సౌతిండియాలోనే ఎక్కువమంది చూసిన షార్ట్ ఫిలింగా ‘పీకే 2’
on Aug 19, 2017
‘వంద కోట్లు, రెండోందల కోట్లు.. అని వసూళ్ల గురించి చెబుతూ...చంకలు గుద్దుకోవడం సినిమావాళ్లకు పరిపాటైపోయింది. . కానీ.. ఇది ఆనందించాల్సిన విషయం కాదు. బాధ పడాల్సిన విషయం. వంద కోట్ల జనాభా ఉన్న మన భారత దేశంలో ఓ సినిమాకు కేవలం రెండోందల కోట్ల రూపాయలు మాత్రమే వసూళ్లు వస్తున్నాయంటే... ఆ సినిమాను ఎక్కువమంది చూడటం లేదని అర్థం. నిజానికి మన భారతీయ సినిమా విడుదలైతే... వెయ్యికోట్లు వసూళ్లు రావాలి. మన దేశ జనాభానీ, టికెట్ రేట్ ని పరిగణలోకి తీసుకొని చూస్తే అది నిజమని మీరే ఒప్పుకుంటారు’అని ఓ సందర్భంలో కమల్ హాసన్ అన్నారు. ఆయన చెప్పింది నిజం. పెరిగిన టికెట్ ధర వందల్లో ఉంటుంటే... చూసేవాళ్లు తక్కకువైనా... వసూళ్లు గ్రాండ్ గానే అనిపిస్తాయి. నిజానికి అవి సరైన వసూళ్లు కావు. అదే సినిమాను అందరూ చూస్తే... వసూళ్ల సునామీనే.
ఇప్పుడు ఇదంతా దేనికి చెబుతున్నామంటే.. సినిమాను ఒకసారి చూడడమే గగనమైపోతున్న నేటి రోజుల్లో... ఓ షాట్ ఫిలిం 30 కోట్ల వ్యూస్ వచ్చాయ్. అదే ఓ సినిమాను 30 కోట్లమంది చూస్తే... ఇప్పుడున్న టికెట్ రేట్లను బట్టి వేల కోట్ల వసూళ్లు వస్తాయ్. ఏమంటారు? ఇంతకీ 30 కోట్ల వ్యూస్ వచ్చిన ఆ షాట్ ఫిలిం పేరు చెప్పనేలేదు కదూ.. దాని పేరు ‘పీకే 2’. అమీర్ ఖాన్ ‘పీకే’ చిత్రాన్ని అనుకరిస్తూ.. ఈ షాట్ ఫిలింను హిందీలో తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి. దక్షిణభారతదేశంలోనే ఎక్కువమంది చూసిన షాట్ ఫిలింగా ‘పీకే 2’ నిలిచింది.
ఈ షాట్ ఫిలింకి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ రెడ్డిని నిజంగా అభినందించాలి. కేవలం వినోదం మాత్రమే కాకుండా... గ్లోబల్ వార్నింగ్ గురించి విశ్లేషణాత్మకమైన వివరణ ఇస్తూ... మనిషి బాధ్యతాయుతంగా ఉండాలని చెబుతూ.. వినోదంతో కూడిన సందేశంతో ‘పీకే 2’ను మిలిచాడు శ్రీకాంత్ రెడ్డి. నిజానికి ‘బాహుబలి’ సినిమానే 30 కోట్ల మంది చూసుండరు. ఇంతటి సంచలనాత్మకమైన షాట్ ఫిలిమ్ ని మనకందించిన శ్రీకాంత్ రెడ్డికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతుందీ ‘తెలుగు వన్’.