నాగ్పై రివేంజ్ తీర్చుకుంటానంటున్న శ్రీనువైట్ల..!
on Apr 25, 2016
శ్రీనువైట్ల..టాలీవుడ్లో కామెడీ కమ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కడుపుబ్బా నవ్వించే కామెడీతో క్యారెక్టర్స్ సృష్టించి నవ్వుల పువ్వులు పూయిస్తాడు శ్రీను. అలాంటి శ్రీనుకు ఎవరితోనైనా ప్రాబ్లమ్స్ వస్తే వారిని తన సినిమాల్లో టార్గెట్ చేస్తాడు. "దుబాయ్ శ్రీను"లో ఎమ్మెస్ నారాయణ, "కింగ్"లో బ్రహ్మానందం, "బాద్షా" లో ఎమ్మెస్ నారాయణ క్యారెక్టర్లలో శ్రీను ఎవరిని టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బ్రూస్లీ పరాజయం తర్వాత మెగా హీరో వరుణ్తేజ్తో ఓ సినిమా తీయబోతున్నాడు శ్రీనువైట్ల. ఈ చిత్రంలో కింగ్ నాగార్జునపై సెటైర్లు వేయనున్నాడు. అఖిల్ సినిమా ఛాన్స్ కోసం నాగ్ చుట్టూ తిరిగాడు శ్రీను. అయినా నాగ్ ఒప్పుకోలేదు. దానికి తోడు "కింగ్" సినిమాలో నాగార్జునకి, శ్రీనుకి మధ్య వివాదం చేలరేగినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వీటన్నింటి ద్వారా తనకు జరిగిన అవమానానికి వరుణ్ తేజ్ సినిమా ద్వారా మన్మథుడిపై పగ తీర్చుకుంటాడని టాక్. నాగ్ లేటేస్ట్ హిట్ మూవీస్ "సోగ్గాడే చిన్నినాయనా", "మనం", "ఊపిరి" చిత్రాలనుగా స్పూఫ్గా తీయనున్నాడని సమాచారం.