Home

»

Latest News

"ఆదిత్య369" కి సీక్వెల్...?

May 26, 2012 11:02AM

"ఆదిత్య369" కి సీక్వెల్ రానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని హీరోయిన్ గా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, అనిత కృష్ణ నిర్మించగా విడుదలై ఘనవిజయం సాధించిన హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం"ఆదిత్య369". ఈ చిత్రం అప్పట్లో అపూర్వ ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించింది.

మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ "ఆదిత్య369" చిత్రానికి సీక్వెల్ గా మరో చిత్రం రానుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. అదే జరిగితే మళ్ళీ బాలకృష్ణే హీరోగా నటిస్తాడా...? మళ్ళీ సింగీతం శ్రీనివాసరావే ఈ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తాడా...? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరి కొన్నాళ్ళు వేచి ఉండాల్సిందే....!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com