Home

»

Latest News

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన షారుఖ్‌

Oct 27, 2014

అత్తారింటికి దారేది... టాలీవుడ్‌లో స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించిన సినిమా. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ... ఈ సినిమా పేరుమీదే ఉన్నాయి. బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని, షారుఖ్ ఖాన్ అందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తార‌ని వార్త‌లొచ్చాయి. షారుఖ్ ఈ సినిమాని చూశార‌ని, ప‌వ‌న్ పాత్ర విప‌రీతంగా న‌చ్చి - ఈ సినిమా చేయ‌డానికి ఒకే చెప్పాడ‌ని చెప్పుకొన్నారు. అయితే అదంతా ఉత్తుత్తినేన‌ట‌. అస‌లు అత్తారింటికి దారేది సినిమాని షారుఖ్ చూడ‌లేద‌ట‌. ఇక రీమేక్ ప్ర‌స్తావ‌న ఎందుకొస్తుంది.?? ''అత్తారింటికి దారేది సినిమాని నేనేం రీమేక్ చేయ‌డం లేదు. అస‌లు ఆ సినిమా చూళ్లేదు. నిజానికి గ‌త కొంత కాలంగా ద‌క్షిణాది సినిమాల్ని చూడ‌డం లేదు'' అని షారుఖ్ ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టాడు. సో... ప‌వన్ సినిమాని షారుఖ్ రీమేక్ చేస్తాడ‌ని చెప్ప‌డం క‌ట్టుక‌థే అన్న‌మాట‌.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com