా సోషల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు దేవర సీక్వెల్ ఆలస్యం కావడంతో, బాలయ్య-కొరటాల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, నందమూరి అభిమానులకు ఇది ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ టేకింగ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. మరోవైపు, మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర సీక్వెల్పై లేదా ఆయన తదుపరి చిత్రాలపై ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్తో తారక్ చేయబోయే 'గాడ్ ఆఫ్ వార్' సినిమా అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఒకవేళ తారక్ ఇతర సినిమాలతో బిజీగా ఉంటే, కొరటాల శివ తన పూర్తి ఫోకస్ను బాలయ్య సినిమాపైనే పెట్టనున్నారు.
Apr 21, 2026మంగళవారం సీక్వెల్కు రంగం సిద్ధం.. నిర్మాణంలో క్రేజీ డైరెక్టర్!
- భారీ బడ్జెట్తో సీక్వెల్! - 'మంగళవారం' పార్ట్ 2 లేటెస్ట్ అప్డేట్! - కొరటాల శివ సపోర్ట్తో అజయ్ భూపతి ప్లాన్! టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి సృష్టించిన విజువల్ వండర్ ‘మంగళవారం’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన కథాంశంతో, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుండటం ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఆర్ఎక్స్ 100’ తో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్న అజయ్ భూపతి, ఈ రెండో భాగంతో తన విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘మంగళవారం 2’ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రేజీ సీక్వెల్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ భూపతి రీసెంట్గా కొరటాల శివను కలిసి పార్ట్ 2 కథాంశాన్ని వినిపించారని, ఆ పాయింట్ విన్న వెంటనే కొరటాల ఇంప్రెస్ అయ్యి ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారని టాక్. ప్రస్తుతం అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తికాగానే ‘మంగళవారం 2’ పనులను వేగవంతం చేయనున్నారు. కొరటాల శివతో పాటు ఆయన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ కూడా ఈ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారట. మొదటి పార్ట్ కంటే రెట్టింపు బడ్జెట్తో, అంతకు మించిన ఇంటెన్సిటీతో ఈ సీక్వెల్ ఉండబోతుందని సమాచారం. గత ఏడాది విడుదలైన ‘మంగళవారం’ చిత్రంలో పాయల్ రాజ్పుత్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించింది. సీక్వెల్లో కూడా అదే స్థాయి టెక్నికల్ టీమ్తో పాటు, మరింత పవర్ఫుల్ స్టార్ కాస్టింగ్ ఉండేలా అజయ్ భూపతి ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్లో మిగిలిపోయిన కొన్ని ప్రశ్నలకు ఈ సెకండ్ పార్ట్లో సమాధానాలు లభిస్తాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ వార్త రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అజయ్ భూపతి టేకింగ్కు కొరటాల శివ విజన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హారర్, థ్రిల్లర్ జోనర్ను ఇష్టపడే వారికి ఈ సీక్వెల్ పెద్ద పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల సెలెక్షన్ మరియు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కొరటాల శివ లాంటి పెద్ద దర్శకుడు ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకోవడంతో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ‘మంగళవారం 2’ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.
Apr 18, 2026
Balakrishna: మోక్షజ్ఞకు కథ చెప్పడానికి వెళ్ళిన చిరంజీవి దర్శకుడు.. బాలకృష్ణ చేసిన పనికి షాక్!
