గౌతమీపుత్ర శాతకర్ణి కోసం భారీ సెట్..?
on May 6, 2016
బాలకృష్ణ తన వందో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీని కోసం ఎక్కడా రాజీపడట్లేదు మూవీ టీం. సగంపైగా షూటింగ్, కీలక సన్నివేశాలను మొరాకోలో తెరకెక్కిస్తామని దర్శకుడు క్రిష్ ఇప్పటికే ప్రకటించేశాడు. ఆ తర్వాత మరిన్ని కీలక సన్నివేశాల్ని హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్లో తెరకెక్కిస్తామని మూవీ యూనిట్ చెబుతున్నారు. మొరాకో వెళ్లే లోపే క్రిష్ ఈ సెట్ పనుల్ని పూర్తి చేయించాలని చూస్తున్నారట. ఫారిన్ షెడ్యూల్ ముగిసిన తర్వాత, సినిమాలోని కీలక సన్నివేశాల్ని ఈ సెట్లో జరుపుతారని సమాచారం. ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు ఐదారు కోట్ల వరకూ ఖర్చుపెడుతున్నారని సినీ వర్గాలంటున్నాయి. తెలుగువారి చరిత్ర అని మొదటి రోజునుంచే ప్రచారం చేయడంతో, ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాలని బాలయ్య ముందునుంచీ మూవీ యూనిట్ కు చెబుతూ వస్తున్నారు. కాగా లెజండ్ సినిమాకు సంగీతం అందించిన దేవీశ్రీప్రసాద్, ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా, తన స్నేహితుడు రాజీవ్ రెడ్డితో కలిసి డైరెక్టర్ క్రిష్ శాతకర్ణిని నిర్మిస్తున్నారు. 2017 సంక్రాంతి రోజున రిలీజ్ కాబోతున్న శాతకర్ణి, బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా గా తెరకెక్కడం విశేషం.