'బింబిసార' వంటి సోషియో ఫాంటసీ హిట్తో సత్తా చాటిన యువ దర్శకుడు వశిష్ట, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' (Vishwambhara) అనే భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. అయితే, వశిష్ట కెరీర్లో ఒక వింతైన సెంటిమెంట్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ సెంటిమెంట్ ఏంటంటే.. వారసుల కోసం కథలు పట్టుకెళ్తే, తండ్రులతో సినిమాలు ఓకే అవుతున్నాయి. రామ్ చరణ్ తో సినిమా ప్లాన్! వశిష్ట తన రెండో సినిమా కోసం మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను సంప్రదించారు. చరణ్ కోసం ఒక అద్భుతమైన సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేసి వినిపించారు. చరణ్కు ఆ కథ నచ్చినప్పటికీ, అప్పటికే ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల సమయం పట్టింది. అదే సమయంలో ఈ కథా చర్చల్లో చిరంజీవికి ఒక లైన్ చెప్పడం, అది ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే 'విశ్వంభర' ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అలా చరణ్ కోసం అనుకున్న ప్లాన్, చిరంజీవితో భారీ విజువల్ వండర్గా మారింది. ఇప్పుడు మోక్షజ్ఞ విషయంలోనూ అదే సీన్! ప్రస్తుతం నందమూరి అభిమానులంతా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ లాంచ్ కోసం బాలకృష్ణ సరైన దర్శకుడి వేటలో ఉండగా, వశిష్ట ఒక ఇంట్రెస్టింగ్ కథను మోక్షజ్ఞకు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. బాలయ్యకు కూడా ఆ కథ నచ్చింది. కానీ, ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. మోక్షజ్ఞ తన మొదటి సినిమా ప్రేమ కథ అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట. మరోవైపు ఈ కథా చర్చల సమయంలో బాలయ్యకు కూడా ఓ కథ వినిపించారట వశిష్ట. కథ బాగా నచ్చడంతో.. మోక్షజ్ఞ సినిమా కంటే ముందు వశిష్ట దర్శకత్వంలో బాలకృష్ణ ఒక ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంటే మెగా కాంపౌండ్లో జరిగినట్లే, ఇక్కడ కూడా కొడుకుతో సినిమా చేయాలని వెళ్తే, తండ్రి ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సోషియో ఫాంటసీపై పట్టు వశిష్ట శైలిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన రాసుకునే కథలు ఫాంటసీ అంశాలతో ముడిపడి ఉంటాయి. బాలయ్యకు ఇలాంటి సోషియో ఫాంటసీ కథలంటే ప్రాణం. అందుకే వశిష్టతో సినిమా చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ‘విశ్వంభర’ విడుదలై మంచి విజయం సాధిస్తే, బాలయ్య-వశిష్ట కాంబినేషన్పై భారీ అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.
Apr 16, 2026
Varanasi: 'వారణాసి'లో శివుడిగా హృతిక్ రోషన్!
- 'వారణాసి'లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్? - శివుడి పాత్రలో కనిపించనున్న గ్రీక్ గాడ్! - మహేష్ ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్! - రాజమౌళి రిస్క్ చేస్తున్నారా? మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి' (Varanasi). ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఇది. గ్లోబ్ట్రాటర్ థీమ్తో సాగే ఈ సినిమా గురించి ప్రతి రోజూ ఒక కొత్త వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక రూమర్ ఇటు మహేశ్ ఫ్యాన్స్ను, అటు సినీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) శివుడి పాత్రలో కనిపించబోతున్నారట. రాముడిగా మహేష్! వారణాసి సినిమా కేవలం ఒక జంగిల్ అడ్వెంచర్ మాత్రమే కాదు.. ఇందులో పురాణాలు, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయి. త్రేతాయుగం నాటి రహస్యాలను ఛేదించే క్రమంలో హీరో వారణాసి నుంచి ఆఫ్రికా అడవుల వరకు ప్రయాణిస్తాడని టాక్. ఇందులో మహేశ్ బాబు 'రుద్ర' అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. అలాగే, శ్రీరాముడి పాత్రలోనూ మహేష్ కనువిందు చేయనున్నారు. రాముడిగా మహేష్ ని తెరపై చూడటం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. శివుడిగా హృతిక్? 'వారణాసి'లో రాముడిగా మహేష్ కనిపించనున్నారని ఇప్పటికే అధికారికంగా తెలియగా.. ఇప్పుడు శివుడిగా హృతిక్ కనిపిస్తారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి లాంటి దర్శకుడు తన సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం మరో స్టార్ హీరోను పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. అయితే అది శివుడి పాత్ర కావడంతో.. ఒక స్టార్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో హృతిక్ను సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అభిమానులు ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు. వారణాసి ఘాట్ల నేపథ్యంలో హృతిక్ రోషన్ శివుడి వేషధారణలో ఉన్న ఏఐ ఫోటోలు, ఫ్యాన్ ఆర్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మళ్ళీ ఆ రిస్క్ చేస్తారా? గతంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు టాప్ స్టార్లను బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళి సక్సెస్ అయ్యారు. కానీ, ఆ తర్వాత ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన క్రెడిట్ వార్, సోషల్ మీడియా గొడవలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'వారణాసి' పూర్తిగా మహేశ్ బాబు చుట్టూ తిరిగే కథ. ఇందులో హృతిక్ లాంటి భారీ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు కనిపిస్తే.. మళ్ళీ క్రెడిట్ వార్ జరుగుతుందా? అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. హృతిక్ రోషన్ రాకపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. రాజమౌళి తన సినిమాల విషయంలో అత్యంత గోప్యత పాటిస్తారు కాబట్టి.. ఇది కేవలం రూమర్ గానే మిగిలిపోతుందా లేక థియేటర్లో బాంబు పేలుస్తారా అనేది చూడాలి. ఏదేమైనా, హృతిక్ శివుడిగా కనిపిస్తే మాత్రం అది ఇండియన్ స్క్రీన్ పై ఒక విజువల్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు.
Apr 14, 2026
NTR Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో అలియా భట్.. రుక్మిణి వసంత్ పరిస్థితి ఏంటి?
టాలీవుడ్ లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్ లలో 'డ్రాగన్' (Dragon) ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) నటించబోతోందనే వార్త నెట్టింట వైరల్గా మారింది. మళ్ళీ కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ - అలియా! 'డ్రాగన్'లో ఇప్పటికే రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ఒక పవర్ ఫుల్ రోల్ కోసం అలియా భట్ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలో ఎన్టీఆర్ (కొమురం భీమ్), అలియా (సీత) కలిసి నటించిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ కి జోడిగా అలియా నటించినప్పటికీ.. ఎన్టీఆర్-అలియా మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆఫ్ స్క్రీన్ లోనూ వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఎన్టీఆర్-అలియా కాంబో అనగానే ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలు.. మరింత స్టార్ పవర్! ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే విజువల్ గ్రాండియర్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లకు పెట్టింది పేరు. ఇప్పటికే 'కెజిఎఫ్', 'సలార్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన నీల్.. ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్టును సిద్ధం చేశారని టాక్. అలియా వంటి స్టార్ నటి ఈ ప్రాజెక్ట్లో చేరితే సినిమా స్థాయి మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. కీలక పాత్రలో అలియా? డ్రాగన్ సినిమాలో అలియా భట్ హీరోయిన్గా కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో మహిళా పాత్రలను ఎంతో శక్తివంతంగా తీర్చిదిద్దుతారు. ఈ క్రమంలోనే డ్రాగన్ కోసం ఒక పవర్ ఫుల్ రోల్ రాసి, ఆ రోల్ కోసం అలియాను సంప్రదించినట్లు టాక్. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు ప్రస్తుతం ఈ వార్తలపై అటు చిత్ర యూనిట్ నుంచి కానీ, ఇటు అలియా భట్ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. అలియా నిజంగానే ఈ ప్రాజెక్ట్లో భాగమవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Apr 14, 2026
Ram Charan: రామ్ చరణ్ - సంజయ్ లీల భన్సాలీ కాంబో మూవీ.. స్టోరీ ఇదే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, చరణ్ ఒక భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీల భన్సాలీతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ గురించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కథా నేపథ్యం సాధారణంగా సంజయ్ లీల భన్సాలీ సినిమాలంటే ప్యాలెస్లు, రాజసం, భారీ సెట్టింగ్లు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి ఆయన రామ్ చరణ్ కోసం ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సాగే జంగిల్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్లతో పాటు, గుండెను హత్తుకునే భావోద్వేగాలు, రోమాంచితమైన సాహసాలు ఉండబోతున్నాయట. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన మాస్ ఇమేజ్కి సరిపోయేలా భన్సాలీ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు టాక్. పాన్-ఇండియా రేంజ్.. బాలీవుడ్ డైరెక్షన్! ఈ ప్రాజెక్ట్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాని సంజయ్ లీల భన్సాలీ నిర్మిస్తుండగా, ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు దీనిని తెరకెక్కించే అవకాశం ఉంది. సినిమాను హిందీలో చిత్రీకరించి, ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక భారీ బడ్జెట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్గా రూపొందనుంది. నెక్స్ట్ లెవల్ అంచనాలు 'RRR' తర్వాత రామ్ చరణ్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. వీటి తర్వాత భన్సాలీ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశముంది. రామ్ చరణ్ తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఒక భిన్నమైన కథతో ముందుకు రావడం, అది కూడా భన్సాలీ నిర్మాణంలో కావడం ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Apr 11, 2026వాయుపుత్రకు బ్రేక్? బడ్జెట్ టెన్షన్లో నాగవంశీ.. అసలేం జరిగింది?
- భారీ ఖర్చుకు వెనుకాడుతున్న నాగవంశీ - యానిమేషన్ సినిమాకి ఓటీటీ షాక్.. - నాగవంశీ ఆలోచన ఇదేనా! టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులకు కొదవలేదు. ముఖ్యంగా సోషియో ఫాంటసీ, మైథాలజీ అంశాలతో కూడిన సినిమాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్తో సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి, హనుమంతుడి ఇతివృత్తంతో 'వాయుపుత్ర' అనే యానిమేషన్ చిత్రాన్ని ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో ప్లాన్ చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు అనిశ్చితిలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వాయుపుత్ర సినిమాకు సంబంధించి బడ్జెట్ లెక్కలు నిర్మాతలకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయని తెలుస్తోంది. పూర్తి స్థాయి యానిమేషన్, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రాన్ని రూపొందించాలంటే దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇటీవలే యానిమేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన కొన్ని చిత్రాలు సక్సెస్ కావడంతో ఈ సినిమాపై మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే అంత భారీ మొత్తాన్ని వెచ్చించడం రిస్క్ అని భావిస్తున్నారట. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ విషయంలో చిత్ర యూనిట్కు ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్తో నిర్వహించిన చర్చల్లో కేవలం 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా మేకింగ్ ఖర్చులో ఇది సగం కూడా కాకపోవడంతో నిర్మాత నాగవంశీ డైలమాలో పడ్డారు. మిగిలిన భారీ మొత్తాన్ని కేవలం థియేట్రికల్ వసూళ్ల మీద నమ్ముకుని ఇన్వెస్ట్ చేయడం క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు చందూ మొండేటి గతంలో 'కార్తికేయ 2'తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో కృష్ణుడి తత్త్వాన్ని చూపించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే నమ్మకంతో హనుమంతుడిపై ఒక విజువల్ వండర్ చేయాలని ఆయన భావించారు. కానీ ఇప్పుడు బడ్జెట్ మరియు ఓటీటీ బిజినెస్ మధ్య సమతుల్యత కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ను తాత్కాలికంగా పక్కన పెట్టాలని (Hold) నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా రంగంలో ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఆదరణ దక్కుతున్నప్పటికీ, యానిమేషన్ సినిమాలకు మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో స్థిరపడలేదు. దీంతో ఇంత పెద్ద సాహసం చేయడం అవసరమా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేదా కేవలం వాయిదా మాత్రమే పడిందా అనే విషయంపై సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
Apr 09, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



